క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఆదరణ ఎక్కువ. కథ నచ్చాలే గాని అది చిన్న చిత్రమా, పెద్ద చిత్రమా అని చూడరు. ఇటీవలే 'దిశ' సంఘటన జరిగింది. ఈ పేరునే తమ హీరోయిన్కు పెట్టి తీస్తున్న సినిమా 'వలయం'. ట్రైలర్ను హీరో అడివి శేష్ ఈరోజు(ఆదివారం) విడుదల చేశాడు. ఆద్యంతం ఆసక్తిగా ఉంటూ అంచనాల్ని పెంచుతుంది.
ఈ చిత్రంతో లక్ష్ చదవలవాడ హీరోగా పరిచయమవుతున్నాడు. దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా నటిస్తోంది. రమేశ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. శేఖర్ చంద్ర సంగీతమందించాడు. పద్మావతి చదవలవాడ నిర్మించారు. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">