ETV Bharat / sports

కివీస్ పర్యటన రద్దు కోసం పాక్ జట్టు ప్లాన్!

author img

By

Published : Dec 12, 2020, 5:35 AM IST

న్యూజిలాండ్​ వెళ్లిన పాక్ జట్టు ప్రాక్టీసులో చేస్తోంది. అయితే ఆ జట్టు ప్రధాన కోచ్ చెబుతున్న మాటలు.. సిరీస్​ల నిర్వహణపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏం చెప్పారు? అక్కడ ఏం జరుగుతోంది?

Pakistan had discussed with PCB options of pulling out of NZ tour: Misbah
కివీస్ పర్యటన రద్దు కోసం పాక్ జట్టు ప్లాన్!

న్యూజిలాండ్​ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్​ జట్టు.. మ్యాచ్​లు ఆడకుండానే స్వదేశానికి వచ్చే విషయమై తమ దేశ బోర్డుతో చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ చెప్పారు.

డిసెంబరు 18 నుంచి మొదలు కాబోయే ఈ పర్యటన​లో భాగంగా పాక్, కివీస్ జట్లు మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడాలి. అయితే ఎనిమిది పాక్ ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్​గా తేలడం, ఐసోలేషన్​లో ఉన్న ఆ దేశ క్రికెటర్లు నిబంధనలు అతిక్రమించిన కారణాల దృష్టా సిరీస్​ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Pakistan had discussed with PCB options of pulling out of NZ tour: Misbah
పాక్ జట్టు ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్

అన్ని అడ్డంకులు పూర్తి చేసుకున్న పాక్ బృందం.. ఇటీవలే ప్రాక్టీసు ఆరంభించింది. కానీ ఇప్పుడు పర్యటనను రద్దు చేసే విషయమై ఆలోచన చేస్తుండటం వల్ల ఇది చర్చనీయాంశమైంది.

అయితే ఆతిథ్య జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందని చెప్పిన పాక్ కోచ్ మిస్బా.. తమ బృందం కూడా అలానే ఉందని అన్నారు. బౌలర్లు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నారని చెప్పారు. కెప్టెన్ బాబర్ అజమ్​ మెరుగుదల చాలా బాగుందని తెలిపారు.

న్యూజిలాండ్​ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్​ జట్టు.. మ్యాచ్​లు ఆడకుండానే స్వదేశానికి వచ్చే విషయమై తమ దేశ బోర్డుతో చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ చెప్పారు.

డిసెంబరు 18 నుంచి మొదలు కాబోయే ఈ పర్యటన​లో భాగంగా పాక్, కివీస్ జట్లు మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడాలి. అయితే ఎనిమిది పాక్ ఆటగాళ్లకు కొవిడ్ పాజిటివ్​గా తేలడం, ఐసోలేషన్​లో ఉన్న ఆ దేశ క్రికెటర్లు నిబంధనలు అతిక్రమించిన కారణాల దృష్టా సిరీస్​ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Pakistan had discussed with PCB options of pulling out of NZ tour: Misbah
పాక్ జట్టు ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్

అన్ని అడ్డంకులు పూర్తి చేసుకున్న పాక్ బృందం.. ఇటీవలే ప్రాక్టీసు ఆరంభించింది. కానీ ఇప్పుడు పర్యటనను రద్దు చేసే విషయమై ఆలోచన చేస్తుండటం వల్ల ఇది చర్చనీయాంశమైంది.

అయితే ఆతిథ్య జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందని చెప్పిన పాక్ కోచ్ మిస్బా.. తమ బృందం కూడా అలానే ఉందని అన్నారు. బౌలర్లు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నారని చెప్పారు. కెప్టెన్ బాబర్ అజమ్​ మెరుగుదల చాలా బాగుందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.