ETV Bharat / sports

'భారత్​తో ద్వైపాక్షిక సిరీస్​కు పాక్ ఎప్పుడైనా రెడీ​' - టీమ్​ఇండియా పాక్​ మ్యాచ్​లుప

భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్​కు ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ సానుకూలంగా ఉన్నారని చెప్పాడు రమీజ్ రాజా. కానీ దీనితో చాలా అంశాల ముడిపడి ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.

Pakistan would be 70 to 80 percent ready to host India for a series: Ramiz Raja
'భారత్​తో ద్వైపాక్షిక సిరీస్​కు ఇమ్రాన్​ సానుకూలం.. కానీ!​'
author img

By

Published : Aug 5, 2020, 9:20 AM IST

భారత్​-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్​పై పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​కు ఎలాంటి అభ్యతరం లేదని అభిప్రాయపడ్డాడు ఆ దేశ మాజీ క్రికెటర్​ రమీజ్​ రాజా. ఈ విషయంలో ఇమ్రాన్​.. రాజకీయ పరిస్థితులతో పాటు ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నాడు. దాయాదికి ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రమీజ్​ రాజా చెప్పాడు.

"ఆట పరంగా అతడికి(ఇమ్రాన్​ ఖాన్​) ద్వైపాక్షిక సిరీస్​ విషయమై ఎలాంటి సమస్య ఉండదని వందశాతం చెప్పగలను. రాజకీయంగా మాత్రం ఇరు దేశాల మధ్య పరిస్థితులు వేరుగా ఉన్నాయి. టీమ్​ఇండియాను ఆహ్వానిస్తే పాక్​ ప్రజలు ఎలా స్పందిస్తారనేది మరో విషయం. భారత్ చివరగా 2004లో పాకిస్థాన్ పర్యటనకు వచ్చింది. అలాంటిది మళ్లీ జరగాలని కోరుకుంటున్నా. దాయాది దేశంతో ద్వైపాక్షిక సిరీస్​ నిర్వహించేందుకు పాక్​ 70-80 శాతం వరకు సిద్ధంగా ఉందని భావిస్తున్నాను" -రమీజ్​ రాజా, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​

భారత్​తో సిరీస్​ నిర్వహించేందుకు గతంలో పాక్​ చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ప్రపంచకప్​, ఆసియా కప్​ టోర్నీల్లో మాత్రం యధావిధిగా తలపడుతూనే ఉన్నారు. ఇరుదేశాలు చివరగా గతేడాది ప్రపంచకప్​లో మ్యాచ్ ఆడాయి. అందులో పాక్​పై 89 పరుగుల తేడాతో టీమ్​ఇండియా విజయం సాధించింది. 2013 భారత పర్యటన​ తర్వాత వీరిద్దరి మధ్య మరో సిరీస్​ జరగలేదు.

ఇదే విషయమై గతంలో స్పందించిన పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ) ఛైర్మన్​ ఎహ్సాన్​ మణి.. టీమ్​ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్​కు తాము ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాన్ని తిరిగి ప్రారంభించడంపై బీసీసీఐ వెనుక పరిగెత్తమని స్పష్టం చేశారు.

భారత్​-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్​పై పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​కు ఎలాంటి అభ్యతరం లేదని అభిప్రాయపడ్డాడు ఆ దేశ మాజీ క్రికెటర్​ రమీజ్​ రాజా. ఈ విషయంలో ఇమ్రాన్​.. రాజకీయ పరిస్థితులతో పాటు ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నాడు. దాయాదికి ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రమీజ్​ రాజా చెప్పాడు.

"ఆట పరంగా అతడికి(ఇమ్రాన్​ ఖాన్​) ద్వైపాక్షిక సిరీస్​ విషయమై ఎలాంటి సమస్య ఉండదని వందశాతం చెప్పగలను. రాజకీయంగా మాత్రం ఇరు దేశాల మధ్య పరిస్థితులు వేరుగా ఉన్నాయి. టీమ్​ఇండియాను ఆహ్వానిస్తే పాక్​ ప్రజలు ఎలా స్పందిస్తారనేది మరో విషయం. భారత్ చివరగా 2004లో పాకిస్థాన్ పర్యటనకు వచ్చింది. అలాంటిది మళ్లీ జరగాలని కోరుకుంటున్నా. దాయాది దేశంతో ద్వైపాక్షిక సిరీస్​ నిర్వహించేందుకు పాక్​ 70-80 శాతం వరకు సిద్ధంగా ఉందని భావిస్తున్నాను" -రమీజ్​ రాజా, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​

భారత్​తో సిరీస్​ నిర్వహించేందుకు గతంలో పాక్​ చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ప్రపంచకప్​, ఆసియా కప్​ టోర్నీల్లో మాత్రం యధావిధిగా తలపడుతూనే ఉన్నారు. ఇరుదేశాలు చివరగా గతేడాది ప్రపంచకప్​లో మ్యాచ్ ఆడాయి. అందులో పాక్​పై 89 పరుగుల తేడాతో టీమ్​ఇండియా విజయం సాధించింది. 2013 భారత పర్యటన​ తర్వాత వీరిద్దరి మధ్య మరో సిరీస్​ జరగలేదు.

ఇదే విషయమై గతంలో స్పందించిన పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ) ఛైర్మన్​ ఎహ్సాన్​ మణి.. టీమ్​ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్​కు తాము ఎప్పుడూ సిద్ధమేనని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాన్ని తిరిగి ప్రారంభించడంపై బీసీసీఐ వెనుక పరిగెత్తమని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.