టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉగ్ర ముప్పు ఉందట. అవును మీరు విన్నది నిజమే. జాతీయ దర్యాప్తు సంస్థకు అందిన సమాచారం ప్రకారం కొత్తగా ఏర్పాటైన ఆల్ ఇండియా లష్కరే తోయిబా ఉగ్రవాద ముఠా తమ హిట్ లిస్టులో కోహ్లీ పేరు చేర్చింది.
ప్రస్తుతం భారత క్రికెట్లో కోహ్లీ హవా నడుస్తోంది. టీమిండియా కెప్టెన్గా మూడు ఫార్మాట్లలోనూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడీ ఆటగాడు. అయితే విరాట్పై పని భారాన్ని తగ్గించడానికి బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్కు విశ్రాంతినిచ్చింది సెలక్షన్ కమిటీ. ఇతడి స్థానంలో రోహిత్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
కోహ్లీతో పాటు హిట్లిస్ట్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, భాజపా అగ్రనేత ఎల్కే అడ్వాణీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నారు.
ఇవీ చూడండి.. బంగ్లా క్రికెటర్ షకిబుల్పై ఐసీసీ నిషేధం..!