Samantha Yasodha movie: సమంత.. ఫుల్ బిజీగా మారిపోయారు. వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా..' సాంగ్తో ఇటీవల సెన్సేషన్ సృష్టించారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి యశోద. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
ఇంతకీ విషయం ఏంటంటే?
సమంత.. 'యశోద' అనే సైంటిఫిక్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. పాన్ఇండియా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని మూడో వంతు భాగాన్ని లగ్జరీ హోటల్లో తీయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో 35-40 రోజులు స్టార్ హోటల్లో షూటింగ్ చేయడం కష్టమైన విషయం! అందుకే దాదాపు రూ.3 కోట్లు ఖర్చు చేసి మూడు నెలలల్లో లగ్జరీ హోటల్ సెట్ను తీర్చిదిద్దారు. ఇందుకోసం 200 మందికిపైగా కష్టపడ్డారు.

ప్రస్తుతం ఎక్కువ భాగం షూటింగ్ అంతా ఆ సెట్లోనే జరుగుతోంది. సమంతకు ఆ సెట్ తెగ నచ్చేసిందంట. దీంతో ఉన్న ఇంటిని ఖాళీ చేసి మరీ సెట్లో సినిమా ఆయ్యేంత వరకు సెటిల్ అవ్వాలని చూస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని నిర్మాతలకు చెప్పి, ఆ సెట్లో ఉండేందుకు సరిపడా సరంజామాను సర్దుకుని వెళ్లినట్లు సన్నిహితులు చెప్తున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ను ఏప్రిల్ కల్లా పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వేసవిలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నామని ఆయన అన్నారు. హరి-హరీశ్ దర్శక ద్వయం ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.
ఇదీ చూడండి:
ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షోకి ప్రభాస్.!