ETV Bharat / sitara

తాప్సీ కరెంట్ బిల్ లెక్క తేలింది

author img

By

Published : Jul 4, 2020, 8:19 AM IST

ఇటీవలే బాలీవుడ్​ హీరోయిన్​ తాప్సీ ఇంటికి వచ్చిన విద్యుత్​ బిల్లు ఆమెకు షాకిచ్చింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఈ ముద్దుగుమ్మ.. బిల్లు మొత్తం లెక్కించగా అంతా సరిపోయినట్లు వెల్లడించింది.

Taapsee Pannu crunched some numbers and figured out her Rs 36,000 power bill was legit
తాప్సీ

బాలీవుడ్​ బ్యూటీ తాప్సీ నివాసానికి ఇటీవలే వచ్చిన రూ.36 వేల విద్యుత్​ వినియోగ బిల్లు చర్చనీయాంశంగా మారింది. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా బిల్లు తీయకుండా వాటన్నిటిని తాజాగా పంపారు. అన్ని శ్లాబులనూ కలిపి ఒక్క నెలలోనే ఈ మొత్తం సుంకాన్ని విధించారు. ఈ క్రమంలోనే సాధారణం కన్నా 10 రెట్లు అధికంగా బిల్లు వచ్చిందని తాప్సీ ట్విట్టర్​ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, తాజాగా వచ్చిన మొత్తాన్ని లెక్కించగా.. బిల్లు చట్టబద్దమైనదేనని ఈ ముద్దుగుమ్మ స్పష్టం చేసింది.

  • So after an hour long meeting, crazy amount of numbers n calculations floating around, realised the “approximate” reading wasn’t really THAT approximate. Infact far from it. pic.twitter.com/rSjb36JKaA

    — taapsee pannu (@taapsee) July 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఒక గంటపాటు సుదీర్ఘ చర్చల అనంతరం.. ఈ భారీ బిల్లును లెక్కించగా అంతా సరిపోయింది. మొదట ఈ రసీదును చూడగానే శీతాకాలం సమయంలో రావాల్సిందేమో అనుకున్నా. ఇది మా అందరినీ నిజంగా ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంత మొత్తం ఎలా వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ దీని వివరణను ఓపికగా చెప్పినందుకు అదానీ విద్యుత్​ సంస్థకు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో ముందు జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తున్నా."

తాప్సీ పన్ను, బాలీవుడ్​ నటి

ఈ విద్యుత్​ బిల్లుల కష్టాలు ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఎదురయ్యాయి. వారిలో బాలీవుడ్​ ప్రముఖులు రిచా చద్దా, కవితా కౌషిక్​, రేణుకా షహానే, వీర్​ దాస్​, అమైరా దస్తూర్​, తుషార్, షట్లర్​ గుత్తా జ్వాలా ఉన్నారు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో వినియోగ దారుల నుంచి వెల్లువెత్తిన ఆరోపణలపై మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్​(ఎమ్​ఈఆర్​సీ) స్పందించింది. ఆటోమెటిక్​ మీటర్​ రీడింగ్​ సౌకర్యం ఉన్న చోట తప్ప.. మార్చి నుంచి మే వరకు లాక్​డౌన్​ కాలంలో సగటు వినియోగం ఆధారంగా వినియోగదారులకు విద్యుత్​ బిల్లు పెంచినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:మీకు కోటి ధన్యవాదాలు చెప్పిన సరిపోవు: మహేశ్

బాలీవుడ్​ బ్యూటీ తాప్సీ నివాసానికి ఇటీవలే వచ్చిన రూ.36 వేల విద్యుత్​ వినియోగ బిల్లు చర్చనీయాంశంగా మారింది. లాక్‌డౌన్ కారణంగా మూడు నెలలుగా బిల్లు తీయకుండా వాటన్నిటిని తాజాగా పంపారు. అన్ని శ్లాబులనూ కలిపి ఒక్క నెలలోనే ఈ మొత్తం సుంకాన్ని విధించారు. ఈ క్రమంలోనే సాధారణం కన్నా 10 రెట్లు అధికంగా బిల్లు వచ్చిందని తాప్సీ ట్విట్టర్​ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, తాజాగా వచ్చిన మొత్తాన్ని లెక్కించగా.. బిల్లు చట్టబద్దమైనదేనని ఈ ముద్దుగుమ్మ స్పష్టం చేసింది.

  • So after an hour long meeting, crazy amount of numbers n calculations floating around, realised the “approximate” reading wasn’t really THAT approximate. Infact far from it. pic.twitter.com/rSjb36JKaA

    — taapsee pannu (@taapsee) July 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఒక గంటపాటు సుదీర్ఘ చర్చల అనంతరం.. ఈ భారీ బిల్లును లెక్కించగా అంతా సరిపోయింది. మొదట ఈ రసీదును చూడగానే శీతాకాలం సమయంలో రావాల్సిందేమో అనుకున్నా. ఇది మా అందరినీ నిజంగా ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంత మొత్తం ఎలా వచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ దీని వివరణను ఓపికగా చెప్పినందుకు అదానీ విద్యుత్​ సంస్థకు ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో ముందు జాగ్రత్త తీసుకుంటారని ఆశిస్తున్నా."

తాప్సీ పన్ను, బాలీవుడ్​ నటి

ఈ విద్యుత్​ బిల్లుల కష్టాలు ఇప్పటికే అనేక మంది ప్రముఖులకు ఎదురయ్యాయి. వారిలో బాలీవుడ్​ ప్రముఖులు రిచా చద్దా, కవితా కౌషిక్​, రేణుకా షహానే, వీర్​ దాస్​, అమైరా దస్తూర్​, తుషార్, షట్లర్​ గుత్తా జ్వాలా ఉన్నారు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో వినియోగ దారుల నుంచి వెల్లువెత్తిన ఆరోపణలపై మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్​(ఎమ్​ఈఆర్​సీ) స్పందించింది. ఆటోమెటిక్​ మీటర్​ రీడింగ్​ సౌకర్యం ఉన్న చోట తప్ప.. మార్చి నుంచి మే వరకు లాక్​డౌన్​ కాలంలో సగటు వినియోగం ఆధారంగా వినియోగదారులకు విద్యుత్​ బిల్లు పెంచినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:మీకు కోటి ధన్యవాదాలు చెప్పిన సరిపోవు: మహేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.