గత నెలలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు యాక్టింగ్ సీఈఓగా నియమితులైన కుగాండ్రీ గోవెందర్ సస్పెన్షన్కు గురయ్యారు. గతంలో ఆమె బోర్డు చీఫ్ కమర్షియల్ ఆఫీసర్గా పనిచేసినప్పడు.. ప్రస్తుత పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పడు ఆమె ప్రవర్తన సరిగా లేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ చేపట్టిన బోర్డు.. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఫొలెసి మోసెకిని ఆ స్థానంలో భర్తీ చేసింది. దీంతో 2020లో మూడో యాక్టింగ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు ఫొలెసి. మరోవైపు సెక్రటరీ వెల్ష్ గ్వాజా కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతుంది.
ఇదీ చూడండి : డైరెక్టర్ల రాజీనామా.. దక్షిణాఫ్రికా బోర్డు రద్దు తప్పదా?