ETV Bharat / sitara

ఒకేరోజు 21 పాటలు పాడిన ఘనత బాలుకే సొంతం

author img

By

Published : Jun 4, 2020, 5:16 AM IST

ఆయన కంఠస్వరంలో రసవాహిని ఉప్పొంగుతోంది.. మాధుర్యం అంబరాన్ని తాకుతుంది. ఆయన సంగీతం ఖండాంతరాల్లో ఉండే భారతీయ సంతతిని సైతం ఉత్తేజింపజేస్తోంది. ఆయనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. నేడు 74 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.

SP BALU
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

సంగీతం అనేది విశ్వజనీయం. ప్రకృతిలో సౌందర్య సమన్వితంగా పంచభూతాలలో హృదయాన్ని ఆకర్షించే నాదం ఉంది. ఏకాలమైనా, ఏదేశమైనా ప్రపంచవ్యాప్తంగా మానవ హృదయాలను సంగీతం తన్మయింపజేస్తుంది. సృష్టిలో సంగీతానికి ప్రకృతే పరవశిస్తుంది. నృత్య వాద్యాలతో స్వరసమ్మేళన రాగమాధుర్యంతో హృదయాలను సమ్మోహనపరిచే సంగీతానికి ఎల్లలులేవు. వాటిలో సినిమా సంగీతం జనరంజకమైనది. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీసంగీతానికి పునాది వేసి జాగృతం చేశారు. తదనంతరకాలంలో ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించింది 'బాలు' అని ముద్దుగా పిలుచుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఎంత ఎత్తుకెదిగినా ఎల్లలు దాటని యోగి పుంగవుడు. ఆబాల గోపాలాన్ని కట్టిపడేసే సమ్మోనశక్తి బాలు గళానికే కాదు ఆయన వ్యక్తిత్వానికీ ఉంది. బాలు సినీ సంగీత ప్రపంచానికి పరిచయమై 50 ఏళ్లు దాటిన ఆ కంఠస్వరంలోని మాధుర్యం అంబరాన్ని తాకుతోంది. 'పాడుతా తీయగా', 'స్వరాభిషేకం' వంటి రాగసాగరికల ద్వారా ఖండాంతరాలను దాటుతున్నాయి. ఇంతితై.. వటుడింతై.. నభోవీధిపైనంతై.. ప్రభారాశిపైనంతై.. బ్రహ్మాండాంత సంవర్ధియైన ఈ బాల సంగీత విద్వాంసుడు సింహపురి (నెల్లూరు) పట్టణంలో జూన్‌ 4వ తేదీన జన్మించారు. నేడు 74వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

SP BALU
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

గాయకుడు కావాలని

1964లో మద్రాస్‌ సోషల్‌ అండ్‌ కల్చరల్‌ క్లబ్‌ వారు నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో పాల్గొన్న 'బాలు'కు అందులో ప్రథమ బహుమతి వచ్చింది. ఆ పోటీకి న్యాయ నిర్ణేతలు ప్రఖ్యాత సంగీత దర్శక త్రిమూర్తులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు. అంతేకాదు మరో సంగీత దర్శకుడు కోదండపాణి కూడా ప్రేక్షకులలో కూర్చుని ఆ పాట విన్నారు. 'బాలు' పాడిన విధానం అతనికి నచ్చింది. ఆ కుర్రాణ్ణి అభినందించారు. గొంతు లేతగా వుంది. కొన్నాళ్లు పొతే సినిమాల్లో పాటలు పాడిస్తానని అభయమిచ్చారు. ఈ సంఘటనకు ముందు గూడూరు కళారాధన సమితి నిర్వహించిన లలిత సంగీత పోటీలకు ప్రముఖ నేపథ్య గాయని జానకి ముఖ్యఅతిధిగా వచ్చారు. ఆ పోటీల్లో బాలుకు ద్వితీయ బహుమతి వచ్చింది. ముఖ్య అతిధి జానకి మాట్లాడుతూ బాలుకే ప్రథమ బహుమతి పొందే అర్హత ఉందని, వర్ధమాన కళాకారులకు ఇలాంటి అన్యాయం జరిగితే వాళ్ల భవిష్యత్తు అంధకారమవుతుందని నిర్మొహమాటంగా చెప్పారు. ఆమె చెప్పిన మాటలు బాలు గుండెలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. సినిమాల్లో పాడేందుకు ప్రయత్నించమని ఆమె బాలుకు సలహా ఇచ్చారు. మద్రాసులో ఇంజనీరింగు చదువు కొనసాగిస్తూ, సినిమా అవకాశాలకోసం తరచూ కోదండపాణిని కలుస్తూ ఉండేవారు. సంగీతం ఎవరిదగ్గరా నేర్చుకోకపోయినా, రాగ తాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండడం వల్ల ట్యూన్ ఒకసారి వింటే య‌ధాత‌థంగా పాడగలిగే విద్వత్తు బాలుకు సొంతం కావడం లాభించే అంశం. అంతేకాదు స్టేజి ఫియర్‌ తెలియకపోవడం.. అన్నింటికి మించి బాలు గళం అతనికి భగవంతుడు ఇచ్చిన వరం!

SP BALU
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

తొలి ప్రయత్నమే నిష్ణాతులలో...

ఇచ్చిన మాటకు కట్టుబడి కోదండపాణి బాలుకు 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' సినిమాలో తొలిసారి పాడే అవకాశమిచ్చారు. ఆ సినిమా నిర్మాత హాస్యనటుడు పద్మనాభం, కోదండపాణి ప్రతిపాదనకు మద్దతు పలికారు. వేటూరి రాయాగా మాల్కోస్, యమన్, కల్యాణి, భాగేశ్వరి రాగాల్లో స్వరాలల్లిన 'యేమి ఈ వింత మొహం' అనే రాగమాలికను రేఖా అండ్‌ మురళీ ఆర్ట్స్‌ వారి కార్యాలయంలో కోదండపాణి వారం రోజులపాటు బాలు చేత ప్రాక్టీసు చేయించారు. చివరకు అది సోలో పాట కాదని నలుగురు కలిసి పాడేదని తెలిసింది. అలవాటు ప్రకారం ఓరోజు ప్రాక్టీసుకు వెళ్లిన బాలుకు పద్మనాభం కార్యాలయంలో పి.సుశీల, కల్యాణం రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్‌ కనిపించారు.

తడబాటులో ఉన్న బాలును కోదండపాణి వారికి పరిచయంచేసి 'యేమి ఈ వింత మొహం' పాట మొత్తాన్ని బాలుచేత పాడించి వినిపించారు. ఆపైన ముగ్గురు గాయనీ గాయకులతో కలిసి బాలు పాడిన ఈ తొలిపాట 15 డిసెంబరు 1966న విజయా గార్డెన్స్‌లో రికార్డిస్ట్​ స్వామినాథన్‌ అధ్వర్యంలో రికార్డైంది. పాట మొదటి టేక్‌లోనే ఓకే కావడం విశేషం. 1967 జూన్‌ 2న విడుదలైన ఈ సినిమా.. చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు 'బాలు' ప్రభంజనానికి తెరలేపింది. బాలు సగర్వంగా ఎప్పుడూ చెప్పేమాట ఒకటుంది.

'కోదండపాణి గారనే వ్యక్తే ఆనాడు లేకుంటే ఈనాడు బాలు ఉండేవాడు కాదు. ఆయనకు గాయకుడిగా నా భవిష్యత్తు మీద యెంత నమ్మకముందంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా లేదు. నా మొదటి పాట విజయా గార్డెన్స్‌ ఇంజనీరు స్వామినాథన్‌ గారితో చెప్పి ఆ టేప్‌ చెరిపేయకుండా సంవత్సరంపాటు అలాగే ఉంచేట్లు చేసి, ఏ సంగీత దర్శకుడు అక్కడికి వచ్చినా, వారికి వినిపించి, అవకాశాలు ఇమ్మని అడిగేవారట. ఏమిచ్చినా కోదండపాణి ఋణం నేను తీర్చుకోలేను'. ఈ మాటలు చాలావా బాలుకు కోదండపాణి మీద ఎంతటి భక్తి ప్రపత్తులున్నాయో తెలుపడానికి! తరువాత చంద్రశేఖర ఫిలిమ్స్‌ వారు నిర్మించిన 'మూగజీవులు' సినిమాలో బాలు పాడిన 'దయలేని లోకాన' అనే పద్యాన్ని కోదండపాణి మహదేవన్‌కు వినిపించగా ఆయన డి.బి.నారాయణ నిర్మించిన 'ప్రైవేట్‌ మాస్టారు' సినిమాలో 'పాడుకో పాడుకో...పాడుతూ చదువుకో' అనే పాటను బాలు చేత పాడించారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావులకు పాడే అవకాశాన్ని ఇచ్చిందీ మహాదేవనే. 'ఏకవీర'లో ఎన్టీఆర్‌కు, 'ఇద్దరు అమ్మాయిలు'లో అక్కినేనికి మహదేవన్‌ బాలు చేత పాడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాలు తొలి తరం గీతాలు.

'ప్రైవేట్‌ మాస్టారు' సినిమాలో బాలు పాడిన పాట తరువాత దర్శకుడు విశ్వనాధ్‌ సహకారంతో 'సుఖ దుఃఖాలు' సినిమాలో 'మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు', 'అందాలు చిందే ఆకళ్లలోనే బంగారు కలలే దాగున్నవి' అనే పాటలు బాలుచేత కోదండపాణి పాడించారు. 'ప్రైవేట్‌ మాస్టారు'లో బాలు పాడిన పాట విని బాపు-రమణలు 'బంగారు పిచిక' సినిమాలో బాలు చేత 'ఒహోహో.. బంగారు పిచ్చికా', 'మనసే గని తరగని, గని తగ్గని గని' పాటలు పాడించారు. అదే మహదేవన్‌ 'ఉండమ్మా బొట్టుపెడతా' సినిమాలో 'రావమ్మా మహాలక్ష్మి రావమ్మా', 'చుక్కలతో చెప్పాలని', 'చాలులే నిదురపో జాబిలీకూనా' పాటలు కూడా పాడించారు. ఆ తరువాత పద్మనాభం నిర్మించిన 'శ్రీరామకథ'లో కోదండపాణి 'రామకథ శ్రీరామ కథ', 'రాగమయం.. అనురాగమయం' పాటలు, మరికొన్ని పద్యాలు, శ్లోకాలు బాలు చేత పాడించారు. అలాగే 'మంచి మిత్రులు' సినిమాలో ఘంటసాలతో కలిసి 'ఎన్నాళ్లో వేచిన ఉదయం' పాటను బాలు పాడారు.

ఈ పాటలన్నీ సూపర్‌ హిట్లుగా నిలవడం వల్ల బాలుకు మరికొన్ని సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. 'మహాబలుడు' సినిమాలో 'విశాల గగనంలో చందమామ'; 'ఆస్తులు-అంతస్తులు'లో 'ఒకటై పోదామా వూహల వాహినిలో' పాట; సత్యం సంగీత దర్శకత్వంలో వచ్చిన 'టక్కరిదొంగ-చక్కనిచుక్క' సినిమాలో 'నడకలు చూస్తే మనసౌతుంది', 'కలలుగనే కమ్మని చిన్నారీ' పాటలు, 'ముహూర్తబలం' సినిమాలో మహదేవన్‌ సంగీత సారధ్యంలో ‘బుగ్గ గిల్లగానే సరిపోయిందా’ పాటలు ఆలపించారు. ఆ పరంపరలో సారథి స్టూడియోవారి 'ఆత్మీయులు' సినిమాలో 'చిలిపి నవ్వుల నిను చూడగానే' పాటను సాలూరు రాజేశ్వరరావు బాలుచేత పాడించారు. ఆపై 'జగత్‌ కిలాడీలు' సినిమాలో 'వేళ చూస్తే సందెవేళ..గాలి వీస్తే పైరగాలి' పాట, 'నుషులు మారాలి' సినిమాలో 'తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో', 'పాపాయి నవ్వాలి పండగే రావాలి' పాటలు, 'బందిపోటు భీమన్న' చిత్రంలో 'నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో' పాట, 'ఏకవీర'లో ఘంటసాలతో కలిసి 'ప్రతిరాత్రి వసంత రాత్రి' పాట, మరికొన్ని పద్యాలు బాలు గళంలో మారుమోగాయి. దాంతో గాయకుడిగా బాలు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అలా 1969 నుంచే బాలు బాగా బిజీ అయ్యారు. బాలు స్వరంలో వచ్చిన ఈ పాటలు ఇప్పుడు వింటుంటే ఎంత వీనుల విందుగా, హాయిగా వుంటుందో చెప్పనలవికాదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తుంబుర నాదమే

స్వర్ణయుగ సంగీత దర్శకుల అధ్వర్యంలో పాడే అరుదైన అదృష్టం బాలుకు దొరికింది. పెండ్యాల సారధ్యంలో తొలిసారి బాలు ఓ పద్యం పాడారు. అది నచ్చి 'మా నాన్న నిర్దోషి' సినిమాలో పెండ్యాల బాలుచేత మూడు పాటలు పాడించారు. 'అలకలు తీరిన కన్నులు యేమనె ప్రియా' అనే హిట్‌ సాంగ్, 'నింగి అంచుల వీడి నేలపై నడయాడి' అనే గజల్, 'ఏమండి అబ్బాయిగారు ఎలా ఉన్నారు' అనే టీజింగ్‌ పాట అద్భుతమైన పాటలు. సత్యం సంగీత దర్శకత్వంలో ‘పాలమనసులు’ సినిమాలో బాలు పాడిన 'ఆపలేని తాపమాయే అయ్యయ్యో' అనే తొలిపాట సినిమాలో చోటుచేసుకోలేదు. తరువాత సత్యం సినిమాలకు దాదాపు బాలు పాడిన పాటలే అధికం. తాతినేని చలపతిరావు దర్శకత్వంలో బాలు తొలిసారి పాడిన పాట 'చిరంజీవి' సినిమాలో 'జీవితమెంతో తీయనిది'. అలాగే మాస్టర్‌ వేణు 'అర్ధరాత్రి' సినిమాలో 'ఈ పిలుపు నీకోసమే' పాటను తొలిసారి పాడించారు. ఆదినారాయణ రావు 'అమ్మకోసం' సినిమాలో 'గువ్వలా ఎగిరిపోవాలీ' పాటను, టి.వి.రాజు 'నిండు హృదయాలు' సినిమాలో మొదటి అవకాశమిచ్చి 'మెత్తమెత్తని సొగసు' అనే పాట పాడించాక చాలా సినిమాల్లో అవకాశాలు కల్పించారు. ఇంకా యం.యస్‌.విశ్వనాథన్, ఇళయరాజా, జి.కె.వెంకటేష్, రమేష్‌ నాయుడు, అశ్వథామ, చక్రవర్తి, రాజ్‌-కోటి, రాజన్‌-నాగేంద్ర, కీరవాణి వంటి స్వర్ణయుగ సంగీత దర్శకులవద్ద బాలు కొన్ని వేల మరపురాని మధుర మైన పాటలు పాడారు. అలా ముప్పై అయిదు వేల పాటలకు పైగా పాడిన బాలు పాటలు పాడడం మానలేదు... ఆ కంఠస్వరం అలా పాడుతూనే వుంటుంది.... పాడుతూనే వుండాలి కూడా.

SP BALU
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

తొలి రోజుల్లో బాలు.

బాలు 1946 జూన్‌ 4న కోనేటమ్మపేట అనే గ్రామంలో జన్మించారు. తండ్రి సాంబమూర్తి నిష్టాగరిష్టుడైన హరికథా భాగవతార్‌. ఆయన భక్తిరస నాటకాలూ ప్రదర్శిస్తూ ఉండేవారు. తల్లి శకుంతలమ్మ గృహిణి. బాలుకు చిన్నతనం నుంచి సంగీతం మీద ఆసక్తి. సంగీతంలో ఆయనకు తొలి గురువు తండ్రిగారు. ఐదేళ్ల వయసులో బాలు 'భక్తరామదాసు' నాటకంలో తండ్రితో కలిసి నటించారు. ప్రాథమిక విద్యను నగిరిలో మేనమామ శ్రీనివాసరావు ఇంట పూర్తి చేసి, స్కూల్ ఫైనల్‌ విద్యను శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో కొనసాగించారు. అప్పుడు చదువులోనే కాదు, ఆటల్లోకూడా బాలు ప్రథముడే. ఆ స్కూలులో పనిచేసే జి.వి.సుబ్రహ్మణ్యం అనే మాస్టారు బాలుచేత 'చెంచులక్ష్మి' సినిమాలో సుశీల ఆలపించిన 'పాలకడలిపై శేషతల్పమున' అనే పాటను పాడించి టేప్‌ మీద రికార్డు చేశారు. బాలుకు అదొక మధురానుభూతి. మరో మేష్టారు రాధాపతి ప్రోత్సాహంతో ‘ఈ ఇల్లు అమ్మబడును’, ‘ఆత్మహత్య’, వంటి నాటికల్లో నటించి ప్రేక్షకుల మన్నన పొందారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజిలో పి.యు.సి. చదువుతుండగా మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటకంలో స్త్రీ పాత్ర ధరించే అవకాశం వచ్చింది. తరువాత విజయవాడ ఆకాశవాణిలో తను స్వయంగా రాసి, బాణీ కట్టి ఆలపించిన ఓ లలిత గీతానికి బహుమతి లభించింది. పి.యు.సి. పరీక్షలు రాసి నెల్లూరు చేరుకొని బాలు ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని తయారు చేశారు.

మిత్రులతో కలిసి ప్రోగ్రాములు ఇచ్చేవారు. తరువాత అనంతపురంలో ఇంజనీరింగ్‌ సీటు రావడం వల్ల అక్కడి వాతావరణం నచ్చక తిరిగి నెల్లూరు వచ్చేశారు. ప్రత్యామ్నాయంగా మద్రాసు వెళ్లి ఇంజనీరింగ్‌ విద్యకు సరిసమానమైన ఎ.ఎం.ఐ.ఇ.లో చేరారు. అక్కడ చదువుతో బాటు సినిమాల్లో అవకాశాలకోసం ప్రయత్నాలు చేశారు. ఇంజనీరింగ్‌ కోర్సు రెండో సంవత్సరం వచ్చేనాటికి బాలుకు సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ‘మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌’ అనే సినిమాలో రమాప్రభ పుట్టినరోజు వేడుకలో ‘హ్యాపీ బర్త్‌ డే టు యూ’ అంటూ పాటపాడుతూ తొలిసారి బాలు వెండితెరమీద దర్శనమిచ్చారు. తరువాత ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తనలోని నటుడికి పదును పెట్టారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరిన్ని విశేషాలు...

'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' చిత్రంలో పాడిన వారం రోజులకే 'నక్కరే అదే స్వర్గ' అనే కన్నడ సినిమాలో పాడే అవకాశం బాలుకు వచ్చింది. తమిళంలో ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ బాలుచేత 'హోటల్‌ రంభ' అనే చిత్రం కోసం 'టంతానోడు ఇప్పడి ఇరుందు ఎత్తనై నాలాచు' అనే పాటను తొలిసారి పాడించారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. తర్వాత 'శాంతినిలయం' చిత్రంలో సుశీలతో కలిసి 'ఇయరకై ఎణ్ణుమ్‌ ఇల్లయ కణ్ణి' అనే పాట పాడారు.

కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్రకుమార్‌ సారథ్యంలో ఒకేరోజు 21 పాటలు పాడి రికార్డు సృష్టించారు. అలాగే ఒకేరోజు తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు ఏకబిగిన పాడి మరో రికార్డు సాధించారు. హిందీ సంగీత దర్శకుడు ఆనంద్‌ మిలింద్‌కు 15 నుంచి 20 పాటలు ఒకేరోజు పాడి మద్రాసు తిరిగివచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. బాలు మంచి డబ్బింగ్‌ ఆర్టిస్ట్, ... ఓ మంచి నటుడు కూడా. సంగీత దర్శకుడు చక్రవర్తి ప్రోద్బలంతో మొదట 'మన్మధలీల' తెలుగు చిత్రానికి డబ్బింగ్‌ చెప్పారు. తదనంతరకాలంలో కమల్‌ హసన్, రజనీకాంత్, భాగ్యరాజ్, నాగేష్, కార్తిక్, రఘువరన్, సల్మాన్‌ ఖాన్, అనిల్‌ కపూర్‌ వంటి నటులకు తన గొంతు అరువిచ్చారు. ముఖ్యంగా 'దశావతారాలు' చిత్రంలో కమల్‌ నటించిన ఏడు పాత్రలకు వైవిధ్యమైన గొంతుతో సంభాషణలు పలికిన తీరు అద్భుతమనే చెప్పాలి. అన్నమయ్య, శ్రీ సాయి మహిమ చిత్రాల్లో డబ్బింగ్‌ చెప్పినందుకు బాలు ఉత్తమ డబ్బింగ్‌ కళాకారునికి ఇచ్చే నంది బహుమతులు గెలుచుకున్నారు. రిచర్డ్‌ అటెన్‌ బరో నిర్మించిన 'గాంధీ' తెలుగు వెర్షన్‌లో గాంధీ పాత్రధారి బెన్‌ కింగ్స్‌ లేకు గాత్రదానం చేసింది బాలూనే. ఉత్తమ గాయకుడిగా బాలు ఆరు జాతీయ బహుమతులు అందుకున్నారు. అవి శంకరాభరణం (1979), ఏక్‌ దూజే కే లియే (1981), సాగరసంగమం (1983), రుద్రవీణ (1988), సంగీతసాగర గానయోగి పంచాక్షర గవాయ్‌ (1995-కన్నడ), మిన్సార కణవు (1996-తమిళం).

జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకునిగా ‘మైనే ప్యార్‌ కియా’ చిత్రానికి ఫిలింఫేర్‌ బహుమతి అందుకున్నారు. దక్షిణ భారత సినిమాల్లో ఉత్తమ గాయకునికి ఇచ్చే ఫిలింఫేర్‌ బహుమతులు బాలును ఏడుసార్లు వరించాయి. ఉత్తమ గాయకునిగా 18 నంది బహుమతులతో బాటు ఉత్తమ సంగీత దర్శకునిగా ‘మయూరి’ చిత్రానికి నంది బహుమతి అందుకున్నారు. ‘మిథునం’ సినిమాలో నటనకు ప్రత్యేక జూరీ బహుమతి లభించింది. తమిళ చిత్రాల్లో ఆలపించిన పాటలకు నాలుసార్లు, కన్నడ సినిమాల్లో పాడిన పాటలకు మూడుసార్లు ఉత్తమ గాయకుని బహుమతులు కూడా బాలుకు దక్కాయి. రాజాలక్ష్మీ ఫౌండేషన్, సుర్‌ సేన్, అక్కినేని, లతామంగేష్కర్‌ జాతీయ బహుమతుల తోబాటు లెక్కలేనన్ని ఇతర బహుమతులు బాలును వరించాయి. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునిచ్చి ఈయన్ను సత్కరించింది. 2011లో పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. బాలు తనయుడు చరణ్‌.. మంచి గాయకుడుగా, సినీ నిర్మాతగా స్థిరపడ్డారు.

SP BALU
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఇదీ చూడండి : తెలంగాణలో త్వరలో సినిమా షూటింగ్​లు!

సంగీతం అనేది విశ్వజనీయం. ప్రకృతిలో సౌందర్య సమన్వితంగా పంచభూతాలలో హృదయాన్ని ఆకర్షించే నాదం ఉంది. ఏకాలమైనా, ఏదేశమైనా ప్రపంచవ్యాప్తంగా మానవ హృదయాలను సంగీతం తన్మయింపజేస్తుంది. సృష్టిలో సంగీతానికి ప్రకృతే పరవశిస్తుంది. నృత్య వాద్యాలతో స్వరసమ్మేళన రాగమాధుర్యంతో హృదయాలను సమ్మోహనపరిచే సంగీతానికి ఎల్లలులేవు. వాటిలో సినిమా సంగీతం జనరంజకమైనది. ఘంటసాల వంటి ఎందరో మహానుభావులు తెలుగు సినీసంగీతానికి పునాది వేసి జాగృతం చేశారు. తదనంతరకాలంలో ఆ పునాదిపై సంగీత సౌధాన్ని నిర్మించింది 'బాలు' అని ముద్దుగా పిలుచుకొనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన ఎంత ఎత్తుకెదిగినా ఎల్లలు దాటని యోగి పుంగవుడు. ఆబాల గోపాలాన్ని కట్టిపడేసే సమ్మోనశక్తి బాలు గళానికే కాదు ఆయన వ్యక్తిత్వానికీ ఉంది. బాలు సినీ సంగీత ప్రపంచానికి పరిచయమై 50 ఏళ్లు దాటిన ఆ కంఠస్వరంలోని మాధుర్యం అంబరాన్ని తాకుతోంది. 'పాడుతా తీయగా', 'స్వరాభిషేకం' వంటి రాగసాగరికల ద్వారా ఖండాంతరాలను దాటుతున్నాయి. ఇంతితై.. వటుడింతై.. నభోవీధిపైనంతై.. ప్రభారాశిపైనంతై.. బ్రహ్మాండాంత సంవర్ధియైన ఈ బాల సంగీత విద్వాంసుడు సింహపురి (నెల్లూరు) పట్టణంలో జూన్‌ 4వ తేదీన జన్మించారు. నేడు 74వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

SP BALU
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

గాయకుడు కావాలని

1964లో మద్రాస్‌ సోషల్‌ అండ్‌ కల్చరల్‌ క్లబ్‌ వారు నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో పాల్గొన్న 'బాలు'కు అందులో ప్రథమ బహుమతి వచ్చింది. ఆ పోటీకి న్యాయ నిర్ణేతలు ప్రఖ్యాత సంగీత దర్శక త్రిమూర్తులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావు. అంతేకాదు మరో సంగీత దర్శకుడు కోదండపాణి కూడా ప్రేక్షకులలో కూర్చుని ఆ పాట విన్నారు. 'బాలు' పాడిన విధానం అతనికి నచ్చింది. ఆ కుర్రాణ్ణి అభినందించారు. గొంతు లేతగా వుంది. కొన్నాళ్లు పొతే సినిమాల్లో పాటలు పాడిస్తానని అభయమిచ్చారు. ఈ సంఘటనకు ముందు గూడూరు కళారాధన సమితి నిర్వహించిన లలిత సంగీత పోటీలకు ప్రముఖ నేపథ్య గాయని జానకి ముఖ్యఅతిధిగా వచ్చారు. ఆ పోటీల్లో బాలుకు ద్వితీయ బహుమతి వచ్చింది. ముఖ్య అతిధి జానకి మాట్లాడుతూ బాలుకే ప్రథమ బహుమతి పొందే అర్హత ఉందని, వర్ధమాన కళాకారులకు ఇలాంటి అన్యాయం జరిగితే వాళ్ల భవిష్యత్తు అంధకారమవుతుందని నిర్మొహమాటంగా చెప్పారు. ఆమె చెప్పిన మాటలు బాలు గుండెలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. సినిమాల్లో పాడేందుకు ప్రయత్నించమని ఆమె బాలుకు సలహా ఇచ్చారు. మద్రాసులో ఇంజనీరింగు చదువు కొనసాగిస్తూ, సినిమా అవకాశాలకోసం తరచూ కోదండపాణిని కలుస్తూ ఉండేవారు. సంగీతం ఎవరిదగ్గరా నేర్చుకోకపోయినా, రాగ తాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండడం వల్ల ట్యూన్ ఒకసారి వింటే య‌ధాత‌థంగా పాడగలిగే విద్వత్తు బాలుకు సొంతం కావడం లాభించే అంశం. అంతేకాదు స్టేజి ఫియర్‌ తెలియకపోవడం.. అన్నింటికి మించి బాలు గళం అతనికి భగవంతుడు ఇచ్చిన వరం!

SP BALU
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

తొలి ప్రయత్నమే నిష్ణాతులలో...

ఇచ్చిన మాటకు కట్టుబడి కోదండపాణి బాలుకు 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' సినిమాలో తొలిసారి పాడే అవకాశమిచ్చారు. ఆ సినిమా నిర్మాత హాస్యనటుడు పద్మనాభం, కోదండపాణి ప్రతిపాదనకు మద్దతు పలికారు. వేటూరి రాయాగా మాల్కోస్, యమన్, కల్యాణి, భాగేశ్వరి రాగాల్లో స్వరాలల్లిన 'యేమి ఈ వింత మొహం' అనే రాగమాలికను రేఖా అండ్‌ మురళీ ఆర్ట్స్‌ వారి కార్యాలయంలో కోదండపాణి వారం రోజులపాటు బాలు చేత ప్రాక్టీసు చేయించారు. చివరకు అది సోలో పాట కాదని నలుగురు కలిసి పాడేదని తెలిసింది. అలవాటు ప్రకారం ఓరోజు ప్రాక్టీసుకు వెళ్లిన బాలుకు పద్మనాభం కార్యాలయంలో పి.సుశీల, కల్యాణం రఘురామయ్య, పి.బి.శ్రీనివాస్‌ కనిపించారు.

తడబాటులో ఉన్న బాలును కోదండపాణి వారికి పరిచయంచేసి 'యేమి ఈ వింత మొహం' పాట మొత్తాన్ని బాలుచేత పాడించి వినిపించారు. ఆపైన ముగ్గురు గాయనీ గాయకులతో కలిసి బాలు పాడిన ఈ తొలిపాట 15 డిసెంబరు 1966న విజయా గార్డెన్స్‌లో రికార్డిస్ట్​ స్వామినాథన్‌ అధ్వర్యంలో రికార్డైంది. పాట మొదటి టేక్‌లోనే ఓకే కావడం విశేషం. 1967 జూన్‌ 2న విడుదలైన ఈ సినిమా.. చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు 'బాలు' ప్రభంజనానికి తెరలేపింది. బాలు సగర్వంగా ఎప్పుడూ చెప్పేమాట ఒకటుంది.

'కోదండపాణి గారనే వ్యక్తే ఆనాడు లేకుంటే ఈనాడు బాలు ఉండేవాడు కాదు. ఆయనకు గాయకుడిగా నా భవిష్యత్తు మీద యెంత నమ్మకముందంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా లేదు. నా మొదటి పాట విజయా గార్డెన్స్‌ ఇంజనీరు స్వామినాథన్‌ గారితో చెప్పి ఆ టేప్‌ చెరిపేయకుండా సంవత్సరంపాటు అలాగే ఉంచేట్లు చేసి, ఏ సంగీత దర్శకుడు అక్కడికి వచ్చినా, వారికి వినిపించి, అవకాశాలు ఇమ్మని అడిగేవారట. ఏమిచ్చినా కోదండపాణి ఋణం నేను తీర్చుకోలేను'. ఈ మాటలు చాలావా బాలుకు కోదండపాణి మీద ఎంతటి భక్తి ప్రపత్తులున్నాయో తెలుపడానికి! తరువాత చంద్రశేఖర ఫిలిమ్స్‌ వారు నిర్మించిన 'మూగజీవులు' సినిమాలో బాలు పాడిన 'దయలేని లోకాన' అనే పద్యాన్ని కోదండపాణి మహదేవన్‌కు వినిపించగా ఆయన డి.బి.నారాయణ నిర్మించిన 'ప్రైవేట్‌ మాస్టారు' సినిమాలో 'పాడుకో పాడుకో...పాడుతూ చదువుకో' అనే పాటను బాలు చేత పాడించారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావులకు పాడే అవకాశాన్ని ఇచ్చిందీ మహాదేవనే. 'ఏకవీర'లో ఎన్టీఆర్‌కు, 'ఇద్దరు అమ్మాయిలు'లో అక్కినేనికి మహదేవన్‌ బాలు చేత పాడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాలు తొలి తరం గీతాలు.

'ప్రైవేట్‌ మాస్టారు' సినిమాలో బాలు పాడిన పాట తరువాత దర్శకుడు విశ్వనాధ్‌ సహకారంతో 'సుఖ దుఃఖాలు' సినిమాలో 'మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు', 'అందాలు చిందే ఆకళ్లలోనే బంగారు కలలే దాగున్నవి' అనే పాటలు బాలుచేత కోదండపాణి పాడించారు. 'ప్రైవేట్‌ మాస్టారు'లో బాలు పాడిన పాట విని బాపు-రమణలు 'బంగారు పిచిక' సినిమాలో బాలు చేత 'ఒహోహో.. బంగారు పిచ్చికా', 'మనసే గని తరగని, గని తగ్గని గని' పాటలు పాడించారు. అదే మహదేవన్‌ 'ఉండమ్మా బొట్టుపెడతా' సినిమాలో 'రావమ్మా మహాలక్ష్మి రావమ్మా', 'చుక్కలతో చెప్పాలని', 'చాలులే నిదురపో జాబిలీకూనా' పాటలు కూడా పాడించారు. ఆ తరువాత పద్మనాభం నిర్మించిన 'శ్రీరామకథ'లో కోదండపాణి 'రామకథ శ్రీరామ కథ', 'రాగమయం.. అనురాగమయం' పాటలు, మరికొన్ని పద్యాలు, శ్లోకాలు బాలు చేత పాడించారు. అలాగే 'మంచి మిత్రులు' సినిమాలో ఘంటసాలతో కలిసి 'ఎన్నాళ్లో వేచిన ఉదయం' పాటను బాలు పాడారు.

ఈ పాటలన్నీ సూపర్‌ హిట్లుగా నిలవడం వల్ల బాలుకు మరికొన్ని సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. 'మహాబలుడు' సినిమాలో 'విశాల గగనంలో చందమామ'; 'ఆస్తులు-అంతస్తులు'లో 'ఒకటై పోదామా వూహల వాహినిలో' పాట; సత్యం సంగీత దర్శకత్వంలో వచ్చిన 'టక్కరిదొంగ-చక్కనిచుక్క' సినిమాలో 'నడకలు చూస్తే మనసౌతుంది', 'కలలుగనే కమ్మని చిన్నారీ' పాటలు, 'ముహూర్తబలం' సినిమాలో మహదేవన్‌ సంగీత సారధ్యంలో ‘బుగ్గ గిల్లగానే సరిపోయిందా’ పాటలు ఆలపించారు. ఆ పరంపరలో సారథి స్టూడియోవారి 'ఆత్మీయులు' సినిమాలో 'చిలిపి నవ్వుల నిను చూడగానే' పాటను సాలూరు రాజేశ్వరరావు బాలుచేత పాడించారు. ఆపై 'జగత్‌ కిలాడీలు' సినిమాలో 'వేళ చూస్తే సందెవేళ..గాలి వీస్తే పైరగాలి' పాట, 'నుషులు మారాలి' సినిమాలో 'తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో', 'పాపాయి నవ్వాలి పండగే రావాలి' పాటలు, 'బందిపోటు భీమన్న' చిత్రంలో 'నీ కాటుక కన్నులలో ఏ కమ్మని కథ ఉందో' పాట, 'ఏకవీర'లో ఘంటసాలతో కలిసి 'ప్రతిరాత్రి వసంత రాత్రి' పాట, మరికొన్ని పద్యాలు బాలు గళంలో మారుమోగాయి. దాంతో గాయకుడిగా బాలు తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అలా 1969 నుంచే బాలు బాగా బిజీ అయ్యారు. బాలు స్వరంలో వచ్చిన ఈ పాటలు ఇప్పుడు వింటుంటే ఎంత వీనుల విందుగా, హాయిగా వుంటుందో చెప్పనలవికాదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తుంబుర నాదమే

స్వర్ణయుగ సంగీత దర్శకుల అధ్వర్యంలో పాడే అరుదైన అదృష్టం బాలుకు దొరికింది. పెండ్యాల సారధ్యంలో తొలిసారి బాలు ఓ పద్యం పాడారు. అది నచ్చి 'మా నాన్న నిర్దోషి' సినిమాలో పెండ్యాల బాలుచేత మూడు పాటలు పాడించారు. 'అలకలు తీరిన కన్నులు యేమనె ప్రియా' అనే హిట్‌ సాంగ్, 'నింగి అంచుల వీడి నేలపై నడయాడి' అనే గజల్, 'ఏమండి అబ్బాయిగారు ఎలా ఉన్నారు' అనే టీజింగ్‌ పాట అద్భుతమైన పాటలు. సత్యం సంగీత దర్శకత్వంలో ‘పాలమనసులు’ సినిమాలో బాలు పాడిన 'ఆపలేని తాపమాయే అయ్యయ్యో' అనే తొలిపాట సినిమాలో చోటుచేసుకోలేదు. తరువాత సత్యం సినిమాలకు దాదాపు బాలు పాడిన పాటలే అధికం. తాతినేని చలపతిరావు దర్శకత్వంలో బాలు తొలిసారి పాడిన పాట 'చిరంజీవి' సినిమాలో 'జీవితమెంతో తీయనిది'. అలాగే మాస్టర్‌ వేణు 'అర్ధరాత్రి' సినిమాలో 'ఈ పిలుపు నీకోసమే' పాటను తొలిసారి పాడించారు. ఆదినారాయణ రావు 'అమ్మకోసం' సినిమాలో 'గువ్వలా ఎగిరిపోవాలీ' పాటను, టి.వి.రాజు 'నిండు హృదయాలు' సినిమాలో మొదటి అవకాశమిచ్చి 'మెత్తమెత్తని సొగసు' అనే పాట పాడించాక చాలా సినిమాల్లో అవకాశాలు కల్పించారు. ఇంకా యం.యస్‌.విశ్వనాథన్, ఇళయరాజా, జి.కె.వెంకటేష్, రమేష్‌ నాయుడు, అశ్వథామ, చక్రవర్తి, రాజ్‌-కోటి, రాజన్‌-నాగేంద్ర, కీరవాణి వంటి స్వర్ణయుగ సంగీత దర్శకులవద్ద బాలు కొన్ని వేల మరపురాని మధుర మైన పాటలు పాడారు. అలా ముప్పై అయిదు వేల పాటలకు పైగా పాడిన బాలు పాటలు పాడడం మానలేదు... ఆ కంఠస్వరం అలా పాడుతూనే వుంటుంది.... పాడుతూనే వుండాలి కూడా.

SP BALU
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

తొలి రోజుల్లో బాలు.

బాలు 1946 జూన్‌ 4న కోనేటమ్మపేట అనే గ్రామంలో జన్మించారు. తండ్రి సాంబమూర్తి నిష్టాగరిష్టుడైన హరికథా భాగవతార్‌. ఆయన భక్తిరస నాటకాలూ ప్రదర్శిస్తూ ఉండేవారు. తల్లి శకుంతలమ్మ గృహిణి. బాలుకు చిన్నతనం నుంచి సంగీతం మీద ఆసక్తి. సంగీతంలో ఆయనకు తొలి గురువు తండ్రిగారు. ఐదేళ్ల వయసులో బాలు 'భక్తరామదాసు' నాటకంలో తండ్రితో కలిసి నటించారు. ప్రాథమిక విద్యను నగిరిలో మేనమామ శ్రీనివాసరావు ఇంట పూర్తి చేసి, స్కూల్ ఫైనల్‌ విద్యను శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో కొనసాగించారు. అప్పుడు చదువులోనే కాదు, ఆటల్లోకూడా బాలు ప్రథముడే. ఆ స్కూలులో పనిచేసే జి.వి.సుబ్రహ్మణ్యం అనే మాస్టారు బాలుచేత 'చెంచులక్ష్మి' సినిమాలో సుశీల ఆలపించిన 'పాలకడలిపై శేషతల్పమున' అనే పాటను పాడించి టేప్‌ మీద రికార్డు చేశారు. బాలుకు అదొక మధురానుభూతి. మరో మేష్టారు రాధాపతి ప్రోత్సాహంతో ‘ఈ ఇల్లు అమ్మబడును’, ‘ఆత్మహత్య’, వంటి నాటికల్లో నటించి ప్రేక్షకుల మన్నన పొందారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజిలో పి.యు.సి. చదువుతుండగా మద్రాసు ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే ఒక నాటకంలో స్త్రీ పాత్ర ధరించే అవకాశం వచ్చింది. తరువాత విజయవాడ ఆకాశవాణిలో తను స్వయంగా రాసి, బాణీ కట్టి ఆలపించిన ఓ లలిత గీతానికి బహుమతి లభించింది. పి.యు.సి. పరీక్షలు రాసి నెల్లూరు చేరుకొని బాలు ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని తయారు చేశారు.

మిత్రులతో కలిసి ప్రోగ్రాములు ఇచ్చేవారు. తరువాత అనంతపురంలో ఇంజనీరింగ్‌ సీటు రావడం వల్ల అక్కడి వాతావరణం నచ్చక తిరిగి నెల్లూరు వచ్చేశారు. ప్రత్యామ్నాయంగా మద్రాసు వెళ్లి ఇంజనీరింగ్‌ విద్యకు సరిసమానమైన ఎ.ఎం.ఐ.ఇ.లో చేరారు. అక్కడ చదువుతో బాటు సినిమాల్లో అవకాశాలకోసం ప్రయత్నాలు చేశారు. ఇంజనీరింగ్‌ కోర్సు రెండో సంవత్సరం వచ్చేనాటికి బాలుకు సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ‘మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌’ అనే సినిమాలో రమాప్రభ పుట్టినరోజు వేడుకలో ‘హ్యాపీ బర్త్‌ డే టు యూ’ అంటూ పాటపాడుతూ తొలిసారి బాలు వెండితెరమీద దర్శనమిచ్చారు. తరువాత ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తనలోని నటుడికి పదును పెట్టారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరిన్ని విశేషాలు...

'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న' చిత్రంలో పాడిన వారం రోజులకే 'నక్కరే అదే స్వర్గ' అనే కన్నడ సినిమాలో పాడే అవకాశం బాలుకు వచ్చింది. తమిళంలో ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ బాలుచేత 'హోటల్‌ రంభ' అనే చిత్రం కోసం 'టంతానోడు ఇప్పడి ఇరుందు ఎత్తనై నాలాచు' అనే పాటను తొలిసారి పాడించారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. తర్వాత 'శాంతినిలయం' చిత్రంలో సుశీలతో కలిసి 'ఇయరకై ఎణ్ణుమ్‌ ఇల్లయ కణ్ణి' అనే పాట పాడారు.

కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్రకుమార్‌ సారథ్యంలో ఒకేరోజు 21 పాటలు పాడి రికార్డు సృష్టించారు. అలాగే ఒకేరోజు తమిళంలో 19 పాటలు, హిందీలో 16 పాటలు ఏకబిగిన పాడి మరో రికార్డు సాధించారు. హిందీ సంగీత దర్శకుడు ఆనంద్‌ మిలింద్‌కు 15 నుంచి 20 పాటలు ఒకేరోజు పాడి మద్రాసు తిరిగివచ్చిన సందర్భాలు కూడా వున్నాయి. బాలు మంచి డబ్బింగ్‌ ఆర్టిస్ట్, ... ఓ మంచి నటుడు కూడా. సంగీత దర్శకుడు చక్రవర్తి ప్రోద్బలంతో మొదట 'మన్మధలీల' తెలుగు చిత్రానికి డబ్బింగ్‌ చెప్పారు. తదనంతరకాలంలో కమల్‌ హసన్, రజనీకాంత్, భాగ్యరాజ్, నాగేష్, కార్తిక్, రఘువరన్, సల్మాన్‌ ఖాన్, అనిల్‌ కపూర్‌ వంటి నటులకు తన గొంతు అరువిచ్చారు. ముఖ్యంగా 'దశావతారాలు' చిత్రంలో కమల్‌ నటించిన ఏడు పాత్రలకు వైవిధ్యమైన గొంతుతో సంభాషణలు పలికిన తీరు అద్భుతమనే చెప్పాలి. అన్నమయ్య, శ్రీ సాయి మహిమ చిత్రాల్లో డబ్బింగ్‌ చెప్పినందుకు బాలు ఉత్తమ డబ్బింగ్‌ కళాకారునికి ఇచ్చే నంది బహుమతులు గెలుచుకున్నారు. రిచర్డ్‌ అటెన్‌ బరో నిర్మించిన 'గాంధీ' తెలుగు వెర్షన్‌లో గాంధీ పాత్రధారి బెన్‌ కింగ్స్‌ లేకు గాత్రదానం చేసింది బాలూనే. ఉత్తమ గాయకుడిగా బాలు ఆరు జాతీయ బహుమతులు అందుకున్నారు. అవి శంకరాభరణం (1979), ఏక్‌ దూజే కే లియే (1981), సాగరసంగమం (1983), రుద్రవీణ (1988), సంగీతసాగర గానయోగి పంచాక్షర గవాయ్‌ (1995-కన్నడ), మిన్సార కణవు (1996-తమిళం).

జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకునిగా ‘మైనే ప్యార్‌ కియా’ చిత్రానికి ఫిలింఫేర్‌ బహుమతి అందుకున్నారు. దక్షిణ భారత సినిమాల్లో ఉత్తమ గాయకునికి ఇచ్చే ఫిలింఫేర్‌ బహుమతులు బాలును ఏడుసార్లు వరించాయి. ఉత్తమ గాయకునిగా 18 నంది బహుమతులతో బాటు ఉత్తమ సంగీత దర్శకునిగా ‘మయూరి’ చిత్రానికి నంది బహుమతి అందుకున్నారు. ‘మిథునం’ సినిమాలో నటనకు ప్రత్యేక జూరీ బహుమతి లభించింది. తమిళ చిత్రాల్లో ఆలపించిన పాటలకు నాలుసార్లు, కన్నడ సినిమాల్లో పాడిన పాటలకు మూడుసార్లు ఉత్తమ గాయకుని బహుమతులు కూడా బాలుకు దక్కాయి. రాజాలక్ష్మీ ఫౌండేషన్, సుర్‌ సేన్, అక్కినేని, లతామంగేష్కర్‌ జాతీయ బహుమతుల తోబాటు లెక్కలేనన్ని ఇతర బహుమతులు బాలును వరించాయి. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డునిచ్చి ఈయన్ను సత్కరించింది. 2011లో పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. బాలు తనయుడు చరణ్‌.. మంచి గాయకుడుగా, సినీ నిర్మాతగా స్థిరపడ్డారు.

SP BALU
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఇదీ చూడండి : తెలంగాణలో త్వరలో సినిమా షూటింగ్​లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.