టీమ్ఇండియా ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన తన బౌలింగ్ను ఉతికేస్తారని ఆస్ట్రేలియా పేసర్ మేగన్ షట్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్తో తలపడటం తనకు ఇష్టం లేదని తెలిపింది.
"టీమ్ఇండియాతో ఆడాలంటే నాకు నచ్చదు. వాళ్లిద్దరూ(షెఫాలీ, స్మృతి) నాపై ఆధిపత్యం చెలాయిస్తారు. పవర్ప్లేలో వారికి బౌలింగ్ చేయాలని లేదు. ఇటీవల జరిగిన ట్రై సిరీస్లోనూ షెఫాలీ నా బౌలింగ్లో భారీ సిక్స్ కొట్టింది. నా కెరీర్లోనే ఇప్పటివరకూ ఎవరూ అలా కొట్టలేదు. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో వారిని కట్టడిచేసేందుకు మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. అయినా, పవర్ప్లేలో వారిద్దరూ నా బౌలింగ్ను అలవోకగా ఎదుర్కొంటారు."
-మేగన్ షట్, ఆస్ట్రేలియా పేసర్
టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జట్లు మహిళా టీ20 ప్రపంచకప్లో ఫైనల్కు చేరాయి. వర్షం కారణంగా తొలి సెమీస్ రద్దవడం వల్ల ఇంగ్లాండ్ నిష్క్రమించగా భారత్ తుదిపోరుకు అర్హత సాధించింది. రెండో సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఆసీస్ డక్వర్త్లూయిస్ పద్ధతిలో 5 పరుగులతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో మెగన్ రెండు వికెట్లు తీసి 17 పరుగులిచ్చింది. ఇరుజట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.