ETV Bharat / sitara

సుశాంత్ కేసు: సీబీఐ దర్యాప్తులో బయటపడ్డ నిజాలు!

author img

By

Published : Aug 27, 2020, 2:24 PM IST

నటుడు సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ మృతి వెనుకున్న రహస్యాన్ని బయటపెట్టేందుకు రంగంలోకి దిగింది సీబీఐ. తొలుత అతడి​ నివాసంలో రియా డిజిటల్​ పాదముద్రలను ఛేదించాలనుకుంది. అయితే విచారణలో భాగంగా రియాకు సంబంధించిన చరవాణి, ఎలక్ట్రానిక్​ వస్తువులను స్వాధీనం చేసుకోగా..వాటి నుంచి కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయని తెలుస్తోంది.

SSR case: CBI's sensational findings indicate several players including Rhea
సీబీఐ దర్యాప్తులో బయటపడ్డ సంచలనాత్మక నిజాలు!

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అతడి ప్రేయసి రియా చక్రవర్తితో సహా స్నేహితులను విచారిస్తోంది. ఈ కేసులో రియాతో పాటు రాజ్​పుత్​ స్నేహితుల డిజిటల్​ పాదముద్రలను ఛేదించడమే లక్ష్యంగా దర్యాప్తు బృందం ముంబయిలో అడుగుపెట్టింది. సుశాంత్​ మృతి జూన్​లో జరిగినందున ఈ సంఘటనకు సంబంధించిన ఆధారాలను తుడిచిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేసి ఉంటారని అధికారులు మొదట ఆందోళన చెందారు.

కొన్ని వార్తా సంస్థల సమాచారం మేరకు రియాకు సంబంధించిన చరవాణి, ఎలక్ట్రానిక్​ వస్తువులను ఇప్పటికే సీబీఐ, ఈడీ​లు జప్తు చేశాయి. అప్పటికే వాటిలో చాలా సమాచారం అదృశ్యమైనందున.. తొలగించిన డేటాను తిరిగి పొందేందుకు వాటిని క్లోన్​ చేశారని తెలుస్తోంది. దీని ద్వారా సంచలనాత్మక విషయాలు బయటపడ్డాయి.

అందులోని ముఖ్యమైన అభియోగాలు:

  • సుశాంత్​ డెబిట్​ కార్డు పాస్​వర్డ్​లను రియా దొంగిలించిందని.. దానికి హీరో హౌస్​ మేనేజర్​ శామ్యూల్​ మిరండా సహాయం తీసుకుందని తెలుస్తోంది.
  • సుశాంత్​ మరణం తర్వాత రియా, శామ్యూల్ కలిసి అతడి డబ్బును తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇదే విషయాన్ని కొన్ని అంతర్గత పత్రాలు తెలియజేశాయి.
  • ఆగస్టు నెల ప్రారంభంలో మిరండాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) అధికారులు విరివిగా ప్రశ్నించినప్పుడు ఈ విషయం వెల్లడైంది.
  • సుశాంత్​ డెబిట్​ కార్డుల పాస్​వర్డ్​లను రియా ఎందుకు దొంగిలించిందనే విషయంపై ఏజెన్సీలు ప్రస్తుతం విచారిస్తున్నాయి. కాగా రియా, శామ్యూల్​కు డ్రగ్స్​తో సంబంధం ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.
  • డ్రగ్​ డీలర్స్​తో రియాకు సంబంధం ఉందని బహిరంగంగా వెల్లడైన తర్వాత ఈ కేసులో నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో (ఎన్​సీబీ) విచారణ చేపట్టింది.

జూన్ 14న ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​​. తొలుత నెపోటిజమ్​ కారణమని విమర్శలు వచ్చినా, అనంతరం రియానే అతడి మృతికి కారణమంటూ సుశాంత్ తండ్రి పట్నాలో కేసు పెట్టారు. తర్వాత బిహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి సిఫారసు చేయడం, కొన్నిరోజులకు కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అతడి ప్రేయసి రియా చక్రవర్తితో సహా స్నేహితులను విచారిస్తోంది. ఈ కేసులో రియాతో పాటు రాజ్​పుత్​ స్నేహితుల డిజిటల్​ పాదముద్రలను ఛేదించడమే లక్ష్యంగా దర్యాప్తు బృందం ముంబయిలో అడుగుపెట్టింది. సుశాంత్​ మృతి జూన్​లో జరిగినందున ఈ సంఘటనకు సంబంధించిన ఆధారాలను తుడిచిపెట్టడానికి అనేక ప్రయత్నాలు చేసి ఉంటారని అధికారులు మొదట ఆందోళన చెందారు.

కొన్ని వార్తా సంస్థల సమాచారం మేరకు రియాకు సంబంధించిన చరవాణి, ఎలక్ట్రానిక్​ వస్తువులను ఇప్పటికే సీబీఐ, ఈడీ​లు జప్తు చేశాయి. అప్పటికే వాటిలో చాలా సమాచారం అదృశ్యమైనందున.. తొలగించిన డేటాను తిరిగి పొందేందుకు వాటిని క్లోన్​ చేశారని తెలుస్తోంది. దీని ద్వారా సంచలనాత్మక విషయాలు బయటపడ్డాయి.

అందులోని ముఖ్యమైన అభియోగాలు:

  • సుశాంత్​ డెబిట్​ కార్డు పాస్​వర్డ్​లను రియా దొంగిలించిందని.. దానికి హీరో హౌస్​ మేనేజర్​ శామ్యూల్​ మిరండా సహాయం తీసుకుందని తెలుస్తోంది.
  • సుశాంత్​ మరణం తర్వాత రియా, శామ్యూల్ కలిసి అతడి డబ్బును తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇదే విషయాన్ని కొన్ని అంతర్గత పత్రాలు తెలియజేశాయి.
  • ఆగస్టు నెల ప్రారంభంలో మిరండాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) అధికారులు విరివిగా ప్రశ్నించినప్పుడు ఈ విషయం వెల్లడైంది.
  • సుశాంత్​ డెబిట్​ కార్డుల పాస్​వర్డ్​లను రియా ఎందుకు దొంగిలించిందనే విషయంపై ఏజెన్సీలు ప్రస్తుతం విచారిస్తున్నాయి. కాగా రియా, శామ్యూల్​కు డ్రగ్స్​తో సంబంధం ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు.
  • డ్రగ్​ డీలర్స్​తో రియాకు సంబంధం ఉందని బహిరంగంగా వెల్లడైన తర్వాత ఈ కేసులో నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో (ఎన్​సీబీ) విచారణ చేపట్టింది.

జూన్ 14న ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​​. తొలుత నెపోటిజమ్​ కారణమని విమర్శలు వచ్చినా, అనంతరం రియానే అతడి మృతికి కారణమంటూ సుశాంత్ తండ్రి పట్నాలో కేసు పెట్టారు. తర్వాత బిహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి సిఫారసు చేయడం, కొన్నిరోజులకు కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.