ETV Bharat / sitara

నాకు సహకారాన్ని అందిస్తున్న యోధులు​ వీరే'

author img

By

Published : Aug 25, 2020, 8:38 PM IST

దాదాపు ఐదు నెలల విరామం తర్వాత తిరిగి తన పనిని ప్రారంభించినట్లు వెల్లడించింది బాలీవుడ్​ నటి కరీనా కపూర్​. మంగళవారం ఓ ఫొటోషూట్​లో పాల్గొన్న ఈ నటి దానికి సంబంధించిన ఓ చిత్రాన్ని అభిమానులతో పంచుకుంది.

Kareena gets back to normal, shares glimpse from photoshoot
నాకు సహకారాన్ని అందిస్తున్న యోధులు​ వీరే: కరీనా

బాలీవుడ్​ నటి కరీనా కపూర్​ మంగళవారం ఓ ఫొటోషూట్​లో పాల్గొంది. దాని కోసం సిద్ధమవుతున్న క్రమంలో తీసిన ఓ చిత్రాన్ని ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది. తన యోధుల సహాయంతో షూట్​ కోసం రెడీ అవుతున్నట్లు తెలిపింది. అందులో కరీనా​ అద్దంలో చూసుకుంటుండగా.. ఆమె సహాయక సిబ్బందిలో ఒకరు మేకప్​ వేస్తున్నారు.

కరోనా వైరస్​ వ్యాప్తి నియంత్రణకు కరీనా సిబ్బంది తగిన జాగ్రత్తలు చేపడుతున్నారని ఆ చిత్రం ద్వారా తెలుస్తోంది. "మరో రోజు, మరొక షూట్​.. నా యోధులు.. మిస్​ యూ పూనీ" అని పోస్ట్​​ చేసింది కరీనా కపూర్​.

​ఆమెకు సంబంధించిన కొన్ని విశేషాలను ఇన్​స్టాగ్రామ్​లో తరచుగా పంచుకుంటూ ఉంటుంది నటి కరీనా. ఇటీవలే వినాయక చవితి రోజున తన కుమారుడు తైమూర్​ అలీఖాన్​ లెగో ఇటుకలతో చేసిన గణేశ్​ విగ్రహానికి పూజ చేస్తున్న చిత్రాన్ని షేర్ చేసింది .

బాలీవుడ్​ నటి కరీనా కపూర్​ మంగళవారం ఓ ఫొటోషూట్​లో పాల్గొంది. దాని కోసం సిద్ధమవుతున్న క్రమంలో తీసిన ఓ చిత్రాన్ని ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది. తన యోధుల సహాయంతో షూట్​ కోసం రెడీ అవుతున్నట్లు తెలిపింది. అందులో కరీనా​ అద్దంలో చూసుకుంటుండగా.. ఆమె సహాయక సిబ్బందిలో ఒకరు మేకప్​ వేస్తున్నారు.

కరోనా వైరస్​ వ్యాప్తి నియంత్రణకు కరీనా సిబ్బంది తగిన జాగ్రత్తలు చేపడుతున్నారని ఆ చిత్రం ద్వారా తెలుస్తోంది. "మరో రోజు, మరొక షూట్​.. నా యోధులు.. మిస్​ యూ పూనీ" అని పోస్ట్​​ చేసింది కరీనా కపూర్​.

​ఆమెకు సంబంధించిన కొన్ని విశేషాలను ఇన్​స్టాగ్రామ్​లో తరచుగా పంచుకుంటూ ఉంటుంది నటి కరీనా. ఇటీవలే వినాయక చవితి రోజున తన కుమారుడు తైమూర్​ అలీఖాన్​ లెగో ఇటుకలతో చేసిన గణేశ్​ విగ్రహానికి పూజ చేస్తున్న చిత్రాన్ని షేర్ చేసింది .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.