ETV Bharat / sitara

మహేశ్​బాబు కొత్త లుక్​కు అభిమానులు ఫిదా - maheshbabu latest still

కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ తర్వాత మళ్లీ ముఖానికి రంగేశారు హీరో మహేశ్​బాబు. ఓ వాణిజ్య ప్రకటన కోసం ఆయన చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

Tollywood Superstar Mahesh Babu
మహేశ్​బాబు కొత్త లుక్​కు అభిమానులు ఫిదా
author img

By

Published : Sep 9, 2020, 10:18 PM IST

కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అన్‌లాక్ తర్వాత చిత్రీకరణలకు ప్రభుత్వాలు అనుమతులిచ్చినప్పటికీ.. వైరస్ భయంతో స్టార్ హీరోలెవరూ షూటింగ్‌లను ప్రారంభించే సాహసం చేయలేదు. అయితే తాజాగా సూపర్​స్టార్​ మహేశ్​బాబు షూటింగ్‌కు హాజరయ్యారు. అయితే అది సినిమా షూటింగ్ కాదు.. వాణిజ్య ప్రకటన చిత్రీకరణ.

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ రెండ్రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారట. తాజాగా ప్రిన్స్ లుక్​ను అవినాష్​ గోవార్కర్​ అనే సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ షేర్​ చేయగా.. దానికి రీట్వీట్​ చేస్తూ మహేశ్​ సమాధానం ఇచ్చారు. ప్యాకప్​ షాట్స్​ సమయంలో అవినాష్ తీసే​ ఫొటోలను మిస్​ అయినట్లు సూపర్​స్టార్​ తెలిపారు. మళ్లీ షూటింగ్​లో పాల్గొనడంపైనా హర్షం వ్యక్తం చేశారు.

  • Superstar Mahesh Babu participating in the shooting for the first time post lockdown. He is doing an ad shoot at Annapurna Studio. pic.twitter.com/UbiLsQzXAB

    — Censor Reports 💎 (@CensorReports) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

డిసెంబర్​లో చిత్రీకరణ...?

మహేశ్​ బాబు హీరోగా.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా తొలి షెడ్యూల్​ కోసం చిత్రబృందం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది​. అయితే డిసెంబర్​లో చిత్రీకరణకు ప్రణాళిక రచిస్తున్నారట దర్శకనిర్మాతలు. అగ్రరాజ్యంలోనే నెలరోజుల పాటు షూటింగ్​ కొనసాగనుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా 'సర్కారు వారి పాట'ను నిర్మిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన మోషన్​ పోస్టర్​తో.. సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అందులో మహేష్‌ గడ్డంతో కూడిన మాస్‌లుక్‌లో కనిపించారు. కీర్తి సురేష్‌ హీరోయిన్​. తమన్‌ సంగీత దర్శకుడు.

కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అన్‌లాక్ తర్వాత చిత్రీకరణలకు ప్రభుత్వాలు అనుమతులిచ్చినప్పటికీ.. వైరస్ భయంతో స్టార్ హీరోలెవరూ షూటింగ్‌లను ప్రారంభించే సాహసం చేయలేదు. అయితే తాజాగా సూపర్​స్టార్​ మహేశ్​బాబు షూటింగ్‌కు హాజరయ్యారు. అయితే అది సినిమా షూటింగ్ కాదు.. వాణిజ్య ప్రకటన చిత్రీకరణ.

హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ షూటింగ్ జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ రెండ్రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారట. తాజాగా ప్రిన్స్ లుక్​ను అవినాష్​ గోవార్కర్​ అనే సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ షేర్​ చేయగా.. దానికి రీట్వీట్​ చేస్తూ మహేశ్​ సమాధానం ఇచ్చారు. ప్యాకప్​ షాట్స్​ సమయంలో అవినాష్ తీసే​ ఫొటోలను మిస్​ అయినట్లు సూపర్​స్టార్​ తెలిపారు. మళ్లీ షూటింగ్​లో పాల్గొనడంపైనా హర్షం వ్యక్తం చేశారు.

  • Superstar Mahesh Babu participating in the shooting for the first time post lockdown. He is doing an ad shoot at Annapurna Studio. pic.twitter.com/UbiLsQzXAB

    — Censor Reports 💎 (@CensorReports) September 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

డిసెంబర్​లో చిత్రీకరణ...?

మహేశ్​ బాబు హీరోగా.. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా తొలి షెడ్యూల్​ కోసం చిత్రబృందం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది​. అయితే డిసెంబర్​లో చిత్రీకరణకు ప్రణాళిక రచిస్తున్నారట దర్శకనిర్మాతలు. అగ్రరాజ్యంలోనే నెలరోజుల పాటు షూటింగ్​ కొనసాగనుందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా 'సర్కారు వారి పాట'ను నిర్మిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన మోషన్​ పోస్టర్​తో.. సినిమాపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అందులో మహేష్‌ గడ్డంతో కూడిన మాస్‌లుక్‌లో కనిపించారు. కీర్తి సురేష్‌ హీరోయిన్​. తమన్‌ సంగీత దర్శకుడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.