ETV Bharat / sports

భారత్​xదక్షిణాఫ్రికా తొలి వన్డే వర్షార్పణం

ధర్మశాల వేదికగా ఈరోజు జరగాల్సిన భారత్‌, దక్షిణాఫ్రికా తొలి వన్డే రద్దయింది. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా తయారైంది. ఫలితంగా మ్యాచ్​ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం లఖ్​నవూలో జరగనుంది.

author img

By

Published : Mar 12, 2020, 6:15 PM IST

one day match
భారత్​Xదక్షిణాఫ్రికా తొలి వన్డేకు వరుణుడు ఆటంకి

భారత్‌, దక్షిణాఫ్రికా తొలి వన్డేకు వరుణుడు ఆటంకం కలిగించాడు. కనీసం టాస్​ పడకుండానే మ్యాచ్​ రద్దయింది. ధర్మశాలలో ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్​ ప్రారంభంకావాల్సి ఉన్నా.. సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్​ నిర్వహణకు ప్రయత్నాలు జరిగాయి. కనీసం 20 ఓవర్లయినా ఆట జరుగుతుందని అభిమానులు ఆశించారు. అయితే వర్షం తగ్గినా పిచ్​ చిత్తడిగా ఉండటం, వెలుతురు లేమి కారణంగా నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు.

కరోనా నేపథ్యంలో మైదానంలోకి అభిమానులు కూడా ఎక్కువగా రాలేదు. దాదాపు అన్ని స్టాండ్లు ఖాళీగా కనిపించాయి. గాయాల నుంచి కోలుకున్నాక ఈ మ్యాచ్​తోనే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, ధావన్.

భారత్‌, దక్షిణాఫ్రికా తొలి వన్డేకు వరుణుడు ఆటంకం కలిగించాడు. కనీసం టాస్​ పడకుండానే మ్యాచ్​ రద్దయింది. ధర్మశాలలో ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్​ ప్రారంభంకావాల్సి ఉన్నా.. సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్​ నిర్వహణకు ప్రయత్నాలు జరిగాయి. కనీసం 20 ఓవర్లయినా ఆట జరుగుతుందని అభిమానులు ఆశించారు. అయితే వర్షం తగ్గినా పిచ్​ చిత్తడిగా ఉండటం, వెలుతురు లేమి కారణంగా నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు ప్రకటించారు.

కరోనా నేపథ్యంలో మైదానంలోకి అభిమానులు కూడా ఎక్కువగా రాలేదు. దాదాపు అన్ని స్టాండ్లు ఖాళీగా కనిపించాయి. గాయాల నుంచి కోలుకున్నాక ఈ మ్యాచ్​తోనే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, ధావన్.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.