ETV Bharat / sitara

Narappa: ''నారప్ప' ఓటీటీ విడుదల అందువల్లే'' - venkatesh apologizes fans

వెంకీ 'నారప్ప' ఓటీటీ విడుదలపై నిర్మాతల్లో ఒకరైన సురేశ్​బాబు క్లారిటీ ఇచ్చారు. 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకున్నారు.

suresh babu clarity on Narappa OTT release
వెంకటేశ్ నారప్ప
author img

By

Published : Jul 17, 2021, 2:16 PM IST

విక్టరీ వెంకటేశ్​ 'నారప్ప'.. రానున్న మంగళవారం (జులై 20) ఓటీటీలో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ చేయకపోవడంపై పలువురు అభిమానుల అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఈ విషయమై నిర్మాత సురేశ్​బాబు స్పందించారు.

Narappa OTT release
నారప్ప రిలీజ్ పోస్టర్

'నారప్ప' నిర్మాణంలో తాము భాగస్వాములం మాత్రమేనని, నిర్మాత(కలైపులి ఎస్.థాను) నిర్ణయం మేరకే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు సురేశ్​బాబు స్పష్టం చేశారు. కరోనాతో నష్టపోకూడదనే ఓటీటీకి ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం థియేటర్లకు వెళ్లే పరిస్థితులు లేవని, ప్రజలను థియేటర్లకు రమ్మనడం కరెక్ట్​ కాదని సురేశ్​బాబు అన్నారు. భవిష్యత్ ఓటీటీదే అని అభిప్రాయపడ్డారు.

సురేశ్​ ప్రొడక్షన్స్​లో తీసే చిత్రాలు తన నిర్ణయం మేరకు విడదులవుతాయని సురేశ్​బాబు తెలిపారు. తనపై ఎగ్జిబిటర్ల అసంతృప్తిలో న్యాయం ఉందని చెప్పారు. సినిమా ప్రజలకు చేరువ చేసేందుకు నిర్మాత కష్టపడతారని, టికెట్ ధర కంటే తక్కువ ధరకే ఓటీటీలో సినిమా చూడొచ్చని సురేశ్​బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

venkatesh
వెంకటేశ్

వెంకీ క్షమాపణలు..

మరోవైపు హీరో వెంకటేశ్.. తన సినిమాను ఓటీటీలో విడుదల చేయడంపై అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఫ్యాన్స్ ఎప్పుడు తనకు అండగా నిలిచారని, 'నారప్ప' విషయంలోనే పరిస్థితిని అర్ధం చేసుకుని మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

విక్టరీ వెంకటేశ్​ 'నారప్ప'.. రానున్న మంగళవారం (జులై 20) ఓటీటీలో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ చేయకపోవడంపై పలువురు అభిమానుల అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఈ విషయమై నిర్మాత సురేశ్​బాబు స్పందించారు.

Narappa OTT release
నారప్ప రిలీజ్ పోస్టర్

'నారప్ప' నిర్మాణంలో తాము భాగస్వాములం మాత్రమేనని, నిర్మాత(కలైపులి ఎస్.థాను) నిర్ణయం మేరకే ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు సురేశ్​బాబు స్పష్టం చేశారు. కరోనాతో నష్టపోకూడదనే ఓటీటీకి ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం థియేటర్లకు వెళ్లే పరిస్థితులు లేవని, ప్రజలను థియేటర్లకు రమ్మనడం కరెక్ట్​ కాదని సురేశ్​బాబు అన్నారు. భవిష్యత్ ఓటీటీదే అని అభిప్రాయపడ్డారు.

సురేశ్​ ప్రొడక్షన్స్​లో తీసే చిత్రాలు తన నిర్ణయం మేరకు విడదులవుతాయని సురేశ్​బాబు తెలిపారు. తనపై ఎగ్జిబిటర్ల అసంతృప్తిలో న్యాయం ఉందని చెప్పారు. సినిమా ప్రజలకు చేరువ చేసేందుకు నిర్మాత కష్టపడతారని, టికెట్ ధర కంటే తక్కువ ధరకే ఓటీటీలో సినిమా చూడొచ్చని సురేశ్​బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

venkatesh
వెంకటేశ్

వెంకీ క్షమాపణలు..

మరోవైపు హీరో వెంకటేశ్.. తన సినిమాను ఓటీటీలో విడుదల చేయడంపై అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఫ్యాన్స్ ఎప్పుడు తనకు అండగా నిలిచారని, 'నారప్ప' విషయంలోనే పరిస్థితిని అర్ధం చేసుకుని మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.