బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ మరణించి ఐదు నెలలు దాటింది. ఇప్పటికీ ఆయన అభిమానులు ఆ చేదు నిజాన్ని నమ్మలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉన్న సుశాంత్ మిత్రుడు సిద్ధార్థ్ తాజాగా స్పందించాడు. సుశాంత్ మృతికి ఐదు రోజుల ముందు ఒకసారి కలుద్దామని సంక్షిప్త సందేశాలు పంపించుకున్నామన్నాడు.
![Siddharth Gupta opens up on the last text from the late actor Sushant Singh Rajput](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9724818_gfsd.jpg)
"మనమింకా పరిపూర్ణత సాధించాలని సుశాంత్ అంటుండేవాడు. ప్రతి రోజూ కొత్తదనం కోరుకునేవాడు. ఏదో సాధించాలని చెబుతుండేవాడు. అతని వల్లే నేను కూడా కొత్తగా ఆలోచించడం, కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకోవడం నేర్చుకున్నా. తన చుట్టుపక్కల వాళ్లను ఎంతో ప్రేమిస్తాడు. ఒక స్నేహితుడిగా నాకు ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు. అతనికి సహచరుడిగా ఉండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా."