జాతీయ అవార్డు గ్రహీత తమిళ దర్శకుడు ఎస్పీ జననాథన్(61) కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జననాథన్.. చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు సినీప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి ప్రధానపాత్రలో రూపొందుతోన్న 'లాభం' సినిమాకు దర్శకుడిగా జననాథన్ వ్యవహరించారు.
ఎస్పీ జననాథన్.. 1959 మే 7న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. 2003లో విడుదలైన 'అయ్యర్కై' అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాకుగానూ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో జాతీయ అవార్డు లభించింది. బీ లెనిన్, భరథన్, విన్సెంట్ సెల్వ, కేయర్ వంటి దర్శకుల వద్ద ఆయన సహాయదర్శకుడిగా పనిచేశారు.
జననాథన్.. దర్శకుడిగానే కాకుండా, కథా రచయితగా, నిర్మాతగానూ రాణించారు. బైనరీ పిక్చర్స్ అనే నిర్మాణం సంస్థ ద్వారా 'పురంపొక్కు ఎంగిర పొదువుదమై' అనే చిత్రాన్ని నిర్మించారు.
ఇదీ చూడండి: బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదికి కరోనా