ETV Bharat / sitara

కరోనా కథతో 'అ!' దర్శకుడి కొత్త సినిమా!

author img

By

Published : Mar 31, 2020, 7:01 AM IST

ప్రపంచవ్యాప్తంగా పెను ప్రభావం చూపిస్తోన్న కరోనా వైరస్​పై సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Tollywood Director Prashant Varma will set to make a film about Corona
కరోనా కథతో 'అ!' దర్శకుడి కొత్త సినిమా!

కరోనా గురించి సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు టాలీవుడ్​ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. కరోనా వ్యాప్తి ఎలా జరుగుతుంది, ఈ వైరస్​ వల్ల ఏర్పడిన పరిస్థితులు, ప్రపంచదేశాలపై ఇది ఏ విధమైన ప్రభావం చూపింది తదితర అంశాలను ఇందులో చూపించనున్నాడు.

'అ!'తో డైరెక్టర్​గా పరిచయమయ్యాడు ప్రశాంత్. ఈ సినిమాకు జాతీయ అవార్డూ వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్​ తీసే ఆలోచనలో ఉన్నట్లు గతంలో చెప్పాడు. ఇటీవలే రాజశేఖర్​తో 'కల్కి' తీశాడు. అంతంతమాత్రంగానే ప్రేక్షకాదరణ దక్కించుకుందీ సినిమా.

Tollywood Director Prashant Varma will set to make a film about Corona
అ! సినిమా పోస్టర్​

కరోనా కారణంగా ప్రస్తుతం చిత్రీకరణలు, సినిమా విడుదలలు వాయిదా పడ్డాయి. ఈ వైరస్​ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న కారణంగా భారత్​లో వచ్చే నెల 14 వరకు లాక్​డౌన్ విధించారు. దీంతో సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు దాదాపుగా ఇళ్లకే పరిమితమయ్యారు.

ఇదీ చదవండి: తారక్ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్​లోకి ఎంట్రీ!

కరోనా గురించి సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు టాలీవుడ్​ యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. కరోనా వ్యాప్తి ఎలా జరుగుతుంది, ఈ వైరస్​ వల్ల ఏర్పడిన పరిస్థితులు, ప్రపంచదేశాలపై ఇది ఏ విధమైన ప్రభావం చూపింది తదితర అంశాలను ఇందులో చూపించనున్నాడు.

'అ!'తో డైరెక్టర్​గా పరిచయమయ్యాడు ప్రశాంత్. ఈ సినిమాకు జాతీయ అవార్డూ వచ్చింది. ఈ చిత్రానికి సీక్వెల్​ తీసే ఆలోచనలో ఉన్నట్లు గతంలో చెప్పాడు. ఇటీవలే రాజశేఖర్​తో 'కల్కి' తీశాడు. అంతంతమాత్రంగానే ప్రేక్షకాదరణ దక్కించుకుందీ సినిమా.

Tollywood Director Prashant Varma will set to make a film about Corona
అ! సినిమా పోస్టర్​

కరోనా కారణంగా ప్రస్తుతం చిత్రీకరణలు, సినిమా విడుదలలు వాయిదా పడ్డాయి. ఈ వైరస్​ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న కారణంగా భారత్​లో వచ్చే నెల 14 వరకు లాక్​డౌన్ విధించారు. దీంతో సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు దాదాపుగా ఇళ్లకే పరిమితమయ్యారు.

ఇదీ చదవండి: తారక్ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్​లోకి ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.