ETV Bharat / sitara

Ravi Teja: 1990ల్లో నాటి వాస్తవ కథతో​!

author img

By

Published : Jun 7, 2021, 8:01 AM IST

Updated : Jun 7, 2021, 9:37 AM IST

కొత్త దర్శకుడు శరత్​ మండవ(Sarath Mandava) దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ చిత్రంలో మాస్​ మహారాజ్​ రవితేజ(Raviteja) నటిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే కథతో వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Ravi Teja joins hands with debutant director Sarath Mandava story based on real events
Ravi Teja: 1990ల్లో నాటి వాస్తవ కథతో​!

కొత్త దర్శకులతో సినిమాలు చేయడంలో ముందుంటారు మాస్​ మహారాజ్​ రవితేజ(Raviteja). ఆయన కథానాయకుడిగా శరత్‌ మండవ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రచయితగా నిరూపించుకున్న శరత్‌ మండవ(Sarath Mandava)కు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. ఉగాది రోజున ప్రారంభమైన ఈ కలయికలో చిత్రాన్ని ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందనుంది.

అప్పట్లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ కథను తీర్చిదిద్దారు దర్శకుడు శరత్​. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. స్వరకర్త స్యామ్‌ సీఎస్‌ నేతృత్వంలో ప్రస్తుతం సంగీత చర్చలు సాగుతున్నాయి. 1990లనాటి లుక్‌ కోసం రవితేజ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. ఆయన కనిపించే విధానం కొత్తగా, ఇదివరకెప్పుడూ కనిపించని రీతిలో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇందులో రవితేజకు జోడీగా ఇద్దరు కథానాయికలు నటిస్తారు. అందులో ఒకరు దివ్యాంశ కౌశిక్‌(Divyansha Kaushik). మరొకరి ఎంపికపై దృష్టిపెట్టింది చిత్రబృందం. తమిళ చిత్రం 'కర్ణన్‌'లో నటించిన రాజీషా విజయన్‌(Rajisha Vijayan) పేరునూ పరిశీలించినట్టు తెలిసింది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి సత్యన్‌ సూరన్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఇదీ చూడండి: శంకర్​ సినిమాలో యంగ్​ లీడర్​గా చరణ్​​?

కొత్త దర్శకులతో సినిమాలు చేయడంలో ముందుంటారు మాస్​ మహారాజ్​ రవితేజ(Raviteja). ఆయన కథానాయకుడిగా శరత్‌ మండవ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రచయితగా నిరూపించుకున్న శరత్‌ మండవ(Sarath Mandava)కు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. ఉగాది రోజున ప్రారంభమైన ఈ కలయికలో చిత్రాన్ని ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందనుంది.

అప్పట్లో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ కథను తీర్చిదిద్దారు దర్శకుడు శరత్​. ఇప్పటికే స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. స్వరకర్త స్యామ్‌ సీఎస్‌ నేతృత్వంలో ప్రస్తుతం సంగీత చర్చలు సాగుతున్నాయి. 1990లనాటి లుక్‌ కోసం రవితేజ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నట్టు సమాచారం. ఆయన కనిపించే విధానం కొత్తగా, ఇదివరకెప్పుడూ కనిపించని రీతిలో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇందులో రవితేజకు జోడీగా ఇద్దరు కథానాయికలు నటిస్తారు. అందులో ఒకరు దివ్యాంశ కౌశిక్‌(Divyansha Kaushik). మరొకరి ఎంపికపై దృష్టిపెట్టింది చిత్రబృందం. తమిళ చిత్రం 'కర్ణన్‌'లో నటించిన రాజీషా విజయన్‌(Rajisha Vijayan) పేరునూ పరిశీలించినట్టు తెలిసింది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ చిత్రానికి సత్యన్‌ సూరన్‌ కెమెరా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఇదీ చూడండి: శంకర్​ సినిమాలో యంగ్​ లీడర్​గా చరణ్​​?

Last Updated : Jun 7, 2021, 9:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.