ETV Bharat / sports

'అజార్ అలీకి మద్దతుగా నిలిచిన సర్ఫరాజ్'

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టెస్టు సిరీస్​లో పాకిస్థాన్​ జట్టు తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు పాక్​ మాజీ కెప్టెన్​ సర్ఫరాజ్​ అహ్మద్​. ఆ దేశ టెస్టు సారథి​ అజార్​ అలీకి తాను పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ట్వీట్​ చేశాడు.

author img

By

Published : Aug 10, 2020, 9:34 PM IST

Updated : Aug 10, 2020, 9:43 PM IST

England vs Pakistan: Sarfaraz Ahmed backs under-fire captain Azhar Ali
'ఆ సిరీస్​లో పాకిస్థాన్​ విజయం సాధిస్తుంది'

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టెస్టు సిరీస్​లో పాకిస్థాన్​ జట్టు తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు ఆ దేశ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్​ అహ్మద్​. ప్రస్తుత టెస్టు సారథి అజార్​ అలీకి తాను పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ట్విట్టర్​లో వెల్లడించాడు.

"భయ్యా.. మీరు బలంగా ఉండండి. ఇంగ్లాండ్​పై టెస్టు సిరీస్​లో పాకిస్థాన్​ విజయం సాధిస్తుందని నాకు నమ్మకం ఉంది" అని ట్వీట్​ చేశాడు సర్ఫరాజ్​​.

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో మూడు వికెట్ల తేడాతో పాక్​ ఓటమి పాలైంది. ఫలితంగా మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 1-0 తేడాతో ఇంగ్లాండ్​ ఆధిక్యంలో నిలిచింది. వోక్స్‌ (84 నాటౌట్‌), బట్లర్‌ (75) పోరాడడం వల్ల నాలుగో రోజు 277 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఇంగ్లీష్​ జట్టు ఛేదించింది. యాసిర్‌ షా మాయాజాలానికి ఓ దశలో ఇంగ్లాండ్‌ 117 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోగా.. వోక్స్‌, బట్లర్‌ ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు.

అంతకుముందు పాకిస్థాన్‌ (ఓవర్‌నైట్‌ 137/8) రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 326 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 219 పరుగులకే ఆలౌటైంది. వోక్స్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న టెస్టు సిరీస్​లో పాకిస్థాన్​ జట్టు తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు ఆ దేశ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్​ అహ్మద్​. ప్రస్తుత టెస్టు సారథి అజార్​ అలీకి తాను పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ట్విట్టర్​లో వెల్లడించాడు.

"భయ్యా.. మీరు బలంగా ఉండండి. ఇంగ్లాండ్​పై టెస్టు సిరీస్​లో పాకిస్థాన్​ విజయం సాధిస్తుందని నాకు నమ్మకం ఉంది" అని ట్వీట్​ చేశాడు సర్ఫరాజ్​​.

ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో మూడు వికెట్ల తేడాతో పాక్​ ఓటమి పాలైంది. ఫలితంగా మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 1-0 తేడాతో ఇంగ్లాండ్​ ఆధిక్యంలో నిలిచింది. వోక్స్‌ (84 నాటౌట్‌), బట్లర్‌ (75) పోరాడడం వల్ల నాలుగో రోజు 277 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఇంగ్లీష్​ జట్టు ఛేదించింది. యాసిర్‌ షా మాయాజాలానికి ఓ దశలో ఇంగ్లాండ్‌ 117 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోగా.. వోక్స్‌, బట్లర్‌ ఆరో వికెట్‌కు 139 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు.

అంతకుముందు పాకిస్థాన్‌ (ఓవర్‌నైట్‌ 137/8) రెండో ఇన్నింగ్స్‌లో 169 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 326 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్‌ 219 పరుగులకే ఆలౌటైంది. వోక్స్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

Last Updated : Aug 10, 2020, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.