ETV Bharat / sitara

కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి - మాండపు కుంజుట్టన్

ప్రముఖ మలయాళ సినీ రచయిత, నటుడు మాండపు కుంజుట్టన్​(81) మరణించారు. గతవారం కరోనా బారిన పడిన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.

Malayalam writer and actor Madampu Kunjukuttan passes away
కరోనాతో మరో ప్రముఖ నటుడు మృతి
author img

By

Published : May 11, 2021, 12:12 PM IST

మలయాళ నటుడు మాండపు కుంజుట్టన్(81) మంగళవారం​ కన్నుమూశారు. గతవారం కరోనా బారిన పడిన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మలయాళ చిత్రాల్లో రచయితగా, స్క్రీన్​ప్లే రైటర్​గానూ గుర్తింపు పొందిన కుంజుట్టన్​.. గత కొంతకాలంగా క్యాన్సర్​తో బాధపడుతున్నారు.

కుంజుట్టన్​ అసలు పేరు మాండబు శంకరన్​ నంబూతిరి. 'పోథెన్వావ', 'వడకుమ్నాథన్', 'అగ్ని నక్షత్రం', 'అగ్నిసాక్షి', 'దేశదానం', 'అనచండం', 'అరమ్ తంబురాన్' వంటి మలయాళ చిత్రాలలో ఆయన నటించారు. వీటితో పాటు 'కరుణం', 'పరినామం', 'మకాల్కు', 'దేశదానం', 'గౌరిశంకరం' సినిమాలకు రచయితగా పనిచేశారు. జయరాజ్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'కరుణమ్​' సినిమాకు గానూ ఉత్తమ స్క్రీన్​ప్లే విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు కుంజుట్టన్.

మలయాళ నటుడు మాండపు కుంజుట్టన్(81) మంగళవారం​ కన్నుమూశారు. గతవారం కరోనా బారిన పడిన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మలయాళ చిత్రాల్లో రచయితగా, స్క్రీన్​ప్లే రైటర్​గానూ గుర్తింపు పొందిన కుంజుట్టన్​.. గత కొంతకాలంగా క్యాన్సర్​తో బాధపడుతున్నారు.

కుంజుట్టన్​ అసలు పేరు మాండబు శంకరన్​ నంబూతిరి. 'పోథెన్వావ', 'వడకుమ్నాథన్', 'అగ్ని నక్షత్రం', 'అగ్నిసాక్షి', 'దేశదానం', 'అనచండం', 'అరమ్ తంబురాన్' వంటి మలయాళ చిత్రాలలో ఆయన నటించారు. వీటితో పాటు 'కరుణం', 'పరినామం', 'మకాల్కు', 'దేశదానం', 'గౌరిశంకరం' సినిమాలకు రచయితగా పనిచేశారు. జయరాజ్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'కరుణమ్​' సినిమాకు గానూ ఉత్తమ స్క్రీన్​ప్లే విభాగంలో జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు కుంజుట్టన్.

ఇదీ చూడండి: కరోనా బాధితుల కోసం హీరోయిన్​ ఆస్పత్రి నిర్మాణం​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.