ETV Bharat / sports

దుబాయ్​ లేదా శ్రీలంకలో ఐపీఎల్​-13! - ఐపీఎల్ యూఏఈ

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఈ ఏడాది భారత్​లో జరగడం కష్టమేనని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణమని అన్నారు. త్వరలో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఐపీఎల్​ ఈసారి కచ్చితంగా బయట దేశంలోనే!
ఐపీఎల్ 2020
author img

By

Published : Jul 2, 2020, 4:48 PM IST

Updated : Jul 2, 2020, 9:34 PM IST

ఐపీఎల్​ 13వ సీజన్.. భారత్​లో జరగడం కష్టంగా కనిపిస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై ఐసీసీ స్పష్టతనిచ్చిన తర్వాతే దీని విషయంలో నిర్ణయం తీసుకోనున్నారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మనదేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతుండటం వల్ల టోర్నీని యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది.

IPL 2020
ఐపీఎల్ ట్రోఫీ

"మేం ఐపీఎల్​ వేదిక గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈసారి కచ్చితంగా బయటదేశంలోనే జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని మ్యాచ్​లను ఒకటి లేదా రెండు మైదానాల్లో, ప్రేక్షకుల లేకుండా జరపాలనే ఆలోచనతో ఉన్నాం. కరోనా ప్రభావం ఎక్కువవుతున్న నేపథ్యంలో వేదిక యూఏఈ లేదా శ్రీలంక అనేది త్వరలో నిర్ణయిస్తాం" -బీసీసీఐ అధికారి

ఇదే విషయమై మాట్లాడిన ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్.. తమ తొలి ప్రాధాన్యం స్వదేశమేనని అన్నారు. అయితే దీని విషయంలో ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని చెప్పారు.

"మూడు, నాలుగు మైదానాల్లో కంటే ఎక్కువ వాటిలో ఐపీఎల్​ మ్యాచ్​లు జరపలేం. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. అభిమానులు లేకుండా టోర్నీని ఒకవేళ జరిపితే ఎక్కడ ఆడినా పర్వాలేదు. కాకపోతే టీవీ ప్రసార వేళలు చూసుకుంటే సరిపోతుంది" -బ్రిజేశ్ పటేల్, ఐపీఎల్ ఛైర్మన్

IPL 2020
ఐపీఎల్ 2020 ట్రోఫీ

ఇవీ చదవండి:

ఐపీఎల్​ 13వ సీజన్.. భారత్​లో జరగడం కష్టంగా కనిపిస్తోంది. అయితే టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై ఐసీసీ స్పష్టతనిచ్చిన తర్వాతే దీని విషయంలో నిర్ణయం తీసుకోనున్నారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. మనదేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతుండటం వల్ల టోర్నీని యూఏఈ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బోర్డు భావిస్తోంది.

IPL 2020
ఐపీఎల్ ట్రోఫీ

"మేం ఐపీఎల్​ వేదిక గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈసారి కచ్చితంగా బయటదేశంలోనే జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని మ్యాచ్​లను ఒకటి లేదా రెండు మైదానాల్లో, ప్రేక్షకుల లేకుండా జరపాలనే ఆలోచనతో ఉన్నాం. కరోనా ప్రభావం ఎక్కువవుతున్న నేపథ్యంలో వేదిక యూఏఈ లేదా శ్రీలంక అనేది త్వరలో నిర్ణయిస్తాం" -బీసీసీఐ అధికారి

ఇదే విషయమై మాట్లాడిన ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేశ్ పటేల్.. తమ తొలి ప్రాధాన్యం స్వదేశమేనని అన్నారు. అయితే దీని విషయంలో ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని చెప్పారు.

"మూడు, నాలుగు మైదానాల్లో కంటే ఎక్కువ వాటిలో ఐపీఎల్​ మ్యాచ్​లు జరపలేం. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. అభిమానులు లేకుండా టోర్నీని ఒకవేళ జరిపితే ఎక్కడ ఆడినా పర్వాలేదు. కాకపోతే టీవీ ప్రసార వేళలు చూసుకుంటే సరిపోతుంది" -బ్రిజేశ్ పటేల్, ఐపీఎల్ ఛైర్మన్

IPL 2020
ఐపీఎల్ 2020 ట్రోఫీ

ఇవీ చదవండి:

Last Updated : Jul 2, 2020, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.