ETV Bharat / sports

కష్టాల్లో భారత్​.. లంచ్​ విరామానికి 80/4

author img

By

Published : Mar 5, 2021, 11:41 AM IST

Updated : Mar 5, 2021, 12:07 PM IST

మొతేరా వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్టులో లంచ్​ సమయానికి భారత్..​ నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. 32 పరుగులతో రోహిత్ క్రీజులో ఉన్నాడు.​

IND VS ENG LUNCH TIME
కష్టాల్లో భారత్​.. లంచ్​ విరామానికి 80/4

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న చివరి టెస్టులో భారత్​ భోజన విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్​ శర్మ(32) ఉన్నాడు. ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్ రెండు వికెట్లు​ తీసుకున్నాడు.

ఓవర్​నైట్​ స్కోర్ 24/1తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమ్​ఇండియాను.. లీచ్​ ఆదిలోనే దెబ్బకొట్టాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన పుజారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్​ కోహ్లీ.. స్టోక్స్​ బౌలింగ్​లో డకౌట్​గా వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన రహానె.. రోహిత్​కు సహకారమందించాడు. అయితే లంచ్​ విరామానికి ముందే రహానె వెనుదిరిగాడు. నాల్గో వికెట్​కు ఈ జోడీ 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

అహ్మదాబాద్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతోన్న చివరి టెస్టులో భారత్​ భోజన విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్​ శర్మ(32) ఉన్నాడు. ఇంగ్లాండ్​ బౌలర్లలో అండర్సన్ రెండు వికెట్లు​ తీసుకున్నాడు.

ఓవర్​నైట్​ స్కోర్ 24/1తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమ్​ఇండియాను.. లీచ్​ ఆదిలోనే దెబ్బకొట్టాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన పుజారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్​ కోహ్లీ.. స్టోక్స్​ బౌలింగ్​లో డకౌట్​గా వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన రహానె.. రోహిత్​కు సహకారమందించాడు. అయితే లంచ్​ విరామానికి ముందే రహానె వెనుదిరిగాడు. నాల్గో వికెట్​కు ఈ జోడీ 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

ఇదీ చదవండి: నాల్గో టెస్టుకు ఆర్చర్​ దూరమైంది ఇందుకే...

Last Updated : Mar 5, 2021, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.