ETV Bharat / sports

'టీమ్​ఇండియాలో మార్పులకు వాళ్లే కారణం'

టీమ్​ఇండియాలో వచ్చిన మార్పు.. జట్టులోని ఆటగాళ్లు, కోచ్​లు, ఫిట్​నెస్​ ట్రైనర్ల ఐక్యత వల్లే సాధ్యమైందని గంగూలీ తెలిపాడు. ఫాస్ట్​ బౌలింగ్​ చేయగలమనే తమ సత్తాను బౌలర్లు గుర్తించారని వెల్లడించాడు.

author img

By

Published : Jul 6, 2020, 7:24 PM IST

team india
టీమ్​ఇండియా పేసర్లు

భారత క్రికెట్‌ సంస్కృతిలో మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​‌ గంగూలీ. తాము అత్యంత వేగంగా బౌలింగ్​ చేయగలమనే ఆత్మవిశ్వాసం బౌలర్లలో కనిపిస్తోందని తెలిపాడు.

మహ్మద్ షమి,‌ బుమ్రా, ఇషాంత్ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ లాంటి పేసర్లతో భారత పేస్‌ బౌలింగ్‌ దళం‌ ప్రపంచంలోనే అత్యుత్తమంగా తయారైందని దాదా కితాబిచ్చాడు. కొన్ని సందర్భాల్లో టీమ్​ఇండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశాడు.

ఈ విషయాన్ని టీమ్​ఇండియా ఓపెనర్​ మయాంక్​ అగర్వాల్​తో జరిగిన లైవ్ సంభాషణలో వెల్లడించాడు గంగూలీ. దీనికి సంబంధించిన వీడియోను తమ అధికారిక ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది బీసీసీఐ.

"టీమ్​ఇండియా క్రికెటర్ల ఐక్యత , కోచ్​లు, ఫిట్​నెస్​ ట్రైనర్లు అందరూ కలిసి క్రికెట్‌ సంస్కృతిలోనే మార్పు తెచ్చారు. బౌలర్లు తమ సత్తాను గుర్తించగలుగుతున్నారు. అత్యంత వేగంగా తాము బౌలింగ్‌ వేయగలమనే ధీమాను ప్రదర్శిస్తున్నారు. బ్యాట్స్​మెన్​ కూడా ఇలానే ఉన్నారు.

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

ప్రస్తుత భారత పేస్ దళం క్రికెట్ చరిత్రలోనే ఉత్తమంగా ఉందని ఇటీవల కొనియాడాడు పేసర్ మహ్మద్ షమి. ప్రపంచంలోని ఏ జట్టులోనూ ఐదుగురు ఫాస్ట్‌ బౌలర్లు లేరని అన్నాడు. కొత్త బంతితో ముందుగా ఎవరు బౌలింగ్​ చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సారథి కోహ్లీ తమకిస్తాడని తెలిపాడు.

team india
టీమ్​ఇండియా పేసర్లు

ఇది చూడండి : 'గంగూలీ అంటే అసహ్యం పుట్టేది'

ఇది చూడండి : 'సచిన్​ను ఔట్​ చేసేందుకు ఎన్నో వ్యూహాలు రచించాం'

భారత క్రికెట్‌ సంస్కృతిలో మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​‌ గంగూలీ. తాము అత్యంత వేగంగా బౌలింగ్​ చేయగలమనే ఆత్మవిశ్వాసం బౌలర్లలో కనిపిస్తోందని తెలిపాడు.

మహ్మద్ షమి,‌ బుమ్రా, ఇషాంత్ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ లాంటి పేసర్లతో భారత పేస్‌ బౌలింగ్‌ దళం‌ ప్రపంచంలోనే అత్యుత్తమంగా తయారైందని దాదా కితాబిచ్చాడు. కొన్ని సందర్భాల్లో టీమ్​ఇండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశాడు.

ఈ విషయాన్ని టీమ్​ఇండియా ఓపెనర్​ మయాంక్​ అగర్వాల్​తో జరిగిన లైవ్ సంభాషణలో వెల్లడించాడు గంగూలీ. దీనికి సంబంధించిన వీడియోను తమ అధికారిక ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది బీసీసీఐ.

"టీమ్​ఇండియా క్రికెటర్ల ఐక్యత , కోచ్​లు, ఫిట్​నెస్​ ట్రైనర్లు అందరూ కలిసి క్రికెట్‌ సంస్కృతిలోనే మార్పు తెచ్చారు. బౌలర్లు తమ సత్తాను గుర్తించగలుగుతున్నారు. అత్యంత వేగంగా తాము బౌలింగ్‌ వేయగలమనే ధీమాను ప్రదర్శిస్తున్నారు. బ్యాట్స్​మెన్​ కూడా ఇలానే ఉన్నారు.

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

ప్రస్తుత భారత పేస్ దళం క్రికెట్ చరిత్రలోనే ఉత్తమంగా ఉందని ఇటీవల కొనియాడాడు పేసర్ మహ్మద్ షమి. ప్రపంచంలోని ఏ జట్టులోనూ ఐదుగురు ఫాస్ట్‌ బౌలర్లు లేరని అన్నాడు. కొత్త బంతితో ముందుగా ఎవరు బౌలింగ్​ చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సారథి కోహ్లీ తమకిస్తాడని తెలిపాడు.

team india
టీమ్​ఇండియా పేసర్లు

ఇది చూడండి : 'గంగూలీ అంటే అసహ్యం పుట్టేది'

ఇది చూడండి : 'సచిన్​ను ఔట్​ చేసేందుకు ఎన్నో వ్యూహాలు రచించాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.