ETV Bharat / sports

'బుమ్రాను ఎదుర్కొన్నప్పుడు ఆ అనుభూతి కలిగింది'

author img

By

Published : Feb 3, 2021, 9:59 PM IST

టీమ్​ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్​లో బుమ్రా వేసిన బంతులను ఎదుర్కోవడం.. ప్లేస్టేషన్​లో క్రికెట్​ ఆడినట్లు అనిపించిందని అన్నాడు ఆస్ట్రేలియా యువ క్రికెటర్​ విల్​ పకోస్కీ. బుమ్రా ఉత్తమ బౌలర్​ అని కితాబిచ్చాడు. తాను చిన్పప్పటి నుంచి ప్లేస్టేషన్​ను బాగా ఆడతానని చెప్పాడు.

bumrah
బుమ్రా

టీమ్​ఇండియాతో జరిగిన మూడో టెస్టులో బౌలర్​ బుమ్రాను ఎదుర్కోవడం ప్లేస్టేషన్​లో క్రికెట్​ ఆడిన ఆనుభూతి కలిగిందని అన్నాడు ఆసీస్​ యువ ఆటగాడు​ విల్​పకోస్కీ. ఈ మ్యాచును తాను ఎంతగానో ఆస్వాదించినట్లు చెప్పాడు.

"నేను నిజంగా చెప్తున్నా.. సిడ్నీ టెస్టులో బుమ్రాను ఎదుర్కోవడం ప్లేస్టేషన్​లో ఆడినట్టుంది. నాకు ఇంకా చిన్నప్పడు జరిగిన ఓ సంఘటన బాగా గుర్తుంది. అనారోగ్యంగా ఉన్నానని అబద్ధం చెప్పి పాఠశాలకు సెలవు పెట్టి ప్లేస్టేషన్​ ఆడేవాడిని. అయితే ఇందులో నా పాత్ర ఆస్ట్రేలియా మాజీ ఆల్​రౌండర్​ షేన్​ వాట్సన్​. ఇంగ్లాండ్​తో యాషెస్​ సిరీస్​ ఆడేవాడిని. అప్పుడు అతనంటే నాకు చాలా బాగా ఇష్టం. ఇప్పుడు మూడో టెస్టులో ఆడినప్పుడు కూడా అదే అనుభూతి కల్గింది. వాట్సన్​ లాగా ఆడుతున్నట్లు భావించాను. బుమ్రా టాప్​ బౌలర్​. అతడిని ఎదుర్కొన్నప్పుడు.. ప్లేస్టేషన్​లో ఇంగ్లాండ్​తో యాషెస్​ సిరీస్​ తలపడినట్లు అనిపించింది. ఇప్పటికీ ప్లేస్టేషన్​ ఆడుతూనే ఉన్నాను."

-పకోస్కీ, ఆస్ట్రేలియా క్రికెటర్​.

ఈ సిరీస్​ను 2-1తో కైవసం చేసుకుంది టీమ్​ఇండియా. బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ ట్రోఫీని చేజారనివ్వకుండా తమ వద్దే ఉంచుకుంది. ఫిబ్రవరి 5నుంచి ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ ఆడనుంది భారత్​.

'బుమ్రాను ఎదుర్కొన్నప్పుడు ప్లేస్టేషన్​ ఆడినట్టుంది'

ఇదీ చూడండి: పకోస్కీ.. ఆసీస్​ భవిష్యత్​ స్టార్: పాంటింగ్​

టీమ్​ఇండియాతో జరిగిన మూడో టెస్టులో బౌలర్​ బుమ్రాను ఎదుర్కోవడం ప్లేస్టేషన్​లో క్రికెట్​ ఆడిన ఆనుభూతి కలిగిందని అన్నాడు ఆసీస్​ యువ ఆటగాడు​ విల్​పకోస్కీ. ఈ మ్యాచును తాను ఎంతగానో ఆస్వాదించినట్లు చెప్పాడు.

"నేను నిజంగా చెప్తున్నా.. సిడ్నీ టెస్టులో బుమ్రాను ఎదుర్కోవడం ప్లేస్టేషన్​లో ఆడినట్టుంది. నాకు ఇంకా చిన్నప్పడు జరిగిన ఓ సంఘటన బాగా గుర్తుంది. అనారోగ్యంగా ఉన్నానని అబద్ధం చెప్పి పాఠశాలకు సెలవు పెట్టి ప్లేస్టేషన్​ ఆడేవాడిని. అయితే ఇందులో నా పాత్ర ఆస్ట్రేలియా మాజీ ఆల్​రౌండర్​ షేన్​ వాట్సన్​. ఇంగ్లాండ్​తో యాషెస్​ సిరీస్​ ఆడేవాడిని. అప్పుడు అతనంటే నాకు చాలా బాగా ఇష్టం. ఇప్పుడు మూడో టెస్టులో ఆడినప్పుడు కూడా అదే అనుభూతి కల్గింది. వాట్సన్​ లాగా ఆడుతున్నట్లు భావించాను. బుమ్రా టాప్​ బౌలర్​. అతడిని ఎదుర్కొన్నప్పుడు.. ప్లేస్టేషన్​లో ఇంగ్లాండ్​తో యాషెస్​ సిరీస్​ తలపడినట్లు అనిపించింది. ఇప్పటికీ ప్లేస్టేషన్​ ఆడుతూనే ఉన్నాను."

-పకోస్కీ, ఆస్ట్రేలియా క్రికెటర్​.

ఈ సిరీస్​ను 2-1తో కైవసం చేసుకుంది టీమ్​ఇండియా. బోర్డర్‌-గావస్కర్‌ సిరీస్‌ ట్రోఫీని చేజారనివ్వకుండా తమ వద్దే ఉంచుకుంది. ఫిబ్రవరి 5నుంచి ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​ ఆడనుంది భారత్​.

'బుమ్రాను ఎదుర్కొన్నప్పుడు ప్లేస్టేషన్​ ఆడినట్టుంది'

ఇదీ చూడండి: పకోస్కీ.. ఆసీస్​ భవిష్యత్​ స్టార్: పాంటింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.