ETV Bharat / sitara

'పుష్ప' షూటింగ్ అప్​డేట్.. రెండు షెడ్యూల్స్ పూర్తి

author img

By

Published : Feb 6, 2021, 2:18 PM IST

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'పుష్ప'. ఈ సినిమా రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నట్లు వెల్లడించింది చిత్రబృందం.

Pushpa completes two hectic shedules
పుష్ప షూటింగ్ అప్​డేట్

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా రెండు కీలక షెడ్యూల్స్​ను పూర్తి చేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియాలో చిత్రీకరణ సజావుగా సాగినట్లు వెల్లడించింది. ఈ షూటింగ్​కు ఎంతగానో సహకరించిన అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది.

"రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో 'పుష్ప' చిత్రం రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అక్కడి ప్రజలు, పాలకవర్గానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి సహకారం లేకపోతే షూటింగ్ ఇంత సజావుగా జరిగేది కాదు."

-పుష్ప టీమ్

'ఆర్య', 'ఆర్య-2' తర్వాత సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్‌ చిత్రం కావడం వల్ల 'పుష్ప'పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇందులో రష్మిక హీరోయిన్​గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది.

స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా రెండు కీలక షెడ్యూల్స్​ను పూర్తి చేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియాలో చిత్రీకరణ సజావుగా సాగినట్లు వెల్లడించింది. ఈ షూటింగ్​కు ఎంతగానో సహకరించిన అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది.

"రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో 'పుష్ప' చిత్రం రెండు కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అక్కడి ప్రజలు, పాలకవర్గానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి సహకారం లేకపోతే షూటింగ్ ఇంత సజావుగా జరిగేది కాదు."

-పుష్ప టీమ్

'ఆర్య', 'ఆర్య-2' తర్వాత సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్‌ చిత్రం కావడం వల్ల 'పుష్ప'పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇందులో రష్మిక హీరోయిన్​గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.