ETV Bharat / sports

Ricky Ponting WTC Final : 'కోహ్లీ మాత్రమే కాదు.. అతడితోనూ జాగ్రత్తగా ఉండాలి'.. ఆసీస్​కు పాంటింగ్ సూచన

author img

By

Published : Jun 2, 2023, 12:40 PM IST

ఐపీఎల్​ సీజన్​కు తెరపడి కొద్ది రోజులు కాకుండానే ఇప్పుడు వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్​షిప్​ ఫైనల్స్​కి సమయం​ ఆసన్నమైంది. ఆస్ట్రేలియా- భారత్​ మధ్య జూన్​ 7 నుంచి జరగనున్న మ్యాచ్​కు లండన్​లోని ఓవల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్లేయర్​ రిక్కీ పాంటింగ్​ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇద్దరు టీమ్​ఇండియా ప్లేయర్స్​తో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. ఇంతకీ వారెవరంటే..

ricky pointing
ricky pointing

Ricky ponting on WTC final : టీమ్​ఇండియాకు ఆస్ట్రేలియాకు మధ్య జూన్​ 7 నుంచి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇరు జట్లు సైతం పట్టుదలగా నెట్​ ప్రాక్టీస్​లు చేస్తూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగనున్న మ్యాచ్‌లో గెలవాలంటే ఈ ఇద్దరిని ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేయాలని ఆస్ట్రేలియా టీమ్​ ప్లేయర్​ రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. భారత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాని ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేయాలని అన్నాడు.

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్‌ 16లో ఆర్సీబీ టీమ్​కు చెందిన టీమ్ఇండియా ప్లేయర్​ విరాట్ కోహ్లీ.. జరిగిన అన్నీ మ్యాచ్​ల్లో తనదైన స్టైల్​లో ఆడి.. రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలను తన ఖాతాలోకి వేసుకున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. మరోవైపు ఛతేశ్వర్ పుజారా కూడా ఇంగ్లీష్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ టీమ్‌కి ఆడి ఆ పిచ్‌లపై అద్భుత ప్రదర్శనను కనబరిచాడు. దీంతో ఈ ఇద్దరి వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుకి ప్రమాదం పొంచి ఉందని రిక్కీ పాంటింగ్ అన్నాడు. అందుకనే రాబోయే ఫైనల్స్​లో ఈ ఇద్దరినీ కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికల్ని ఆస్ట్రేలియా బౌలర్లు సిద్ధం చేసుకోవాలంటూ సూచించాడు.

"ఆస్ట్రేలియా టీమ్ విరాట్ కోహ్లీ గురించి చాలా మాట్లాడుకుంటుంది. అలానే ఛతేశ్వర్ పుజారా గురించి కూడా తప్పకుండా మా మధ్య చర్చ నడుస్తుంది. ఫైనల్లో ఈ ఇద్దరితోనే ఎక్కువ ప్రమాదం ఉంది. పుజారా గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా టీమ్‌పై నిలకడగా పరుగులు చేస్తున్నాడు. ఓవల్ పిచ్ కూడా ఆస్ట్రేలియా పిచ్‌లను పోలి ఉంటుంది. కాబట్టి.. అతడ్ని వేగంగా ఎలా ఔట్​ చేయాలో ఆస్ట్రేలియా బౌలర్లకి తెలుసు. ఇక విరాట్ కోహ్లీ కూడా బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. అతను కచ్చితంగా ఆసీస్ బౌలర్లకి సవాల్ విసరగలడు" అంటూ రిక్కీ పాంటింగ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

WTC Final 2023 : ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. జూన్ 7 -11 తేదీల్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇటీవలే ఐపీఎల్​ ముగించుకున్న టీమ్​ఇండియా ఆటగాళ్లంతా ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుని.. ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. కాగా మొదటి డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్​లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమ్ఇండియా ఈసారి ఎలాగైన టైటిల్ గెలవాలన్న కసితో బరిలో దిగనుంది.

WTC Final 2023 Squad : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), ఛెతేశ్వర్‌ పుజారా, శుభ్‌మన్‌ గిల్‌, అజింక్య రహానె, విరాట్‌ కోహ్లీ, కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), కేఎల్‌ రాహుల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, షమి, జయదేవ్‌ ఉనద్కత్‌, ఉమేశ్‌ యాదవ్‌ .

Ricky ponting on WTC final : టీమ్​ఇండియాకు ఆస్ట్రేలియాకు మధ్య జూన్​ 7 నుంచి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇరు జట్లు సైతం పట్టుదలగా నెట్​ ప్రాక్టీస్​లు చేస్తూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగనున్న మ్యాచ్‌లో గెలవాలంటే ఈ ఇద్దరిని ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేయాలని ఆస్ట్రేలియా టీమ్​ ప్లేయర్​ రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. భారత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాని ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేయాలని అన్నాడు.

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్‌ 16లో ఆర్సీబీ టీమ్​కు చెందిన టీమ్ఇండియా ప్లేయర్​ విరాట్ కోహ్లీ.. జరిగిన అన్నీ మ్యాచ్​ల్లో తనదైన స్టైల్​లో ఆడి.. రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలను తన ఖాతాలోకి వేసుకున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్​ను కొనసాగిస్తున్నాడు. మరోవైపు ఛతేశ్వర్ పుజారా కూడా ఇంగ్లీష్ కంట్రీ ఛాంపియన్‌షిప్‌లో ససెక్స్ టీమ్‌కి ఆడి ఆ పిచ్‌లపై అద్భుత ప్రదర్శనను కనబరిచాడు. దీంతో ఈ ఇద్దరి వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుకి ప్రమాదం పొంచి ఉందని రిక్కీ పాంటింగ్ అన్నాడు. అందుకనే రాబోయే ఫైనల్స్​లో ఈ ఇద్దరినీ కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికల్ని ఆస్ట్రేలియా బౌలర్లు సిద్ధం చేసుకోవాలంటూ సూచించాడు.

"ఆస్ట్రేలియా టీమ్ విరాట్ కోహ్లీ గురించి చాలా మాట్లాడుకుంటుంది. అలానే ఛతేశ్వర్ పుజారా గురించి కూడా తప్పకుండా మా మధ్య చర్చ నడుస్తుంది. ఫైనల్లో ఈ ఇద్దరితోనే ఎక్కువ ప్రమాదం ఉంది. పుజారా గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియా టీమ్‌పై నిలకడగా పరుగులు చేస్తున్నాడు. ఓవల్ పిచ్ కూడా ఆస్ట్రేలియా పిచ్‌లను పోలి ఉంటుంది. కాబట్టి.. అతడ్ని వేగంగా ఎలా ఔట్​ చేయాలో ఆస్ట్రేలియా బౌలర్లకి తెలుసు. ఇక విరాట్ కోహ్లీ కూడా బెస్ట్ ఫామ్‌లో ఉన్నాడు. అతను కచ్చితంగా ఆసీస్ బౌలర్లకి సవాల్ విసరగలడు" అంటూ రిక్కీ పాంటింగ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

WTC Final 2023 : ఇక మ్యాచ్​ విషయానికి వస్తే.. జూన్ 7 -11 తేదీల్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇటీవలే ఐపీఎల్​ ముగించుకున్న టీమ్​ఇండియా ఆటగాళ్లంతా ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుని.. ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. కాగా మొదటి డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్​లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమ్ఇండియా ఈసారి ఎలాగైన టైటిల్ గెలవాలన్న కసితో బరిలో దిగనుంది.

WTC Final 2023 Squad : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), ఛెతేశ్వర్‌ పుజారా, శుభ్‌మన్‌ గిల్‌, అజింక్య రహానె, విరాట్‌ కోహ్లీ, కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), కేఎల్‌ రాహుల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, సిరాజ్‌, షమి, జయదేవ్‌ ఉనద్కత్‌, ఉమేశ్‌ యాదవ్‌ .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.