ETV Bharat / sports

భారత్​-ఇంగ్లాండ్​ టెస్ట్​ సిరీస్​ షెడ్యూల్​లో మార్పు

author img

By

Published : Nov 24, 2020, 9:36 PM IST

Updated : Nov 24, 2020, 10:36 PM IST

వచ్చే ఏడాది భారత్​-ఇంగ్లాండ్​ మధ్య ఐదు మ్యాచులతో కూడిన టెస్ట్​ సిరీస్​ను నాలుగు మ్యాచులకే కుదించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపారు.

England
భారత్​-ఇంగ్లాండ్​ టెస్ట్​ సిరీస్

వచ్చే ఏడాది భారత్​-ఇంగ్లాండ్ మధ్య​ జరగబోయే సిరీస్​ షెడ్యూల్​లో​ ఓ మార్పు జరిగింది. ఇరు జట్లు ఆడాల్సిన ఐదు టెస్టులను నాలుగు టెస్టులకే కుదించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశాడు. ఫిబ్రవరి-మార్చి మధ్య ఈ టెస్ట్​ సిరీస్​ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించాడు. ​అయితే ఈ మార్పు ఎందుకు చేశారో కారణాన్ని చెప్పలేదు. సాధారణంగా పరిస్థితులన్నీ చక్కగా ఉండి ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్​లోనే ఇంగ్లాండ్​తో సిరీస్​ జరగాల్సింది. కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.

అభిమానుల సమక్షంలోనే...
కరోనా నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్​లు జరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది నుంచి అభిమానుల మధ్యే మ్యాచ్​లు నిర్వహిస్తామని ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు సీఈఓ టామ్​ హారిసన్​. జనవరి 12 నుంచి టికెట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. మ్యాచ్​లు రద్దయినా, కరోనా కారణంగా వేదిక మారినా డబ్బులు వాపస్​ చేస్తామని స్పష్టం చేశారు.

వచ్చే ఏడాది భారత్​-ఇంగ్లాండ్ మధ్య​ జరగబోయే సిరీస్​ షెడ్యూల్​లో​ ఓ మార్పు జరిగింది. ఇరు జట్లు ఆడాల్సిన ఐదు టెస్టులను నాలుగు టెస్టులకే కుదించారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పష్టం చేశాడు. ఫిబ్రవరి-మార్చి మధ్య ఈ టెస్ట్​ సిరీస్​ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించాడు. ​అయితే ఈ మార్పు ఎందుకు చేశారో కారణాన్ని చెప్పలేదు. సాధారణంగా పరిస్థితులన్నీ చక్కగా ఉండి ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్​లోనే ఇంగ్లాండ్​తో సిరీస్​ జరగాల్సింది. కానీ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా వేశారు.

అభిమానుల సమక్షంలోనే...
కరోనా నేపథ్యంలో స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్​లు జరుగుతున్నాయి. అయితే వచ్చే ఏడాది నుంచి అభిమానుల మధ్యే మ్యాచ్​లు నిర్వహిస్తామని ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డు సీఈఓ టామ్​ హారిసన్​. జనవరి 12 నుంచి టికెట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. మ్యాచ్​లు రద్దయినా, కరోనా కారణంగా వేదిక మారినా డబ్బులు వాపస్​ చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : భారత్​-ఇంగ్లాండ్​ 5 టెస్టుల షెడ్యూల్​ ఇదే..

Last Updated : Nov 24, 2020, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.