2005లో ప్రముఖ దర్శకుడు శంకర్-హీరో విక్రమ్ కాంబోలో వచ్చిన 'అన్నియన్', తెలుగులో 'అపరిచితుడు'గా విడుదలై.. రెండు భాషల్లోనూ ఘన విజయం సాధించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందించే ప్రయత్నాలో శంకర్ ఉన్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.
శంకర్-బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. అది 'అన్నియన్'కు సీక్వెల్ అని ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో టాక్. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.
ప్రస్తుతం శంకర్ కమల్హాసన్తో తెరకెక్కిస్తున్న 'భారతీయుడు 2' సినిమాను పక్కనపెట్టి, హీరో రామ్చరణ్తో ప్రతిష్ఠాత్మకంగా ఓ భారీ ప్రాజెక్ట్ను తెరకెక్కించే పనుల్లో ఉన్నారు. ఇది పూర్తవ్వగానే 'అన్నియన్' సీక్వెల్ సెట్స్పైకి వెళ్తుందని తెలిసింది. మరోవైపు రణ్వీర్.. త్వరలోనే 'సూర్యవంశీ', '83' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం 'జయేష్భాయ్ జోర్దార్', 'సర్కస్' సినిమాల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: పెళ్లి తర్వాత కెరీర్పై మెహరీన్ ఏమందంటే?