ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్. కేవలం మూడు రోజుల్లోనే జయభేరీ మోగించింది కోహ్లీసేన. మూడోరోజు, శనివారం ఆట ఆరంభానికి ముందు ఓవర్నైట్ స్కోరు 493/6 వద్దే టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ప్రత్యర్థిని 69.2 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ చేసింది. ముష్ఫికర్ రహీమ్ (64; 150 బంతుల్లో 7ఫోర్లు) ఒక్కడే ఆఖరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. మహ్మద్ షమీ (4/31), అశ్విన్ (3/42), ఉమేశ్ యాదవ్ (2/51) బంగ్లా పతనాన్ని శాసించారు. ఇషాంత్కు ఒక వికెట్ దక్కింది.
1. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ దూసుకెళ్తోంది. అగ్రస్థానంలో ఓటమి ఎరుగకుండా కొనసాగుతోంది.
భారత్ -300 పాయింట్లు( ఆరు మ్యాచ్ల్లో ఆరు విజయాలు), న్యూజిలాండ్ -60 పాయింట్లు(ఒక విజయం, ఒక ఓటమి), శ్రీలంక- 60 పాయింట్లు(ఒక విజయం, ఒక ఓటమి), ఆస్ట్రేలియా- 56 పాయింట్లు( రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా), ఇంగ్లాండ్- 56 పాయింట్లు(రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రా), వెస్టిండీస్ (రెండు ఓటములు), దక్షిణాఫ్రికా(మూడో ఓటములు), బంగ్లాదేశ్( ఒక ఓటమి)లతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేదు. పాకిస్థాన్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ ఆడలేదు.
2. తాజా విజయంతో ధోనీ టెస్టు ఇన్నింగ్స్ విజయాల రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ. విరాట్ 10 మ్యాచ్లు గెలిచి.. మాజీ సారథి ధోనీ(9)ని రెండో ర్యాంక్కు నెట్టాడు. అజారుద్దీన్(8), గంగూలీ(7) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
3. స్వదేశంలో వరుసగా కోహ్లీసేనకు ఇది మూడో ఇన్నింగ్స్ టెస్టు విజయం. పుణె వేదికగా దక్షిణాఫ్రికాపై(ఇన్నింగ్స్ 137 పరుగులు), రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాపై (ఇన్నింగ్స్ 202 పరుగులు) తేడాతో గెలిచింది భారత్. తాజాగా బంగ్లాపై(ఇన్నింగ్స్ 130 పరుగులు) తేడాతో విజయం సాధించిది టీమిండియా. 1992/93, 1993/92 తర్వాత ఈ సీజన్లో భారత్ వరుసగా మూడోసారి ఇన్నింగ్స్ తేడాతో గెలవడం విశేషం.
4. తాజా గెలుపుతో వరుసగా ఆరో విజయం( దక్షిణాఫ్రికా 3, విండీస్ 2, బంగ్లా 1) నమోదు చేసింది కోహ్లీసేన. 2013లో ధోనీ( ఆస్ట్రేలియాపై 4, విండీస్పై 2 విజయాలు) సాధించిన రికార్డు ఇప్పుడు సమమైంది.
5. తొలిటెస్టులో 31 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు షమీ. స్వదేశంలో జరిగిన టెస్టుల్లో అతడికిది మూడో వ్యక్తిగత అత్యుత్తమం.
6. ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన నాలుగో సారథిగా రికార్డులకెక్కాడు కోహ్లీ. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ (32 విజయాలు)సరసన నిలిచాడు. దక్షిణాఫ్రికా సారథి గ్రేమ్ స్మిత్(109 మ్యాచ్ల్లో 53 విజయాలు), రికీ పాంటింగ్(77 మ్యాచ్ల్లో 48 విజయాలు), స్టీవ్వా(57 మ్యాచ్ల్లో 41 విజయాలు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
7. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ టాప్ స్కోరర్(105 బంతుల్లో 43 పరుగులు )గా నిలిచిన ముష్ఫికర్.. రెండో ఇన్నింగ్స్ల్లో కూడా ఆ జట్టు తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్లో 150 బంతులు ఆడిన రహీమ్.. 64 రన్స్ సాధించాడు. ఈ విధంగా రెండు ఇన్నింగ్స్ల్లోనూ బంగ్లాదేశ్ తరఫున అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసి ఆటగాడిగా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్ల్లోనూ వందకు పైగా బంతుల్ని ఎదుర్కొన్నాడు.
8. టెస్టుల్లో భారత్పై అత్యధిక పరుగులు చేసిన బంగ్లాదేశ్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు ముష్ఫికర్ రహీమ్. ఇప్పటివరకు మహ్మద్ అష్రాఫుల్(386 పరుగులు) పేరిట ఉన్న రికార్డును అతడు బ్రేక్ చేసి మూడో స్థానం కైవసం చేసుకున్నాడు. 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు.
9. ఇరుజట్ల పరంగా అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్ తెందూల్కర్(820) అగ్రస్థానంలో ఉండగా.. రాహుల్ ద్రవిడ్(560) రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో ఉన్న ముష్ఫికర్ సగటు 55 ఉండటం విశేషం. భారత్తో ఇప్పటివరకు ఐదు టెస్టులు ఆడిన ముష్పికర్... మొత్తం తొమ్మిది ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు సాధించాడు.
ఆసక్తికరంగా...
బంగ్లా ఓపెనర్ల ప్రదర్శన నిరాశపర్చినా.. ఇద్దరూ ఒకే వ్యక్తిగత స్కోరు, ఒకే బౌలర్ల చేతిలో ఔటవ్వడం ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో షాద్మన్ 24 బంతుల్లో 6 పరుగులు చేయగా, ఇమ్రుల్ 18 బంతుల్లో 6 పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్స్లోనూ వీరిద్దరూ అదే వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ కావడం విశేషం. బంగ్లా రెండో ఇన్నింగ్స్లోనూ షాద్మన్ 24 బంతులే ఆడి ఆరు పరుగులు చేయడం గమనార్హం.