ETV Bharat / sports

లంక ప్రీమియర్‌ లీగ్‌ 'థీమ్​సాంగ్'​ వచ్చేసిందోచ్​..

author img

By

Published : Nov 20, 2020, 9:37 PM IST

ఐపీఎల్​ తర్వాత మరో లీగ్​ క్రికెట్​ ప్రియులను అలరించేందుకు సిద్ధమౌతోంది. శ్రీలంక వేదికగా నవంబర్​ 26 నుంచి లంక ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌) ప్రారంభం కానుంది. తాజాగా ఈ టోర్నీ థీమ్​సాంగ్​ను విడుదలైంది.

lpl 2020 news
దుమ్ములేపుతున్న లంక ప్రీమియర్‌ లీగ్‌ థీమ్​సాంగ్​

క్రికెట్​ అభిమానులను అలరించేందుకు లంక ప్రీమియర్​ లీగ్​ సిద్ధమవుతోంది. నవంబర్​ 26 నుంచి ప్రారంభంకానున్న ఈ టోర్నీ థీమ్​సాంగ్​ను తాజాగా విడుదల చేశారు నిర్వాహకులు. ఇది ఉర్రూతలూగించేలా ఉండి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ ఏడాది టోర్నీలో భారత ఆటగాళ్లు సైతం సందడి చేయనున్నారు. మునాఫ్​ పటేల్​, ఇర్ఫాన్​ పఠాన్​, మన్​ప్రీత్​ గోనీ, సందీప్​ త్యాగి, మన్వీందర్​ సింగ్​ ఈ లీగ్​లో బరిలోకి దిగనున్నారు. స్టార్​ క్రికెటర్లు క్రిస్​గేల్​, లసిత్​ మలింగ మాత్రం ఈ సీజన్​కు దూరమయ్యారు.

కొలొంబో, కండ్యా, గాలె, దంబుల్లా, జఫ్నా అయిదు ఫ్రాంఛైస్‌ జట్లు ఈ ఎల్‌పీఎల్‌-టీ20లో తలపడనున్నాయి. కొలొంబో, కండ్యా జట్ల మధ్య మొదటి మ్యాచ్.. హంబంటోటాలోని మహేంద్ర రాజపక్సే అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో నవంబర్‌ 26న జరగనుంది. డిసెంబర్‌ 13, 14న సెమీ ఫైనల్స్‌‌, 16న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది.

క్రికెట్​ అభిమానులను అలరించేందుకు లంక ప్రీమియర్​ లీగ్​ సిద్ధమవుతోంది. నవంబర్​ 26 నుంచి ప్రారంభంకానున్న ఈ టోర్నీ థీమ్​సాంగ్​ను తాజాగా విడుదల చేశారు నిర్వాహకులు. ఇది ఉర్రూతలూగించేలా ఉండి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ ఏడాది టోర్నీలో భారత ఆటగాళ్లు సైతం సందడి చేయనున్నారు. మునాఫ్​ పటేల్​, ఇర్ఫాన్​ పఠాన్​, మన్​ప్రీత్​ గోనీ, సందీప్​ త్యాగి, మన్వీందర్​ సింగ్​ ఈ లీగ్​లో బరిలోకి దిగనున్నారు. స్టార్​ క్రికెటర్లు క్రిస్​గేల్​, లసిత్​ మలింగ మాత్రం ఈ సీజన్​కు దూరమయ్యారు.

కొలొంబో, కండ్యా, గాలె, దంబుల్లా, జఫ్నా అయిదు ఫ్రాంఛైస్‌ జట్లు ఈ ఎల్‌పీఎల్‌-టీ20లో తలపడనున్నాయి. కొలొంబో, కండ్యా జట్ల మధ్య మొదటి మ్యాచ్.. హంబంటోటాలోని మహేంద్ర రాజపక్సే అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో నవంబర్‌ 26న జరగనుంది. డిసెంబర్‌ 13, 14న సెమీ ఫైనల్స్‌‌, 16న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.