Ramcharan Shankar movie: శంకర్ దర్శకత్వంలో రామ్చరణ్ కథానాయకుడిగా 'ఆర్సీ 15' తెరెకక్కుతోంది. అయితే ఈ మూవీలో తమిళ స్టార్ డైరెక్టర్, నటుడు ఎస్ జే సూర్యను ప్రతినాయకుడిగా తీసుకోనున్నారని తెలుస్తోంది. సైకో విలన్గా ఆయన కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట! త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.
ఎస్ జే సూర్య.. ఇప్పటికే పలు చిత్రాల్లో విలన్గా నటించారు. మహేశ్బాబు 'స్పైడర్', విజయ్ 'అదిరింది' సహా పలు మూవీస్లో ప్రతినాయకుడిగా కనిపించారు. ఇటీవలే 'మానాడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
![sj surya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14468652_sjsurya.jpg)
కాగా, 'ఆర్సీ 15'లో చరణ్ రెండు విభిన్న గెటప్లలో కనిపించనున్నారని తెలిసింది. ఉన్నతాధికారిగా ఒక గెటప్లో సీరియస్గా కనిపిస్తూనే సాధారణ వ్యక్తిగా మరో గెటప్లో అలరించనున్నారట.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుపుకుంటోంది. ఇక ఈ మూవీలో కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తోంది. దిల్రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్పైన ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.
ఇదీ చూడండి: EEsha Gupta gallery: ఈషా గుప్తా హాట్ స్టిల్స్