ETV Bharat / sitara

చైనా ఉత్పత్తులు నిషేధించాలి: కంగన

author img

By

Published : Jun 27, 2020, 9:38 PM IST

చైనా ఉత్పత్తులను నిషేధించి భారత ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుతున్నారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్. భారత భూభాగంలోని లద్దాఖ్​ను చైనా లాగేసుకోవాలని చూడటం దారుణమని అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

Kangana Ranaut calls for boycotting Chinese products
కంగనా

తన వ్యాఖ్యలతో బాలీవుడ్​లో ఫైర్ బ్రాండ్​గా తయారయ్యారు నటి కంగనా రనౌత్. సామాజిక సమస్యలతో పాటు సినీ పరిశ్రమలో బంధుప్రీతి గురించి తరచూ మాట్లాడుతూ ముక్కుసూటి హీరోయిన్​గా పేరుతెచ్చుకున్నారు. ఇటీవల సుశాంత్​ రాజ్​పుత్ ఆత్మహత్యపై కీలక వ్యాఖ్యలు చేసిన కంగన.. తాజాగా చైనా వస్తువులను పూర్తిగా నిషేధించాలంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోను కంగన టీమ్​ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. గల్వాన్‌ లోయలో చైనా దాడిలో కల్నల్‌ సంతోష్ బాబు సహా 20 మంది భారతీయ జవాన్లు మరణించిన నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు.

"భారత్‌కు చెందిన భూభాగాన్ని చైనా ఆక్రమించడం అంటే మన శరీరంలో ఒక భాగాన్ని తీసుకోవడం వంటింది. మన చేతి నుంచి వేళ్లను, భుజాల నుంచి చేతులను వేరేవాళ్లు విరిచేస్తుంటే మనకెంత నొప్పి కలుగుతుంది.? లద్దాఖ్​​ను చైనా ఆక్రమిస్తుంటే అలాంటి బాధే ఇప్పుడు మన దేశం అనుభవిస్తోంది. ఈ పోరులో 20 మంది సైనికులు అమరులయ్యారు. బోర్డర్​లో సైనికులు వారి శాయశక్తులా ప్రయత్నిస్తుంటే మనం మనకి తోచింది చేయాలి. స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీజీ ఇచ్చిన పిలుపు మరిచిపోయారా. అప్పుడు బ్రిటీష్​ వస్తువులను ఎలా బహిష్కరించామో ఇప్పుడు చైనా వస్తువులను అలాగే బహిష్కరించాలి. అపుడే చైనాకు వెళ్లే రెవెన్యూ తగ్గిపోతుంది."

-కంగనా రనౌత్, హీరోయిన్

ప్రస్తుతం భారత్​-చైనా మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పలువురు చైనాకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. చైనా ఉత్పత్తులను నిషేధించాలని కోరుతున్నారు.

తన వ్యాఖ్యలతో బాలీవుడ్​లో ఫైర్ బ్రాండ్​గా తయారయ్యారు నటి కంగనా రనౌత్. సామాజిక సమస్యలతో పాటు సినీ పరిశ్రమలో బంధుప్రీతి గురించి తరచూ మాట్లాడుతూ ముక్కుసూటి హీరోయిన్​గా పేరుతెచ్చుకున్నారు. ఇటీవల సుశాంత్​ రాజ్​పుత్ ఆత్మహత్యపై కీలక వ్యాఖ్యలు చేసిన కంగన.. తాజాగా చైనా వస్తువులను పూర్తిగా నిషేధించాలంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియోను కంగన టీమ్​ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. గల్వాన్‌ లోయలో చైనా దాడిలో కల్నల్‌ సంతోష్ బాబు సహా 20 మంది భారతీయ జవాన్లు మరణించిన నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు.

"భారత్‌కు చెందిన భూభాగాన్ని చైనా ఆక్రమించడం అంటే మన శరీరంలో ఒక భాగాన్ని తీసుకోవడం వంటింది. మన చేతి నుంచి వేళ్లను, భుజాల నుంచి చేతులను వేరేవాళ్లు విరిచేస్తుంటే మనకెంత నొప్పి కలుగుతుంది.? లద్దాఖ్​​ను చైనా ఆక్రమిస్తుంటే అలాంటి బాధే ఇప్పుడు మన దేశం అనుభవిస్తోంది. ఈ పోరులో 20 మంది సైనికులు అమరులయ్యారు. బోర్డర్​లో సైనికులు వారి శాయశక్తులా ప్రయత్నిస్తుంటే మనం మనకి తోచింది చేయాలి. స్వాతంత్య్రోద్యమ సమయంలో గాంధీజీ ఇచ్చిన పిలుపు మరిచిపోయారా. అప్పుడు బ్రిటీష్​ వస్తువులను ఎలా బహిష్కరించామో ఇప్పుడు చైనా వస్తువులను అలాగే బహిష్కరించాలి. అపుడే చైనాకు వెళ్లే రెవెన్యూ తగ్గిపోతుంది."

-కంగనా రనౌత్, హీరోయిన్

ప్రస్తుతం భారత్​-చైనా మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పలువురు చైనాకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. చైనా ఉత్పత్తులను నిషేధించాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.