ETV Bharat / sports

టీమ్​ఇండియాపై ఆసీస్​ బోర్డు, మీడియా ప్రశంసలు

author img

By

Published : Jan 20, 2021, 12:27 PM IST

ఆస్ట్రేలియాపై చారిత్రక విజయాన్ని సాధించిన టీమ్​ఇండియాను ఆసీస్​ మీడియా ప్రశంసలతో ముంచెత్తుతోంది. భారత్​ విజయాన్ని కొనియాడుతూ ట్వీట్స్​ చేస్తున్నాయి. సిరీస్​ను ఎటువంటి ఒడుదొడుకులు లేకుండా నిర్వహించేందుకు కృషి చేసిన టీమ్​ఇండియాకు ఆసీస్​ బోర్డు కృతజ్ఞతలు తెలిపింది.

aus
ఆసీస్​

ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్ట్​లో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసి.. నాలుగు టెస్టుల సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 32 ఏళ్ల తర్వాత గబ్బాలో మన ఆటగాళ్లు తొలిసారి ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించడం విశేషం. దీంతో టీమ్​ఇండియా ఆటగాళ్లపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆసీస్​ మీడియాకు చెందిన 9న్యూస్‌, ఏబీసీ.నెట్‌.ఏయూ, క్రికెట్‌.కామ్‌.ఏయూ, 7 ఛానెల్​ తదితర మీడియా సంస్థలు కూడా భార్​తను ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ట్వీట్స్​ చేస్తున్నాయి.

  • Wow. WOW.

    For the first time in more than three decades, Australia are beaten at the Gabba.

    Which means, against ALL odds, India win the series 2-1! Unbelievable scenes 😮#AUSvIND pic.twitter.com/KJyD7zu0rM

    — 7Cricket (@7Cricket) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'గబ్బాలో భారత్ గర్జన', 'టీమ్​ఇండియా చారిత్రక విజయం', 'భారత్​ ప్రదర్శన అద్భుతం', 'రికార్డు బ్రేక్​: గబ్బా వేదిక విజయంతో ఆసీస్​పై భారత్​ సిరీస్​ సొంతం','మూడు దశాబ్దాల కాలంలో గబ్బాలో తొలిసారి ఆసీస్​ ఓటమి చెందింది. భారత్​ 2-1తేడాతో సిరీస్​ను సొంతం చేసుకుంది. నమ్మశక్యం కానిది.అంటూ పలు ట్వీట్స్​ సహా హెడ్​లైన్స్​గా ప్రచురిస్తున్నాయి.

క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రశంస

టీమ్​ఇండియా చారిత్రక విజయంపై ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు ప్రశంసలు కురిపించింది. ఆటగాళ్లు చూపిన ధైర్యం, తెగువ, నైపుణ్యాలు అద్భుతమని కొనియాడింది. ఈ సిరీస్​ను గొప్పగా, ఎటువంటి ఒడుదొడుకులు లేకుండా నిర్వహించేందుకు కృషి చేసిన బీసీసీఐకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

ఇదీ చూడండి : మరపురాని గెలుపు- భారత క్రికెట్​లో మరో మలుపు

ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్ట్​లో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసి.. నాలుగు టెస్టుల సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 32 ఏళ్ల తర్వాత గబ్బాలో మన ఆటగాళ్లు తొలిసారి ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించడం విశేషం. దీంతో టీమ్​ఇండియా ఆటగాళ్లపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆసీస్​ మీడియాకు చెందిన 9న్యూస్‌, ఏబీసీ.నెట్‌.ఏయూ, క్రికెట్‌.కామ్‌.ఏయూ, 7 ఛానెల్​ తదితర మీడియా సంస్థలు కూడా భార్​తను ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా ట్వీట్స్​ చేస్తున్నాయి.

  • Wow. WOW.

    For the first time in more than three decades, Australia are beaten at the Gabba.

    Which means, against ALL odds, India win the series 2-1! Unbelievable scenes 😮#AUSvIND pic.twitter.com/KJyD7zu0rM

    — 7Cricket (@7Cricket) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'గబ్బాలో భారత్ గర్జన', 'టీమ్​ఇండియా చారిత్రక విజయం', 'భారత్​ ప్రదర్శన అద్భుతం', 'రికార్డు బ్రేక్​: గబ్బా వేదిక విజయంతో ఆసీస్​పై భారత్​ సిరీస్​ సొంతం','మూడు దశాబ్దాల కాలంలో గబ్బాలో తొలిసారి ఆసీస్​ ఓటమి చెందింది. భారత్​ 2-1తేడాతో సిరీస్​ను సొంతం చేసుకుంది. నమ్మశక్యం కానిది.అంటూ పలు ట్వీట్స్​ సహా హెడ్​లైన్స్​గా ప్రచురిస్తున్నాయి.

క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రశంస

టీమ్​ఇండియా చారిత్రక విజయంపై ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు ప్రశంసలు కురిపించింది. ఆటగాళ్లు చూపిన ధైర్యం, తెగువ, నైపుణ్యాలు అద్భుతమని కొనియాడింది. ఈ సిరీస్​ను గొప్పగా, ఎటువంటి ఒడుదొడుకులు లేకుండా నిర్వహించేందుకు కృషి చేసిన బీసీసీఐకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.

ఇదీ చూడండి : మరపురాని గెలుపు- భారత క్రికెట్​లో మరో మలుపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.