ETV Bharat / sports

వినూత్నంగా రాజస్థాన్ జట్టు జెర్సీ ఆవిష్కరణ

రానున్న ఐపీఎల్​ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు జెర్సీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమాన్ని తమ ఆటగాళ్లతో పాటు ప్రపంచం మొత్తం వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేసింది ఫ్రాంఛైజీ. అదేలాగో మీరు చూడండి.

author img

By

Published : Apr 5, 2021, 10:45 AM IST

Rajasthan Royals launch new jersey for IPL 2021
వినూత్నంగా రాజస్థాన్ జట్టు జెర్సీ ఆవిష్కరణ

రానున్న ఐపీఎల్ కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది రాజస్థాన్​ రాయల్స్​. అది కూడా వినూత్న పద్ధతిలో.. రాజస్థాన్​లోని సవాయ్​ మాన్​సింగ్​ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రారంభించింది. ముంబయిలోని బయో బబుల్​లో ఉన్న తమ ఆటగాళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ అభిమానుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

రెడ్ బుల్​ ఇండియా భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్​ను ఏర్పాటు చేసింది రాజస్థాన్ ఫ్రాంఛైజీ. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై 3డీ వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ముందుగా స్టేడియం లైట్​ షోతో ప్రారంభమైన వీడియో.. తర్వాత స్టాండ్స్​ వరకు సాగింది. అనంతరం జైపుర్​ నగరంతో పాటు రాజస్థానీ​ సంస్కృతి, రెడ్​బుల్​తో ఫ్రాంఛైజీకి ఉన్న అనుబంధాన్ని ఇందులో చూపించింది.

ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాటు చేసిన తెరపై కొత్త జెర్సీ ధరించిన ఆటగాళ్ల 3డీ వీడియో ఆకట్టుకుంది. కొత్త జెర్సీ గులాబీ, నీలం రంగుల కలయికతో ఉంది. దీనిపై రాజస్థాన్ ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: లుకేమియాను జయించి.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించి

ఇదీ చదవండి: కుర్రాళ్లు.. తొలి అవకాశం అందుకుంటారా?

రానున్న ఐపీఎల్ కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది రాజస్థాన్​ రాయల్స్​. అది కూడా వినూత్న పద్ధతిలో.. రాజస్థాన్​లోని సవాయ్​ మాన్​సింగ్​ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రారంభించింది. ముంబయిలోని బయో బబుల్​లో ఉన్న తమ ఆటగాళ్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ అభిమానుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది.

రెడ్ బుల్​ ఇండియా భాగస్వామ్యంతో ఈ ప్రోగ్రామ్​ను ఏర్పాటు చేసింది రాజస్థాన్ ఫ్రాంఛైజీ. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై 3డీ వీడియోను ప్రత్యక్ష ప్రసారం చేసింది. ముందుగా స్టేడియం లైట్​ షోతో ప్రారంభమైన వీడియో.. తర్వాత స్టాండ్స్​ వరకు సాగింది. అనంతరం జైపుర్​ నగరంతో పాటు రాజస్థానీ​ సంస్కృతి, రెడ్​బుల్​తో ఫ్రాంఛైజీకి ఉన్న అనుబంధాన్ని ఇందులో చూపించింది.

ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాటు చేసిన తెరపై కొత్త జెర్సీ ధరించిన ఆటగాళ్ల 3డీ వీడియో ఆకట్టుకుంది. కొత్త జెర్సీ గులాబీ, నీలం రంగుల కలయికతో ఉంది. దీనిపై రాజస్థాన్ ఆటగాళ్లు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: లుకేమియాను జయించి.. ఒలింపిక్స్‌కు అర్హత సాధించి

ఇదీ చదవండి: కుర్రాళ్లు.. తొలి అవకాశం అందుకుంటారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.