ETV Bharat / sports

విండీస్​​ బ్యాట్స్​మెన్​కు గాయం​.. మోసుకెళ్లిన కివీస్​ ప్లేయర్లు - under-19 cricket

క్రికెట్​లో క్రీడాస్ఫూర్తి అనగానే ఈ మధ్య కాలంలో అందరికీ గుర్తొస్తున్న పేరు న్యూజిలాండ్. కిందటి వరల్డ్​కప్​లో విజేత ఇంగ్లండ్ అయినా.. కోట్లాది మంది మనసుల్ని గెలుచుకుంది మాత్రం న్యూజిలాండేే..! తన ప్రవర్తనతో కివీస్ జట్టు ఆదర్శంగా నిలుస్తోంది. సీనియర్ల నుంచి ప్రేరణ పొందారేమో.. జూనియర్లు కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శించారు. అండర్ -19 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్​ జట్టు చూపించిన చొరవ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనిపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

An outstanding show of sportsmanship in the game between West Indies and New Zealand
అండర్​-19: గాయపడితే మోసుకెళ్లిన ప్రత్యర్థి జట్టు ప్లేయర్లు
author img

By

Published : Jan 30, 2020, 6:24 AM IST

Updated : Feb 28, 2020, 11:38 AM IST

క్రికెట్​లో ఒక్కోసారి ప్రత్యర్థులపైనా మమకారం చూపించిన ఘటనలు చూశాం. ఈ మధ్య కాలంలో స్ఫూర్తిదాయకమైన ఆటలో భాగంగా ఆటగాళ్లు చాలా స్నేహంగా ఉంటున్నారు. మైదానంలో స్నేహభావానికి గానూ ఇటీవల ఐసీసీ కోహ్లీకి అవార్డు ఇచ్చి ప్రశంసించిన సంగతి తెలిసిందే. క్రీడాస్ఫూర్తిని విశేషంగా చాటిన జట్టుగా న్యూజిలాండ్ ఐసీసీ గుర్తింపు పొందింది. కిందటి వరల్డ్ కప్ ఫైనల్లో కివీస్ ఓటమి పాలైనప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆవేదన చెందారు. ఆ ఆటగాళ్లకు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు న్యూజిలాండ్ యువ జట్టు కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శించింది. బుధవారం వెస్టిండీస్​, న్యూజిలాండ్​ మధ్య జరిగిన అండర్​-19 ప్రపంచకప్​ క్వార్టర్స్​లో ఇలాంటి ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

భుజాలపై మోసుకెళ్లారు...

ఈ మ్యాచ్​లో వెస్టిండీస్ జట్టులోని యువ బ్యాట్స్​మన్​ కిర్క్​ మెకంజీ.. కాలిపిక్క గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఫలితంగా నడవలేకపోతూ ఇబ్బంది పడుతుంటే.. ప్రత్యర్థి జట్టులోని న్యూజిలాండ్​ ఆటగాళ్లు జెస్సే టెక్సాఫ్​, పేసర్​ జో ఫీల్డ్​ అతడిని భుజాలపై మైదానం బయటివరకు మోసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ఈ వీడియోను ట్విట్టర్​లో షేర్ చేశాడు.

అండర్​-19 ప్రపంచకప్​లో భాగంగా రెండో క్వార్టర్​ ఫైనల్లో న్యూజిలాండ్​, వెస్టిండీస్​ జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్​ చేసిన యువ కరీబియన్​ జట్టు... 47.5 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. కిర్క్​ మెకంజీ(99; 104 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు)ఆకట్టుకున్నాడు. కెల్వన్​ అండర్సన్​(33), ఆంటోనియో మోరిస్​(31) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్​మన్​ నిరాశపర్చారు. న్యూజిలాండ్​ బౌలర్లలో క్రిస్టియన్​ క్లర్క్​ 4, జో ఫీల్డ్​, జెస్సే టెక్సాఫ్​ చెరో రెండు వికెట్లు సాధించారు. డేవిడ్​ హ్యాంకాక్​ ఒక వికెట్​ తీసుకున్నాడు.

రెండో బ్యాటింగ్​లో బరిలోకి దిగిన న్యూజిలాండ్ లక్ష్యాన్ని​ 49.4 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఫలితంగా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రీస్​ మారీ(26), లెల్​మ్యాన్​(29), సండే(32), సిమన్​ కీన్​(33), జో ఫీల్డ్​(38), క్లార్క్​(46) తలో చేయి వేసి గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఫలితంగా సెమీఫైనల్​కు చేరింది న్యూజిలాండ్​.

ఇంకో రెండు మాత్రమే..

మరో రెండు సూపర్​ లీగ్​ క్వార్టర్స్​లో బంగ్లాదేశ్​- దక్షిణాఫ్రికా(జనవరి 30), ఆఫ్గానిస్థాన్​-పాకిస్థాన్(జనవరి 31)​ తలపడనున్నాయి. ఇప్పటికే భారత్​, న్యూజిలాండ్​ సెమీస్​కు చేరాయి.

క్రికెట్​లో ఒక్కోసారి ప్రత్యర్థులపైనా మమకారం చూపించిన ఘటనలు చూశాం. ఈ మధ్య కాలంలో స్ఫూర్తిదాయకమైన ఆటలో భాగంగా ఆటగాళ్లు చాలా స్నేహంగా ఉంటున్నారు. మైదానంలో స్నేహభావానికి గానూ ఇటీవల ఐసీసీ కోహ్లీకి అవార్డు ఇచ్చి ప్రశంసించిన సంగతి తెలిసిందే. క్రీడాస్ఫూర్తిని విశేషంగా చాటిన జట్టుగా న్యూజిలాండ్ ఐసీసీ గుర్తింపు పొందింది. కిందటి వరల్డ్ కప్ ఫైనల్లో కివీస్ ఓటమి పాలైనప్పుడు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆవేదన చెందారు. ఆ ఆటగాళ్లకు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు న్యూజిలాండ్ యువ జట్టు కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శించింది. బుధవారం వెస్టిండీస్​, న్యూజిలాండ్​ మధ్య జరిగిన అండర్​-19 ప్రపంచకప్​ క్వార్టర్స్​లో ఇలాంటి ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

భుజాలపై మోసుకెళ్లారు...

ఈ మ్యాచ్​లో వెస్టిండీస్ జట్టులోని యువ బ్యాట్స్​మన్​ కిర్క్​ మెకంజీ.. కాలిపిక్క గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఫలితంగా నడవలేకపోతూ ఇబ్బంది పడుతుంటే.. ప్రత్యర్థి జట్టులోని న్యూజిలాండ్​ ఆటగాళ్లు జెస్సే టెక్సాఫ్​, పేసర్​ జో ఫీల్డ్​ అతడిని భుజాలపై మైదానం బయటివరకు మోసుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం ఈ వీడియోను ట్విట్టర్​లో షేర్ చేశాడు.

అండర్​-19 ప్రపంచకప్​లో భాగంగా రెండో క్వార్టర్​ ఫైనల్లో న్యూజిలాండ్​, వెస్టిండీస్​ జట్లు తలపడ్డాయి. ఇందులో తొలుత బ్యాటింగ్​ చేసిన యువ కరీబియన్​ జట్టు... 47.5 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. కిర్క్​ మెకంజీ(99; 104 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు)ఆకట్టుకున్నాడు. కెల్వన్​ అండర్సన్​(33), ఆంటోనియో మోరిస్​(31) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్​మన్​ నిరాశపర్చారు. న్యూజిలాండ్​ బౌలర్లలో క్రిస్టియన్​ క్లర్క్​ 4, జో ఫీల్డ్​, జెస్సే టెక్సాఫ్​ చెరో రెండు వికెట్లు సాధించారు. డేవిడ్​ హ్యాంకాక్​ ఒక వికెట్​ తీసుకున్నాడు.

రెండో బ్యాటింగ్​లో బరిలోకి దిగిన న్యూజిలాండ్ లక్ష్యాన్ని​ 49.4 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఫలితంగా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రీస్​ మారీ(26), లెల్​మ్యాన్​(29), సండే(32), సిమన్​ కీన్​(33), జో ఫీల్డ్​(38), క్లార్క్​(46) తలో చేయి వేసి గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఫలితంగా సెమీఫైనల్​కు చేరింది న్యూజిలాండ్​.

ఇంకో రెండు మాత్రమే..

మరో రెండు సూపర్​ లీగ్​ క్వార్టర్స్​లో బంగ్లాదేశ్​- దక్షిణాఫ్రికా(జనవరి 30), ఆఫ్గానిస్థాన్​-పాకిస్థాన్(జనవరి 31)​ తలపడనున్నాయి. ఇప్పటికే భారత్​, న్యూజిలాండ్​ సెమీస్​కు చేరాయి.

Last Updated : Feb 28, 2020, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.