భారత్తో చివరి టెస్టుకు జోఫ్రా ఆర్చర్ దూరం అయ్యేందుకు కారణాన్ని చెప్పింది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. జోఫ్రా కుడి మోచేతి సమస్య వల్లే నాల్గో టెస్టులో ఆడట్లేదని వెల్లడించింది.
"జోఫ్రా ఆర్చర్ కుడి మోచేతి సమస్య కారణంగా ఈ టెస్టులో అతడు బరిలోకి దిగట్లేదు. వైద్య బృందం నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్తో సహా మరికొందరు ఆటగాళ్లు అతిసారం వ్యాధితో బాధపడుతున్నారు" అని ఇంగ్లాండ్ బోర్డు ప్రకటించింది.
స్టోక్స్ డయేరియాతో బాధపడుతున్నాడని బోర్డు తెలిపినప్పటికీ.. తుది జట్టులో అతడికి చోటు దక్కింది. నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అతడు అర్ధ సెంచరీతో రాణించాడు. బెయిర్ స్టో, ఒల్లీ పోప్తో కలిసి జట్టుకు అవసరమైన భాగస్వామ్యాలు నమోదు చేశాడు.
ఇదీ చదవండి: ఇంగ్లాండ్ క్రికెటర్లకు డయేరియా.. కానీ!