Ricky ponting on WTC final : టీమ్ఇండియాకు ఆస్ట్రేలియాకు మధ్య జూన్ 7 నుంచి ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్లోని ఓవల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్పై అభిమానుల్లో అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి. ఇరు జట్లు సైతం పట్టుదలగా నెట్ ప్రాక్టీస్లు చేస్తూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగనున్న మ్యాచ్లో గెలవాలంటే ఈ ఇద్దరిని ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేయాలని ఆస్ట్రేలియా టీమ్ ప్లేయర్ రిక్కీ పాంటింగ్ అభిప్రాయపడ్డారు. భారత సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారాని ఆస్ట్రేలియా బౌలర్లు కట్టడి చేయాలని అన్నాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2023 సీజన్ 16లో ఆర్సీబీ టీమ్కు చెందిన టీమ్ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ.. జరిగిన అన్నీ మ్యాచ్ల్లో తనదైన స్టైల్లో ఆడి.. రెండు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలను తన ఖాతాలోకి వేసుకున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్ను కొనసాగిస్తున్నాడు. మరోవైపు ఛతేశ్వర్ పుజారా కూడా ఇంగ్లీష్ కంట్రీ ఛాంపియన్షిప్లో ససెక్స్ టీమ్కి ఆడి ఆ పిచ్లపై అద్భుత ప్రదర్శనను కనబరిచాడు. దీంతో ఈ ఇద్దరి వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుకి ప్రమాదం పొంచి ఉందని రిక్కీ పాంటింగ్ అన్నాడు. అందుకనే రాబోయే ఫైనల్స్లో ఈ ఇద్దరినీ కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికల్ని ఆస్ట్రేలియా బౌలర్లు సిద్ధం చేసుకోవాలంటూ సూచించాడు.
-
Energy levels high 💪🏻
— BCCI (@BCCI) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Upping the intensity with each session ahead of #WTC23 🙌#TeamIndia pic.twitter.com/q6IAORAkIz
">Energy levels high 💪🏻
— BCCI (@BCCI) June 2, 2023
Upping the intensity with each session ahead of #WTC23 🙌#TeamIndia pic.twitter.com/q6IAORAkIzEnergy levels high 💪🏻
— BCCI (@BCCI) June 2, 2023
Upping the intensity with each session ahead of #WTC23 🙌#TeamIndia pic.twitter.com/q6IAORAkIz