మహేశ్బాబు కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'మహర్షి'. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సంబంధిత ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు సూపర్ స్టార్. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా, అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషించాడు.

ఈ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి. సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న మహర్షి సినిమా మే 9న విడుదల కానుంది. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇది చదవండి: మహర్షి సెట్లో కూతురుతో సరదాగా కాసేపు