ETV Bharat / sports

దెబ్బకు దెబ్బ: రెండోవన్డేలో మిథాలీసేనదే గెలుపు

ఇటీవలే దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలివన్డేలో ఘోరంగా ఓడిన భారత మహిళల జట్టు.. రెండో వన్డేలో పుంజుకుంది. 158 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. టీమ్ఇండియా బ్యాట్స్​వుమెన్​ స్మృతి మంధాన, పూనమ్​ రౌత్​ అర్ధశతకాలతో జట్టుకు విజయాన్ని తెచ్చిపెట్టారు.

author img

By

Published : Mar 9, 2021, 3:11 PM IST

IND W vs SA W 2nd ODI: India Women won by 9 wickets
దెబ్బకు దెబ్బ: రెండో వన్డేలో మిథాలీసేనదే గెలుపు

దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలివన్డే ఘోర పరాజయం తర్వాత.. భారత మహిళల జట్టు పుంజుకుంది. లఖ్​నవూ వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డే 9 వికెట్ల తేడాతో మిథాలీసేన ప్రత్యర్థిపై గెలుపొందింది. సౌతాఫ్రికా టీమ్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా కేవలం 28.4 ఓవర్లలో వికెట్​ నష్టపోయి ఛేదించింది.

టీమ్ఇండియా బ్యాట్స్​వుమెన్​ స్మృతి మంధాన (80), పూనమ్​ రౌత్​ (60) చెరో అర్ధశతకంతో చెలరేగి.. జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకంగా వ్యవహరించారు.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 41 ఓవర్లలో 157 పరుగుల చేసి ఆలౌట్​ అయ్యింది. టీమ్ఇండియా బౌలర్లు గోస్వామి 4 వికెట్లతో చెలరేగగా.. గైక్వాడ్​(3), మానసి జోషీ (1) వికెట్లు పడగొట్టారు.

ఇదీ చూడండి: రెండో వన్డేలో మిథాలీ సేన సత్తా చాటేనా?

దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తొలివన్డే ఘోర పరాజయం తర్వాత.. భారత మహిళల జట్టు పుంజుకుంది. లఖ్​నవూ వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డే 9 వికెట్ల తేడాతో మిథాలీసేన ప్రత్యర్థిపై గెలుపొందింది. సౌతాఫ్రికా టీమ్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా కేవలం 28.4 ఓవర్లలో వికెట్​ నష్టపోయి ఛేదించింది.

టీమ్ఇండియా బ్యాట్స్​వుమెన్​ స్మృతి మంధాన (80), పూనమ్​ రౌత్​ (60) చెరో అర్ధశతకంతో చెలరేగి.. జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకంగా వ్యవహరించారు.

అంతకుముందు టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 41 ఓవర్లలో 157 పరుగుల చేసి ఆలౌట్​ అయ్యింది. టీమ్ఇండియా బౌలర్లు గోస్వామి 4 వికెట్లతో చెలరేగగా.. గైక్వాడ్​(3), మానసి జోషీ (1) వికెట్లు పడగొట్టారు.

ఇదీ చూడండి: రెండో వన్డేలో మిథాలీ సేన సత్తా చాటేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.