ETV Bharat / sitara

కరోనాకు కృతజ్ఞతలు చెప్పిన విద్యాబాలన్‌

author img

By

Published : Mar 25, 2020, 7:49 PM IST

ప్రపంచమంతా కరోనా దెబ్బకు వణికిపోతుంటే.. బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ అందుకు భిన్నంగా స్పందించింది. మంచి పని చేశావు కరోనా అంటూ కారణాలతో సహా ఇన్​స్టాలో రాసుకొచ్చింది.

Vidya Balan
కరోనాకు కృతజ్ఞతలు తెలిపిన విద్యాబాలన్‌!

కరోనా అంటే ప్రస్తుతం ప్రపంచం హడలిపోతుంది. బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ మాత్రం ఈ వైరస్​ చాలా మంచి పనిచేసిందని ప్రశంసిస్తోంది. అందుకు సంబంధించిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోగా పోస్ట్ చేసింది.

"నిత్యం బిజీగా వాహన కాలుష్యంతో నిండివున్న రద్దీని తగ్గించింది. చెట్లు, ఆకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మమ్మల్ని కదిలించినందుకు, మేం చాలా పెద్దదానిపై ఆధారపడి ఉన్నామని తెలిపినందుకు ధన్యవాదాలు. ఎంతో విలాసంగా జీవించే మాకు ఉత్పత్తులు, స్వేచ్ఛలాంటి వాటి నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నాం. మనకు ఇష్టమైన ఎన్నో ప్రాథమిక అవసరాలను పక్కన పెట్టి బిజినెస్‌ అంటూ తిరిగాం. నీవల్ల అవన్నీ తెలిసి వచ్చాయి. మేం ఏం కోల్పోయామనే విషయాన్ని కరోనా వల్లే తెలిసింది. గతంలో పర్యావరణానికి ఎంతో హాని చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రపంచమంతా నీవల్ల ఇప్పుడు కలుస్తుంది. నీవల్ల మాలో ఐక్యత పెరిగింది. ప్రపంచం ఇప్పుడు మారిపోతుంది. ఎప్పుడూ ఓకేలా ఉండదు అని నిరూపించావు" - ఇన్​స్టాలో విద్యాబాలన్

వచ్చే మే లో రానున్న​ సినిమా

విద్యాబాలన్‌... ప్రస్తుతం గణితమేధావి శకుంతలాదేవి బయోపిక్​ 'శకుంతలాదేవి'లో నటిస్తోంది. అను మేనన్‌ దర్శకురాలు. ఇందులో సన్యా మల్హోత్రా, స్పందన్‌ చతుర్వేది తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: త్వరలోనే తీపి రుచి చూస్తామంటున్న సెలబ్రిటీలు

కరోనా అంటే ప్రస్తుతం ప్రపంచం హడలిపోతుంది. బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ మాత్రం ఈ వైరస్​ చాలా మంచి పనిచేసిందని ప్రశంసిస్తోంది. అందుకు సంబంధించిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోగా పోస్ట్ చేసింది.

"నిత్యం బిజీగా వాహన కాలుష్యంతో నిండివున్న రద్దీని తగ్గించింది. చెట్లు, ఆకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మమ్మల్ని కదిలించినందుకు, మేం చాలా పెద్దదానిపై ఆధారపడి ఉన్నామని తెలిపినందుకు ధన్యవాదాలు. ఎంతో విలాసంగా జీవించే మాకు ఉత్పత్తులు, స్వేచ్ఛలాంటి వాటి నుంచి స్వల్ప విరామం తీసుకుంటున్నాం. మనకు ఇష్టమైన ఎన్నో ప్రాథమిక అవసరాలను పక్కన పెట్టి బిజినెస్‌ అంటూ తిరిగాం. నీవల్ల అవన్నీ తెలిసి వచ్చాయి. మేం ఏం కోల్పోయామనే విషయాన్ని కరోనా వల్లే తెలిసింది. గతంలో పర్యావరణానికి ఎంతో హాని చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ప్రపంచమంతా నీవల్ల ఇప్పుడు కలుస్తుంది. నీవల్ల మాలో ఐక్యత పెరిగింది. ప్రపంచం ఇప్పుడు మారిపోతుంది. ఎప్పుడూ ఓకేలా ఉండదు అని నిరూపించావు" - ఇన్​స్టాలో విద్యాబాలన్

వచ్చే మే లో రానున్న​ సినిమా

విద్యాబాలన్‌... ప్రస్తుతం గణితమేధావి శకుంతలాదేవి బయోపిక్​ 'శకుంతలాదేవి'లో నటిస్తోంది. అను మేనన్‌ దర్శకురాలు. ఇందులో సన్యా మల్హోత్రా, స్పందన్‌ చతుర్వేది తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: త్వరలోనే తీపి రుచి చూస్తామంటున్న సెలబ్రిటీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.