చిన్నస్వామి స్టేడియంలో ధోని విశ్వరూపాన్ని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అంత తొందరగా మర్చిపోలేదు. 5 బంతుల్లో 25 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి చెన్నైను గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. దీనిపై రాయల్ ఛాలెంజర్స్ కీపర్ పార్థివ్ పటేల్ స్పందించాడు. చివరి బంతిని ధోని మిస్ చేస్తాడనుకోలేదని తెలిపాడు.
"ఆఖరి బంతికి ధోనీని పరుగులు చేయకుండా కట్టడి చేయాలని అనుకున్నాం. చివరి బంతిని ఆఫ్ సైడ్ వేయాలని నిర్ణయించాం. ఒక వేళ బంతిని లెగ్ సైడ్ వేస్తే రెండు పరుగులు తేలికగా వచ్చేవి. అందుకు అనుగుణంగానే ఉమేష్ యాదవ్ ఆఫ్ సైడ్ స్లో డెలివరీ వేశాడు. కానీ ఆ బాల్ ధోని నుంచి మిస్సవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది".
పార్థివ్ పటేల్, బెంగళూరు ఆటగాడు
బెంగళూరు, ముంబయిల్లో ఆడుతున్నపుడు చివరి 5 ఓవర్లలో 70 పరుగులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నాడు పటేల్. 80-90 పరుగులు ఉంటే మాత్రం గెలుపు అవకాశాలు ఉంటాయని తెలిపాడు. ధోని క్రీజులో ఉంటే చివరి ఓవర్లలో ఆట ఎలా ఉంటుందో అందరికీ తెలుసనీ.. అందుకే వీలైనన్ని డాట్ బాల్స్ వేయడానికి ప్రయత్నించామని వ్యాఖ్యానించాడు.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 161 పరుగులు చేసింది. ఓపెనర్గా వచ్చిన పార్థివ్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. చివరి బంతికి అద్భుత రనౌట్ చేసి జట్టుకు విజయాన్నిందించాడు.
ఇవీ చూడండి.. ధోనిని చూసి కోహ్లీ ఎందుకు భయపడ్డాడో తెలుసా?