కరోనాపై అవగాహన పెంచేందుకు, ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు గాయకులు, సంగీత దర్శకులు వారి వంతు కృషి చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కరోనాపై ఓ పాట రూపొందించారు. దీనికి నిసార్ అందించిన సాహిత్యం ఆకట్టుకునేలా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇప్పటికే కరోనాపై అవగాహన కల్పించేలా సంగీత దర్శకుడు కోటి ఓ పాటను స్వరపరిచి ఆలపించారు. అందులో అగ్రహీరోలైన చిరంజీవి, నాగార్జునతోపాటు యువ కథానాయకులు వరుణ్తేజ్, సాయితేజ్ పాలుపంచుకున్నారు. ఈ వైరస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తూ.. దాని నిర్మూలనకు చేయాల్సిన కృషిని తెలిపేలా ఈ పాటను తెరకెక్కించారు.