సూపర్స్టార్ మహేశ్బాబు మరో రికార్డు సెట్ చేశాడు. తను నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు'ను కేరళలో సుమారు 30 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ అత్యధిక చోట్ల విడుదలవుతున్న తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. అందుకు సంబంధించిన పోస్టర్ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది.
ఆర్మీ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేజర్గా కనిపించనున్నాడు మహేశ్. రష్మిక హీరోయిన్. విజయశాంతి, ప్రకాశ్రాజ్, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. అనిల్ సుంకర-దిల్రాజు-మహేశ్ సంయుక్తంగా నిర్మించారు.
ఇది చదవండి: "సరిలేరు..'తో థ్రిల్కు గురవుతారు.. అప్పటివరకు ఆగండి'