ETV Bharat / sitara

సుశాంత్​ కేసులో ఈడీ దర్యాప్తు సాగిందిలా!

author img

By

Published : Aug 7, 2020, 9:51 PM IST

Updated : Aug 7, 2020, 11:03 PM IST

సుశాంత్​ సింగ్​ ఆత్మహత్య కేసులో భాగంగా మనీ ల్యాండరింగ్​ కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. శుక్రవారం నటి రియా చక్రవర్తిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. రియాతో పాటు అతని సోదరుడు, సుశాంత్​ మాజీ మేనేజర్​ సహా పలువురిని విచారించారు.

sushanth
సుశాంత్​

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసు ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) నటుడి కేసుకు సంబంధించి విచారణ ముమ్మరం చేసింది. తాజాగా మనీ ల్యాండరింగ్​ కేసులో భాగంగా రాజ్​పుత్​ సిబ్బందిని ప్రశ్నించింది. ప్రధానంగా సుశాంత్​ ఇంట్లో జరిగే కార్యకలాపాలపై దర్యాప్తు చేసింది. ఈరోజు రియా చక్రవర్తిని కూడా ప్రశ్నించింది.

సుశాంత్​ కేసులో ఈడీ విచారణ..

  • బిహార్​లో తనపై నమోదైన కేసును ముంబయికి బదిలీ చేయాలని ఇటీవలే రియా సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిగే వరకు తన స్టేట్​మెంట్​ రికార్డ్​ను వాయిదా వేయాలని ఈడీని రియా అభ్యర్థించింది. కానీ, తప్పనిసరిగా ఈడీ ముందు రియా చక్రవర్తి హాజరుకావాల్సి వచ్చింది.
  • రియాతో పాటు ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి కూడా శుక్రవారం రెండు సార్లు ఈడీ కార్యాలయానికి వచ్చాడు.
  • మనీ ల్యాండరింగ్​ కేసుకు సంబంధించి సుశాంత్​ మాజీ బిజినెస్​ మేనేజర్​ శ్రుతి మోదీని ఈడీ విచారించింది.
  • రియా చక్రవర్తిని దాదాపు 8 గంటల పాటు విచారించింది ఈడీ. మధ్యాహ్నం ఆఫీస్​కు చేరుకున్న రియాను రాత్రి 8.30 గంటల వరకు ప్రశ్నించింది.
  • రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి, సీఏ రితేష్ షా, బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీలను కూడా ప్రశ్నించింది. అయితే మరలా ఈ నెల 10న ఈడీ ముందు హాజరు కావాలని రియాకు ఆదేశించింది.
  • సుశాంత్, రియాలు సహజీవనం చేసినప్పటి కాలంలో లావాదేవీలపై రియాను ఈడీ ప్రశ్నించింది.
  • రియా లావాదేవీల విషయంలో కొన్ని అనుమానాలున్నట్లు.. వాటిపై తమకు క్లారిటీ ఇవ్వాలని రియాను కోరినట్లు సమాచారం.
  • అలాగే సుశాంత్ స్నేహితుడు, రూమ్​మేట్ సిద్దార్థ్ పితాని శనివారం ఈడీ ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.
  • రియా చక్రవర్తి నిర్దోషి అయితే దర్యాప్తు నుంచి పారిపోవాలని ఎందుకు చూస్తోందని రాజ్​పుత్​ బంధువు, భాజపా ఎమ్మెల్యే నీరజ్​ కుమార్​ సింగ్​ ప్రశ్నించారు.
  • నటుడి కేసుపై నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు తప్పించుకోకూడదని నీరజ్​ కోరారు.
  • సుశాంత్​ ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయడంపై వచ్చిన పిటిషన్లపై ముంబయి హై కోర్టు స్పందిస్తూ.. అలా చేయడం కుదరదని స్పష్టం చేసింది.
  • సీబీఐ విచారణ కోరుతూ కొంతమంది లా స్టూడెంట్స్​ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో వారికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.

బిహార్​ పోలీసు అధికారి విడుదల..

  • సుశాంత్ కేసు సమాచారం కోసం ముంబయికి వెళ్లిన బిహార్​ పోలీసు అధికారిని మహారాష్ట్ర ప్రభుత్వం 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉంచింది. అతడ్ని వెంటనే విడుదల చేయాని కోరుతూ శుక్రవారం బిహార్​ పోలీసు అధికారులు ముంబయి మనిసిపల్​ అధికారుల(బీఎంసీ)కు లేఖ రాశారు.
  • ఈ క్రమంలోనే బిహార్​ ఐపీఎస్​ అధికారి వినయ్​ తివారి పట్నాకు చేరుకున్నారు.
  • అయితే, తనను మాత్రమే క్వారంటైన్ చేయలేదని.. మొత్తం విచారణను నిర్బంధంలో ఉంచారని తివారి అన్నారు. బిహార్​ పోలీసుల దర్యాప్తుకు ఆటంకం కలిగిందని పేర్కొన్నారు.

విచారణలో సుప్రీం ఏం చెప్పిందంటే..

  • పట్నాలో తనపై వేసిన పిటిషన్​ను ముంబయికి మార్చాలని కోరిన రియా విజ్ఞప్తిని కేంద్రం సుప్రీం కోర్టుకు అప్పగించింది.
  • ఈ క్రమంలోనే వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా గురువారం జస్టిస్​ హృషికేష్​ రాయ్​ నేతృత్వంలోనే ధర్మాసనం విచారణ చేపట్టింది. మహారాష్ట్ర, బిహార్​ ప్రభుత్వాలు ఈ విషయంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది.

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసు ఊహించని మలుపులు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) నటుడి కేసుకు సంబంధించి విచారణ ముమ్మరం చేసింది. తాజాగా మనీ ల్యాండరింగ్​ కేసులో భాగంగా రాజ్​పుత్​ సిబ్బందిని ప్రశ్నించింది. ప్రధానంగా సుశాంత్​ ఇంట్లో జరిగే కార్యకలాపాలపై దర్యాప్తు చేసింది. ఈరోజు రియా చక్రవర్తిని కూడా ప్రశ్నించింది.

సుశాంత్​ కేసులో ఈడీ విచారణ..

  • బిహార్​లో తనపై నమోదైన కేసును ముంబయికి బదిలీ చేయాలని ఇటీవలే రియా సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిగే వరకు తన స్టేట్​మెంట్​ రికార్డ్​ను వాయిదా వేయాలని ఈడీని రియా అభ్యర్థించింది. కానీ, తప్పనిసరిగా ఈడీ ముందు రియా చక్రవర్తి హాజరుకావాల్సి వచ్చింది.
  • రియాతో పాటు ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి కూడా శుక్రవారం రెండు సార్లు ఈడీ కార్యాలయానికి వచ్చాడు.
  • మనీ ల్యాండరింగ్​ కేసుకు సంబంధించి సుశాంత్​ మాజీ బిజినెస్​ మేనేజర్​ శ్రుతి మోదీని ఈడీ విచారించింది.
  • రియా చక్రవర్తిని దాదాపు 8 గంటల పాటు విచారించింది ఈడీ. మధ్యాహ్నం ఆఫీస్​కు చేరుకున్న రియాను రాత్రి 8.30 గంటల వరకు ప్రశ్నించింది.
  • రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి, సీఏ రితేష్ షా, బిజినెస్ మేనేజర్ శ్రుతి మోదీలను కూడా ప్రశ్నించింది. అయితే మరలా ఈ నెల 10న ఈడీ ముందు హాజరు కావాలని రియాకు ఆదేశించింది.
  • సుశాంత్, రియాలు సహజీవనం చేసినప్పటి కాలంలో లావాదేవీలపై రియాను ఈడీ ప్రశ్నించింది.
  • రియా లావాదేవీల విషయంలో కొన్ని అనుమానాలున్నట్లు.. వాటిపై తమకు క్లారిటీ ఇవ్వాలని రియాను కోరినట్లు సమాచారం.
  • అలాగే సుశాంత్ స్నేహితుడు, రూమ్​మేట్ సిద్దార్థ్ పితాని శనివారం ఈడీ ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.
  • రియా చక్రవర్తి నిర్దోషి అయితే దర్యాప్తు నుంచి పారిపోవాలని ఎందుకు చూస్తోందని రాజ్​పుత్​ బంధువు, భాజపా ఎమ్మెల్యే నీరజ్​ కుమార్​ సింగ్​ ప్రశ్నించారు.
  • నటుడి కేసుపై నిస్పక్షపాతంగా విచారణ చేపట్టాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులు తప్పించుకోకూడదని నీరజ్​ కోరారు.
  • సుశాంత్​ ఆత్మహత్య కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయడంపై వచ్చిన పిటిషన్లపై ముంబయి హై కోర్టు స్పందిస్తూ.. అలా చేయడం కుదరదని స్పష్టం చేసింది.
  • సీబీఐ విచారణ కోరుతూ కొంతమంది లా స్టూడెంట్స్​ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో వారికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.

బిహార్​ పోలీసు అధికారి విడుదల..

  • సుశాంత్ కేసు సమాచారం కోసం ముంబయికి వెళ్లిన బిహార్​ పోలీసు అధికారిని మహారాష్ట్ర ప్రభుత్వం 14 రోజుల పాటు క్వారంటైన్​లో ఉంచింది. అతడ్ని వెంటనే విడుదల చేయాని కోరుతూ శుక్రవారం బిహార్​ పోలీసు అధికారులు ముంబయి మనిసిపల్​ అధికారుల(బీఎంసీ)కు లేఖ రాశారు.
  • ఈ క్రమంలోనే బిహార్​ ఐపీఎస్​ అధికారి వినయ్​ తివారి పట్నాకు చేరుకున్నారు.
  • అయితే, తనను మాత్రమే క్వారంటైన్ చేయలేదని.. మొత్తం విచారణను నిర్బంధంలో ఉంచారని తివారి అన్నారు. బిహార్​ పోలీసుల దర్యాప్తుకు ఆటంకం కలిగిందని పేర్కొన్నారు.

విచారణలో సుప్రీం ఏం చెప్పిందంటే..

  • పట్నాలో తనపై వేసిన పిటిషన్​ను ముంబయికి మార్చాలని కోరిన రియా విజ్ఞప్తిని కేంద్రం సుప్రీం కోర్టుకు అప్పగించింది.
  • ఈ క్రమంలోనే వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా గురువారం జస్టిస్​ హృషికేష్​ రాయ్​ నేతృత్వంలోనే ధర్మాసనం విచారణ చేపట్టింది. మహారాష్ట్ర, బిహార్​ ప్రభుత్వాలు ఈ విషయంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది.
Last Updated : Aug 7, 2020, 11:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.