ETV Bharat / sports

మూడో టెస్టుకు ఉమేశ్​ స్థానంలో నటరాజన్! - మూడో టెస్టుకు అందుబాటులో నటరాజన్​

రెండో టెస్టులో గాయపడటం వల్ల టీమ్​ఇండియా బౌలర్​ ఉమేశ్​ యాదవ్​ ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు అందుబాటులో ఉండట్లేదు. అతడి స్థానంలో నటరాజన్​ను తీసుకునే అవకాశముందని తెలిసింది.

umesh
ఉమేశ్​
author img

By

Published : Dec 29, 2020, 9:00 AM IST

Updated : Dec 29, 2020, 9:44 AM IST

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు టీమ్​ఇండియా బౌలర్​ ఉమేశ్​యాదవ్​ దూరం కానున్నాడు. రెండో టెస్టులో అతడు గాయపడటమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని క్రికెట్​ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. అయితే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశముందని స్పష్టం చేశాయి. అతడి స్థానంలో యార్కర్ల స్పెషలిస్ట్​ నటరాజన్​ను తీసుకోనున్నట్లు తెలిపాయి.

రెండో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్​లో తన నాలుగో ఓవర్ బౌలింగ్​ వేస్తున్న సమయంలో ఉమేశ్​ మోకాలికి దెబ్బ తగిలింది. వెంటనే అతడిని డ్రెసింగ్​ రూమ్​కు తరలించారు. ఇప్పటికే గాయాల కారణంగా మహ్మద్​ షమీ, ఇషాంత్​ శర్మ సేవలను కోల్పోయింది టీమ్ఇండియా. కాగా, జనవరి 7వ తేదీ నుంచి సిడ్నీ వేదికగా ఆసీస్​-భారత్​ మూడో టెస్టులో తలపడనున్నాయి.

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు టీమ్​ఇండియా బౌలర్​ ఉమేశ్​యాదవ్​ దూరం కానున్నాడు. రెండో టెస్టులో అతడు గాయపడటమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని క్రికెట్​ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అతడు చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. అయితే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశముందని స్పష్టం చేశాయి. అతడి స్థానంలో యార్కర్ల స్పెషలిస్ట్​ నటరాజన్​ను తీసుకోనున్నట్లు తెలిపాయి.

రెండో టెస్టు మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్​లో తన నాలుగో ఓవర్ బౌలింగ్​ వేస్తున్న సమయంలో ఉమేశ్​ మోకాలికి దెబ్బ తగిలింది. వెంటనే అతడిని డ్రెసింగ్​ రూమ్​కు తరలించారు. ఇప్పటికే గాయాల కారణంగా మహ్మద్​ షమీ, ఇషాంత్​ శర్మ సేవలను కోల్పోయింది టీమ్ఇండియా. కాగా, జనవరి 7వ తేదీ నుంచి సిడ్నీ వేదికగా ఆసీస్​-భారత్​ మూడో టెస్టులో తలపడనున్నాయి.

ఇదీ చూడండి : ఆసీస్ చెత్త ప్రదర్శన చేస్తోంది: పాంటింగ్

Last Updated : Dec 29, 2020, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.