ETV Bharat / sports

శ్రీలంక లీగ్​ నుంచి తప్పుకున్న రసెల్, డుప్లెసిస్​

author img

By

Published : Oct 27, 2020, 12:55 PM IST

నవంబర్ చివరి వారంలో మొదలు కానున్న లంక ప్రీమియర్ లీగ్(ఎల్​పీఎల్​) నుంచి ఐదుగురు విదేశీ ఆటగాళ్లు వైదొలిగారు. వెస్టిండీస్ ఆటగాడు ఆండ్రూ రసెల్​తో పాటు భారత్​కు చెందిన మన్వీందర్ బిస్లా ఈ లీగ్​ నుంచి తప్పుకున్నాడు.

Andre Russell pulls out of Lanka Premier League
ఆ ఐదుగురికి లంక ప్రీమియర్​ లీగ్​లో నోఛాన్స్​

నవంబర్ 21 నుంచి డిసెంబర్​ 13 వరకు జరగనున్న లంక ప్రీమియర్​ లీగ్​(ఎల్​పీఎల్​) నుంచి ఐదుగురు విదేశీ ఆటగాళ్లు వైదొలిగారు. ఇందులో వెస్టిండీస్​ ఆటగాడు ఆండ్రూ రసెల్​ సహా మరో నలుగురు క్రికెటర్లు ఉన్నారు.

ఐదుగురు వీరే :

  • ఆండ్రూ రసెల్ -వెస్టిండీస్
  • డుప్లెసిస్-దక్షిణాఫ్రికా
  • మిల్లర్ -దక్షిణాఫ్రికా
  • మన్వీందర్ బిస్లా -భారత్
  • డేవిడ్ మలన్​ -ఇంగ్లాండ్​

దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య సిరీస్ ఉన్న నేపథ్యంలో డుప్లెసిస్, మిల్లర్, మలన్​ లీగ్​కు దూరమయ్యారు. గాయం కారణంగా రసెల్​ కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కానీ మనీందర్ బిస్లా తప్పుకోవడానికి గల కారణం తెలియలేదు.

ఈసారి లంక ప్రీమియర్​ లీగ్​(ఎల్​పీఎల్​) రెండు స్టేడియాల్లో జరగనుంది. ఒకటి క్యాండీ ప్రాంతంలోని పల్లెకెలె స్టేడియం కాగా మరోటి హంబన్​టోటా లోని మహిందా రాజపక్సా స్టేడియం.

Andre Russell pulls out of Lanka Premier League
మిల్లర్
Andre Russell pulls out of Lanka Premier League
రసెల్​
Andre Russell pulls out of Lanka Premier League
మన్వీందర్ బిస్లా
Andre Russell pulls out of Lanka Premier League
డుప్లెసిస్

లంక ప్రీమియర్ లీగ్​లో కొలంబో కింగ్స్ జట్టుకు భారత్​కు చెందిన మన్​ప్రీత్​ గోనీ, మన్వీందర్​లు ఎంపికయ్యారు. నవంబర్​ 21నుంచి 15 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్​లు ఆడనున్నారు.

నవంబర్ 21 నుంచి డిసెంబర్​ 13 వరకు జరగనున్న లంక ప్రీమియర్​ లీగ్​(ఎల్​పీఎల్​) నుంచి ఐదుగురు విదేశీ ఆటగాళ్లు వైదొలిగారు. ఇందులో వెస్టిండీస్​ ఆటగాడు ఆండ్రూ రసెల్​ సహా మరో నలుగురు క్రికెటర్లు ఉన్నారు.

ఐదుగురు వీరే :

  • ఆండ్రూ రసెల్ -వెస్టిండీస్
  • డుప్లెసిస్-దక్షిణాఫ్రికా
  • మిల్లర్ -దక్షిణాఫ్రికా
  • మన్వీందర్ బిస్లా -భారత్
  • డేవిడ్ మలన్​ -ఇంగ్లాండ్​

దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య సిరీస్ ఉన్న నేపథ్యంలో డుప్లెసిస్, మిల్లర్, మలన్​ లీగ్​కు దూరమయ్యారు. గాయం కారణంగా రసెల్​ కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. కానీ మనీందర్ బిస్లా తప్పుకోవడానికి గల కారణం తెలియలేదు.

ఈసారి లంక ప్రీమియర్​ లీగ్​(ఎల్​పీఎల్​) రెండు స్టేడియాల్లో జరగనుంది. ఒకటి క్యాండీ ప్రాంతంలోని పల్లెకెలె స్టేడియం కాగా మరోటి హంబన్​టోటా లోని మహిందా రాజపక్సా స్టేడియం.

Andre Russell pulls out of Lanka Premier League
మిల్లర్
Andre Russell pulls out of Lanka Premier League
రసెల్​
Andre Russell pulls out of Lanka Premier League
మన్వీందర్ బిస్లా
Andre Russell pulls out of Lanka Premier League
డుప్లెసిస్

లంక ప్రీమియర్ లీగ్​లో కొలంబో కింగ్స్ జట్టుకు భారత్​కు చెందిన మన్​ప్రీత్​ గోనీ, మన్వీందర్​లు ఎంపికయ్యారు. నవంబర్​ 21నుంచి 15 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 23 మ్యాచ్​లు ఆడనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.