భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అయిదో సీడ్ సైనా 21-10, 21-19తో మరియా యులితినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్లో సమీర్వర్మ, అజయ్ జయరాం క్వార్టర్స్ చేరుకోగా.. కిదాంబి శ్రీకాంత్ నిష్క్రమించాడు. ప్రిక్వార్టర్స్లో సమీర్ 21-14, 16-21, 21-15తో షెఫర్ (జర్మనీ)పై, జయరాం 21-6, 21-17తో మూడో సీడ్ శ్రీకాంత్పై నెగ్గారు.
![స్పెయిన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6147452_bad-1.jpg)
![స్పెయిన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6147452_bad-2.jpg)
ఇదీ చూడండి : లంచ్ బ్రేక్ : తడబడుతోన్న భారత బ్యాట్స్మెన్