ETV Bharat / sports

ఐపీఎల్​ 14వ సీజన్ కోసం ముంబయి కొత్త జెర్సీ - రోహిత్ శర్మ కొత్త జెర్సీ

ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ 14వ సీజన్ కోసం కొత్త జెర్సీని రూపొందించింది. తాజాగా ఈ జెర్సీలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది.

Mumbai Indians  new jersey
ముంబయి కొత్త జెర్సీ
author img

By

Published : Mar 27, 2021, 2:09 PM IST

Updated : Mar 27, 2021, 2:25 PM IST

ఐపీఎల్​లో ఐదుసార్లు విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది ముంబయి ఇండియన్స్. గతేడాది ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్​పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టు ఈసారి కూడా అద్భుతాలు చేయాలని చూస్తోంది. ఏప్రిల్ 9న ప్రారంభంకానున్న 14వ సీజన్​ కోసం తన కొత్త జెర్సీని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

Mumbai Indians new jersey
ముంబయి కొత్త జెర్సీ

ఐపీఎల్ మొదటి రెండేళ్లు లేత నీలం రంగు జెర్సీ ధరించిన ముంబయి.. ఆ తర్వాత నుంచి ముదురు నీలం రంగు జెర్సీలను ధరిస్తోంది. ఈసారి కూడా అదే రంగుతో బంగారు వర్ణం షేడ్స్​తో రూపొందించిన జెర్సీ ఆకట్టుకుంటోంది. భుజం, పక్కలకు ఇరువైపులా బంగారు రంగు షేడ్స్​తో జెర్సీని తయారు చేశారు. దాదాపు పాత దుస్తులనే పోలిన ఈ జెర్సీలో ఆరెంజ్ కలర్ షేడ్స్​ కాస్త ఆకర్షణగా ఉన్నాయి. చేతులు, కాలర్ చివరన ఈ రంగు బోర్డర్ కనిపిస్తోంది.

రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా వంటి దేశీయ టీ20 స్పెషలిస్టులతో కూడిన ఈ జట్టు ఈసారి కూడా ఫేవరెట్స్​గా బరిలో దిగబోతుంది. ఈ జట్టు మొదటి మ్యాచ్​లో ఏప్రిల్ 9న కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

ఐపీఎల్​లో ఐదుసార్లు విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది ముంబయి ఇండియన్స్. గతేడాది ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్​పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ఈ జట్టు ఈసారి కూడా అద్భుతాలు చేయాలని చూస్తోంది. ఏప్రిల్ 9న ప్రారంభంకానున్న 14వ సీజన్​ కోసం తన కొత్త జెర్సీని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

Mumbai Indians new jersey
ముంబయి కొత్త జెర్సీ

ఐపీఎల్ మొదటి రెండేళ్లు లేత నీలం రంగు జెర్సీ ధరించిన ముంబయి.. ఆ తర్వాత నుంచి ముదురు నీలం రంగు జెర్సీలను ధరిస్తోంది. ఈసారి కూడా అదే రంగుతో బంగారు వర్ణం షేడ్స్​తో రూపొందించిన జెర్సీ ఆకట్టుకుంటోంది. భుజం, పక్కలకు ఇరువైపులా బంగారు రంగు షేడ్స్​తో జెర్సీని తయారు చేశారు. దాదాపు పాత దుస్తులనే పోలిన ఈ జెర్సీలో ఆరెంజ్ కలర్ షేడ్స్​ కాస్త ఆకర్షణగా ఉన్నాయి. చేతులు, కాలర్ చివరన ఈ రంగు బోర్డర్ కనిపిస్తోంది.

రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, బుమ్రా వంటి దేశీయ టీ20 స్పెషలిస్టులతో కూడిన ఈ జట్టు ఈసారి కూడా ఫేవరెట్స్​గా బరిలో దిగబోతుంది. ఈ జట్టు మొదటి మ్యాచ్​లో ఏప్రిల్ 9న కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.

Last Updated : Mar 27, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.