ETV Bharat / sports

'కొవిడ్ ప్రోటోకాల్స్​ రూపకల్పనలో ఐపీఎల్ కీలకం'​ - బీసీసీఐ

టీ20 వరల్డ్​కప్​ కోసం రూపొందించనున్న కొవిడ్​ ప్రోటోకాల్స్​కు సంబంధించి ఐసీసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది ఐపీఎల్​లో బీసీసీఐ పాటించే కరోనా నిబంధనలు తమకు ఉపయోగపడుతాయని తెలిపింది.

IPL key factor in learning what protocols need to be followed for T20 WC, says Sawhney
'ఐసీసీ కొవిడ్ ప్రోటోకాల్స్​ రూపకల్పనలో ఐపీఎల్ కీలకం'​
author img

By

Published : Mar 6, 2021, 10:39 AM IST

ఈ ఏడాది భారత్​లో నిర్వహించనున్న టీ20 వరల్డ్​కప్​కు సంబంధించి.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల బయోసెక్యూర్​ నిబంధనలు రూపొందించడానికి.. రానున్న ఐపీఎల్​​ దోహదపడుతుందని తెలిపింది. కొవిడ్​ వల్ల ఇటీవల వాయిదా పడిన పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ (పీసీఎల్​) కూడా తమను అప్రమత్తం చేసిందని పేర్కొంది.

పీసీఎల్​లో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో లీగ్​ను వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. టోర్నీ నిర్వహణ కంటే ఆటగాళ్ల ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇచ్చిన బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

''ప్రస్తుత కొవిడ్ కఠిన పరిస్థితులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ద్వైపాక్షిక సిరీస్​ అయితే రెండు జట్ల ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. వారికి అర్థమయ్యేలా చెప్పొచ్చు. అదే ప్రపంచ కప్​ అంటే 16 దేశాల నుంచి 16 టీమ్​లు వస్తాయి. అప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 సిరీస్​లను గమనించాలి. రానున్న ఐపీఎల్​లో బీసీసీఐ ఏయే కొవిడ్ నిబంధనలు పాటించబోతుందనేది చూడాలి. ఇవన్నీ టీ20 వరల్డ్​ కప్ కోసం ఐసీసీ రూపొందించే..​ కరోనా ప్రోటోకాల్స్​లో తోడ్పడతాయి.''

- మను సాహ్నీ, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్.

ఈ ఏడాది అక్టోబర్​-నవంబర్​లో భారత్​ వేదికగా టీ20 వరల్డ్​ కప్​ జరగనుంది. టోర్నీ వేదికలు ప్రకటించాల్సి ఉంది.

"16 దేశాలకు చెందిన ఆటగాళ్లకు విభిన్న కొవిడ్ నిబంధనలు ఉంటాయి. వీరందరినీ ఒక దేశంలోకి తీసుకొచ్చి టోర్నీ నిర్వహించాలంటే చాలా సవాలుతో కూడుకున్నదనే చెప్పాలి. ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్ని సవ్యంగా జరుగుతాయనేది చెప్పలేం. ఈ విషయాలన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి." అని సాహ్నీ తెలిపారు.

ఇదీ చదవండి: సన్నీ క్రికెట్​ అరంగేట్రానికి అర్ధ శతాబ్దం పూర్తి

ఈ ఏడాది భారత్​లో నిర్వహించనున్న టీ20 వరల్డ్​కప్​కు సంబంధించి.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా నేపథ్యంలో ఆటగాళ్ల బయోసెక్యూర్​ నిబంధనలు రూపొందించడానికి.. రానున్న ఐపీఎల్​​ దోహదపడుతుందని తెలిపింది. కొవిడ్​ వల్ల ఇటీవల వాయిదా పడిన పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ (పీసీఎల్​) కూడా తమను అప్రమత్తం చేసిందని పేర్కొంది.

పీసీఎల్​లో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో లీగ్​ను వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. టోర్నీ నిర్వహణ కంటే ఆటగాళ్ల ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇచ్చిన బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

''ప్రస్తుత కొవిడ్ కఠిన పరిస్థితులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ద్వైపాక్షిక సిరీస్​ అయితే రెండు జట్ల ఆటగాళ్లు మాత్రమే ఉంటారు. వారికి అర్థమయ్యేలా చెప్పొచ్చు. అదే ప్రపంచ కప్​ అంటే 16 దేశాల నుంచి 16 టీమ్​లు వస్తాయి. అప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న టీ20 సిరీస్​లను గమనించాలి. రానున్న ఐపీఎల్​లో బీసీసీఐ ఏయే కొవిడ్ నిబంధనలు పాటించబోతుందనేది చూడాలి. ఇవన్నీ టీ20 వరల్డ్​ కప్ కోసం ఐసీసీ రూపొందించే..​ కరోనా ప్రోటోకాల్స్​లో తోడ్పడతాయి.''

- మను సాహ్నీ, ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్.

ఈ ఏడాది అక్టోబర్​-నవంబర్​లో భారత్​ వేదికగా టీ20 వరల్డ్​ కప్​ జరగనుంది. టోర్నీ వేదికలు ప్రకటించాల్సి ఉంది.

"16 దేశాలకు చెందిన ఆటగాళ్లకు విభిన్న కొవిడ్ నిబంధనలు ఉంటాయి. వీరందరినీ ఒక దేశంలోకి తీసుకొచ్చి టోర్నీ నిర్వహించాలంటే చాలా సవాలుతో కూడుకున్నదనే చెప్పాలి. ముందస్తు ప్రణాళిక ప్రకారం అన్ని సవ్యంగా జరుగుతాయనేది చెప్పలేం. ఈ విషయాలన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి." అని సాహ్నీ తెలిపారు.

ఇదీ చదవండి: సన్నీ క్రికెట్​ అరంగేట్రానికి అర్ధ శతాబ్దం పూర్తి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.