సిడ్నీ మైదానంలో ప్రేక్షకుల నుంచి జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొవడం ఇదేమీ తొలిసారి కాదని చెప్పాడు టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. గతంలోనూ ఇలాంటివి పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న మూడో టెస్టు నాలుగో రోజున టీమ్ఇండియాపై పలువురు ప్రేక్షకులు అనుచిత వ్యాఖ్యలపై వివాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత నిర్వహకులు జోక్యం చేసుకుని వారిని స్టేడియం నుంచి బయటకు పంపారు. దీనిపై అశ్విన్ స్పందించాడు.
"సిడ్నీలో గతంలోనూ జాతివిద్వేషానికి గురయ్యాం. దీనిపై కఠినంగా వ్యవహరించాలి. జాతివివక్ష, చులకనక చూడటం లాంటివి 2011లో నాకు అవగాహన లేవు. ఈ వ్యాఖ్యలకు ప్రజలు నవ్వడం బాధాకరం."
-రవిచంద్రన్ అశ్విన్, భారత స్పిన్నర్
జాతి వివక్ష వ్యాఖ్యలకు నిరసన తెలిపి.. అంపైర్లకు ఫిర్యాదు చేశారు భారత క్రికెటర్లు. ఈ నేపథ్యంలో నాలుగో రోజు దాదాపు 10నిమిషాల పాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. సదరు అల్లరి మూకలను భద్రతా సిబ్బంది మైదానం నుంచి బహిష్కరించారు. ఈ వ్యవహారంపై టీమ్ఇండియాకు క్షమాపణ చెప్పింది క్రికెట్ ఆస్ట్రేలియా.
ఇదీ చూడండి: ఒకే రోజు.. 309 పరుగులు.. టీమ్ఇండియా లక్ష్యం!