ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు కథానాయకుడు అల్లు అర్జున్. ఇప్పుడీ ఉత్సాహంలోనే సుకుమార్ దర్శకత్వంలో ఓ బహుభాషా చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈరోజు బన్నీ పుట్టినరోజు పురస్కరించుకుని దీనికి 'పుష్ప' అనే టైటిల్ను ఖరారు చేస్తూ ఫస్ట్లుక్ను విడుదల చేసింది చిత్రబృందం. ఇది తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.
ఈ బర్త్డే కానుకగానే బన్నీ తర్వాతి చిత్రానికి సంబంధించి ఓ స్పష్టత వచ్చేసింది. అతడు తన 21వ చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్తో చేయనున్నాడు. 'ఐకాన్' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన గతంలోనే వచ్చింది. కానీ ఆ తర్వాత వేణు.. పవన్ కల్యాణ్తో 'వకీల్సాబ్' చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతలు అందుకోవడం వల్ల ఈ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయిందని అంతా భావించారు. తాజాగా స్టైలిష్స్టార్ బర్త్డే సందర్భంగా 'ఐకాన్' బృందం 'ఏఏ21' పేరుతో పోస్టర్ను విడుదల చేసింది. ఫలితంగా దీనిపై ఉన్న ఊహాగానాలన్నీ తొలగిపోయాయి. ఇది కూడా బహుభాషా చిత్రంగా రూపొందనున్నట్లు సమాచారం.