ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్. కేవలం మూడు రోజుల్లోనే జయభేరీ మోగించింది కోహ్లీసేన. మూడోరోజు, శనివారం ఆట ఆరంభానికి ముందు ఓవర్నైట్ స్కోరు 493/6 వద్దే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ప్రత్యర్థిని 69.2 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ చేసింది. ముష్ఫికర్ రహీమ్ (64; 150 బంతుల్లో 7ఫోర్లు) ఒక్కడే ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. మహ్మద్ షమీ (4/31), అశ్విన్ (3/42), ఉమేశ్ యాదవ్ (2/51) బంగ్లా పతనాన్ని శాసించారు. ఇషాంత్కు ఒక వికెట్ దక్కింది.
![India vs Bangladesh: team india records after win in indore test 2019](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5083852_match2222.jpg)
1. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ దూసుకెళ్తోంది. అగ్రస్థానంలో ఓటమి ఎరుగకుండా కొనసాగుతోంది.
భారత్ -300 పాయింట్లు( ఆరు మ్యాచ్ల్లో ఆరు విజయాలు), న్యూజిలాండ్ -60 పాయింట్లు(ఒక విజయం, ఒక ఓటమి), శ్రీలంక- 60 పాయింట్లు(ఒక విజయం, ఒక ఓటమి), ఆస్ట్రేలియా- 56 పాయింట్లు( రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా), ఇంగ్లాండ్- 56 పాయింట్లు(రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా), వెస్టిండీస్ (రెండు ఓటములు), దక్షిణాఫ్రికా(మూడో ఓటములు), బంగ్లాదేశ్( ఒక ఓటమి)లతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేదు. పాకిస్థాన్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు.
2. తాజా విజయంతో ధోనీ టెస్టు ఇన్నింగ్స్ విజయాల రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ. విరాట్ 10 మ్యాచ్లు గెలిచి.. మాజీ సారథి ధోనీ(9)ని రెండో ర్యాంక్కు నెట్టాడు. అజారుద్దీన్(8), గంగూలీ(7) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
3. స్వదేశంలో వరుసగా కోహ్లీసేనకు ఇది మూడో ఇన్నింగ్స్ టెస్టు విజయం. పుణె వేదికగా దక్షిణాఫ్రికాపై(ఇన్నింగ్స్ 137 పరుగులు), రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాపై (ఇన్నింగ్స్ 202 పరుగులు) తేడాతో గెలిచింది భారత్. తాజాగా బంగ్లాపై(ఇన్నింగ్స్ 130 పరుగులు) తేడాతో విజయం సాధించిది టీమిండియా. 1992/93, 1993/92 తర్వాత ఈ సీజన్లో భారత్ వరుసగా మూడోసారి ఇన్నింగ్స్ తేడాతో గెలవడం విశేషం.
4. తాజా గెలుపుతో వరుసగా ఆరో విజయం( దక్షిణాఫ్రికా 3, విండీస్ 2, బంగ్లా 1) నమోదు చేసింది కోహ్లీసేన. 2013లో ధోనీ( ఆస్ట్రేలియాపై 4, విండీస్పై 2 విజయాలు) సాధించిన రికార్డు ఇప్పుడు సమమైంది.